23, నవంబర్ 2012, శుక్రవారం

బెంగుళూరు లో బాడుగ ఇంటిలో ఉన్న బాధలు అన్నీ ఇన్నీ కావు..

బెంగుళూరు లో ఇండ్లు బాడుగకు తీసుకోవడంలో ఉన్న బాధలు అన్నీ ఇన్నీ కావు.ఎక్కడ లేని విధంగా పది నెలల అడ్వాన్సు ఇవ్వ వలసి ఉంటుంది.ఇండ్లు వెతికి పెట్టిన ఏజెంట్ కు ఒక నెల బాడుగ ఇవ్వాలి.ఇంతా చేస్తే వాళ్ళు అగ్రిమెంటు రాసేది 11 నెలలకు మాత్రమే .ఆ తర్వాత వాళ్లకు ఇష్టం అయితే 10 శాతం పెంపు దలతో అక్కడ ఉండ  వచ్హు .లేకుంటే తిరిగి ఇళ్ళ వెతుకులాట కొనసాగించాలి.వాళ్ళ ఇల్లు ఖాళీ చేసేటప్పుడు ఇంటికి రంగులు వేయించడానికి ,ఏవైనా కుళాయిలు  (taps) పొతే (దానికి కాలం తీరి పోయినా సరే) అన్నింటికి మన అడ్వాన్సు డబ్బులు పట్టుకుని చేయించుకుంటారు.ఇంటి యజమానులు వాళ్ళ ఇంటికి 5 సంవత్సరాలకు  ఒకసారి  కూడా రంగులు వేయించ కున్నా బాడుగ ఇళ్ళకు మాత్రం ప్రతి సంవత్సరం రంగులు వేయిస్తారు.ఎందుకంటే  సొమ్ము ఒకడిది సోకు ఒకడిది.సొమ్ము బాడుగ వాళ్ళది,సోకు ఇంటి యజమానులది.దీనివలన బెంగుళూరు లో రంగులు కొట్టే  పని వాళ్లకు ,బాడుగ వాహనాలు పెట్టుకున్న వాళ్లకు  చాలా డిమాండ్ ఉంది,ఇదే పనిగా జీవనం సాగించే వాళ్ళు చాలా మంది ఉన్నారు.బెంగుళూరు లో ఒక సారి ఇల్లు మారాలంటే  కనీసం 30 వేల రూపాయల ఖర్చు వస్తుంది .అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు  అన్నీ ఒక వైపే ఉంటాయి.అన్నీ ఇంటి యజమానులకు అనుకూలంగా ఉంటాయి.చాలా సందర్భాలలో బాడుగకు ఉన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేటప్పుడు వాళ్ళ అడ్వాన్సు ఇవ్వకుండానో  లేక అందులో చాలా మటుకు దానికో ,దీనికో అని పట్టుకొని  సతాయించిన సందర్భాలు చాలా ఉన్నాయి.


22, నవంబర్ 2012, గురువారం

డోలు వచ్చి మద్దెలతో చెప్పుకున్నట్లు ఉంది !

ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి పాద యాత్రలు మొదలు పెట్టి ,ప్రజల చెంతకు పోయి వాళ్ళ సమస్యలు వినే  బదులు  తమకు  కాళ్ళు బొబ్బలె క్కినాయని నాయకులు  తమ సమస్యలు చెబితే ప్రజలేం చేయాలి,కాళ్ళు నొప్పులు పెడుతుంటే ఇంట్లో కూర్చోమని చెప్పడం తప్ప !



13, నవంబర్ 2012, మంగళవారం

దీపావళి శుభాకాంక్షలు

బ్లాగు మిత్రులందరికి దీపావళి శుభాకాంక్షలు .ఈ దీపావళి వాళ్ళ జీవితాలలో సరికొత్త  వెలుగులు  నింపాలని ఆశిస్తూ ....

11, నవంబర్ 2012, ఆదివారం

మన ఆహారం గురించి చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము!

చాలా మంది సినిమా వాళ్ళను మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ  చేసేటప్పుడు  ఖచ్చితంగా అడిగే ప్రశ్న ఒకటి ఉంటుంది.అదేమంటే మీకు ఏ ఆహారం  అంటే ఇష్టం అని ,అప్పుడు చాలా మంది చెప్పే జవాబు వాళ్లకు ఇటాలియన్ ,మెక్సికన్ ,కాంటినెంటల్  ఆహారం అంటే ఇష్టం అని చెబుతారు.అదేంటో నాకర్థం కాని విషయం ,వాళ్ళు చిన్నప్పటి నుండి అదే తిని బ్రతుకు తున్నట్లు చెబుతారు.తాము చిన్నప్పటి నుండి తిన్న రోటీ ,కూరలు ,అన్నం గురించి చెప్పనే చెప్పరు .సాధారణంగా మనం చిన్నప్పటి  నుండి   తినే ఆహారానికే మన నాలుక మీద ఉండే రుచి మొగ్గలు అలవాటు పడి ఉంటాయి.వేరే ఆహారం ఏది తిన్నా అది మనం ప్రతి రోజూ తినలేము,అది మనకు ఇష్టం కాదు.వీళ్ళందరినీ చూసి ప్రతి అడ్డమైన వాళ్ళు కొంచం ఇంగ్లీషు మాట్లాడడం వస్తే చాలు వాళ్ళు కూడా పిజ్జా లు ,బర్గర్లను గురించి మనది కాని ఆహారం గురించి వావ్ అంటూ గొప్పగా చెబుతూ ఉంటారు.ఎంతో ఆరోగ్య కరమైన మన ఆహారం గురించి చెప్పాలంటే వీళ్ళకు నామోషి.వాళ్లకు కూడా తెలుసు తాము తమ ఆత్మ ద్రోహం చేసుకొని చెబుతున్నామని,కానీ ఫాల్స్ ప్రిస్టేజి కి పోతున్నారు. మనం తినే ,మనకు ఇష్టమైన ఆహారం గురించి చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. ఈ మధ్యన నడమంత్రపు సిరి వచ్చిన వాళ్లకు ఇది మరీ ఎక్కువైంది.


8, నవంబర్ 2012, గురువారం

భారతదేశం నడిచే వాళ్లకి స్థానం లేనంతగా అభివృద్ధి చెందింది!

ఈ మధ్యన పెద్ద పెద్ద పట్టణాలలో నడిచే వారికి దారి ఉండడం లేదు.రోడ్లు కార్లు మరియు బైకులతో కిక్కిరిసి ఉంటున్నాయి.నడవడానికి కొంచం కూడా జాగా ఉండడం లేదు.పాదచారులు నడవడానికి ఉద్దేశించిన ఫుట్ పాత్  లు చాలా చోట్ల ఉండడం లేదు,ఒక వేల ఉంటే వాటిని అక్కడ ఉన్న దుఖానాల వారు తమ వస్తువులను ఉంచుకోవడానికి ,పార్కింగ్ కోసం ఉపయోగించు కుంటున్నారు.భారతదేశం  నడిచే వాళ్లకి స్థానం లేనంతగా అభివృద్ధి చెందింది.