8, జనవరి 2013, మంగళవారం

ఎక్కడికి పోతున్నాం మనం ఇంక చాలు .....

రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్యం ఈ మధ్యన ఎక్కువైంది.తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకాయనేమో ఆంధ్ర వాళ్ళను తరిమి కొట్టండి అంటాడు.ఇంకొక ఆయనేమో ఒక మెజారిటీ మతానికి వ్యతిరేకంగా ప్రజల హర్షధ్వానాల మధ్యన తన నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడాడు.ఈ మధ్యన హిందూ దేవుళ్ళను ,దేవతలను విమర్శిం చడం ఒక ఫ్యాషన్ అయి పోయింది.ఒక జీసస్ కానీ ,మహమ్మద్ ప్రవక్త కానీ ,రాముడు కానీ ,కృష్ణుడు కానీ ఇన్ని రోజులు ఉన్నా కూడా  ప్రజలకు  తమ ఆరాధ్య దైవాలుగా ఉన్నారంటే నే చరిత్రలో వాళ్లకు ఒక బలమైన స్థానం ఉంది.వాళ్ళను విమర్శించే స్థాయిలో మనం ఉన్నామా అని ఒక సారి మనం ప్రశ్నించు  కోవాలి.ఇదా మనం చదివిన తర్వాత నేర్చుకున్న నాగరికత ?చదువులు మనలను ఇంత సంకుచితంగా తయారు చేసాయా?మేం చిన్నప్పుడు ఉర్సు జరిగేటప్పుడు దర్గాలకు వెళ్లి   చక్కర పంచి వచ్చేవాళ్ళం.ఇప్పటికీ కూడా పీర్ల పండుగల లో ,దస్తగిరి స్వామి పండుగలలో చాలా మంది హిందువులు మనస్పూర్తిగా ,ఉత్సాహంగా పాల్గొంటున్నారు.మెజారిటీ హిందువులకు పరమత సహనం ఉంది.ఊర్లలో చర్చి లు మసీదులు కట్టుకోవడానికి హిందువులు సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి.దీన్ని హిందువుల  చేతగాని తనంగా చూస్తున్నారు.ఈ మధ్యన మాధ్యమాలల్లో కూడా చర్చ చేయడానికి ఏమీ దొరకక పోతే కుహనా మేధావులను కూర్చో బెట్టి దేవుళ్ళ గురించి  చర్చలు చేస్తున్నారు.ఒకాయనేమో ఆయన చూసి వచ్చినట్లు రావణుడు తమ దేవుడు అని పురాణాలకు వక్ర భాష్యం చెపుతాడు .దీన్ని చర్చకు పెడతారు మీడియా వాళ్ళు.ఇది ఆపుతే బాగుంటుంది.హిందూ మతాన్ని చాలా చులకన చేసి సినిమాలలో కూడా  చూపుతున్నారు. మనలను మనం గౌరవించు కోలేనప్పుడు ఇతరులు మనలను ఎందుకు గౌరవిస్తారు.తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రాంతాలను ,మతాలను గురించి రెచ్చ గొట్టే విధంగా మాట్లాడే వాళ్ళను ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలి.

2 కామెంట్‌లు:

శ్రీలలిత చెప్పారు...


ఉన్నదున్నట్టు సరిగ్గా చెప్పారు...

పూర్ణప్రజ్ఞాభారతి చెప్పారు...

వినాశకాలే విపరీత బుద్ధీ అంటే ఇదే ధోరణేమో...

పూర్ణప్రజ్ఞాభారతి
pragnabharathy.blogspot.in