26, జనవరి 2013, శనివారం

చాలా ఆలస్యం అయ్యింది!

నిన్న ఉండవల్లి గారు మీటింగ్ పెట్టి సమైఖ్యాంధ్ర ఏర్పడడం గురించి కొన్ని  సాక్ష్యాలు  చెప్పారు.ఇది చాలా ఆలస్యం అయ్యిది.ఈ విషయం టి.ఆర్.ఎస్ పార్టీ పెట్టి వాళ్ళు తమకు అన్యాయం జరిగిందని ప్రచారం చేసినప్పటి నుండి ఇరు ప్రాంతాల మేధావులను కూర్చోబెట్టి చెప్పి ఉండవలిసింది.అలా చెప్పకుండా ఈ 10 సంవత్సరాలు ఈ తెలంగాణా అనే అంశాన్ని అన్ని పార్టీలు తమకు ఇష్టం వచ్చినట్లు తమ రాజకీయాల కోసం వాడుకొని ఇప్పుడు చెప్పి ఉపయోగం లేదు.ఇప్పుడు తెలంగాణా ప్రజలు ఏమీ వినిపించుకునే   స్థితి లో లేరు.ఆ విధంగా అన్ని రాజకీయ పార్టీలు  వాళ్ళ మనస్సులను మార్చి వేసాయి.ఇప్పుడు నిజాలు చెప్పినా  వాళ్ళు  వినే  పరిస్థితి లో లేరు.రాజకీయ నాయకులు  భావోద్వేగాలను రెచ్చ గొట్టి ప్రజలను ఒక రకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్ళారు. ఇది రాజకీయ నాయకులు చేసిన,వాళ్ళు మాత్రమే చేయగలిగిన  మరొక ఘనమైన నిర్వాకం .   

23, జనవరి 2013, బుధవారం

చంద్రబాబు గారు ప్రత్యక్ష ఉద్యమం లోకి దిగ వలసి రావచ్చు!

చంద్రబాబు గారు తెలంగాణా లో పాదయాత్ర సందర్భంగా తెలంగాణా కు మద్దత్తు తెలిపి ఇబ్బందుల్లో పడ్డారనిపిస్తుంది.ఒక వేల తెలంగాణా ఇస్తే పరవాలేదు.సీమాంధ్ర లో వచ్చే ఎన్నికలలో సీట్లు రాకున్నా తెలంగాణా లో కొన్నైనా వస్తాయి.ఒక వేల తెలంగాణా ఇవ్వక పోతే సీమాంధ్ర లో సీట్లు ఎలాగు రావు ,తెలంగాణా లో టి.ఆర్.ఎస్ ను కాదని టి.డి.పి ని నమ్మి ఓట్లు వేయరు.తెలంగాణా లో ఓట్లు కావాలంటే ఆయన ప్రత్యక్షంగా ఉద్యమంలోకి దిగి,తెలంగాణా జెండా పట్టుకొని  పోరాడవలసి వస్తుంది.

రిజర్వేషన్ ఫలాలు ఒకసారి పొందిన వారే తిరిగి తిరిగి లబ్ది పొందుతున్నారు !

రిజర్వేషన్ ఫలాలు పొందిన వాల్లే పొందుతున్నారు.ఎందుకంటే రిజర్వేషన్ లో ఒక సారి ఉద్యోగం పొందిన తర్వాత వారి ఆర్ధిక పరిస్థితి ,సామాజిక స్థితి మారి పోతుంది.వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలల లో  చదువు చెప్పిస్తారు.ఒకసారి రిజర్వేషన్ పొంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళ పిల్లలు కూడా తిరిగి రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళతో ఆర్థికంగా వెనుక పడిన, ఊర్లలో ఉండే SC/ST పిల్లలు పోటీ పడలేరు.దీని వలన రిజర్వేషన్ ఫలాలు నిజమైన అర్హులకు అందడం లేదు.కావున ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి లోకి మారి పోయేటట్లు చట్టాన్ని మార్చాలి.దీనివలన నిజమైన   అర్హులైన ,నిరుపేదలైన  SC/ST సోదరులు రిజర్వేషన్ ఉపయోగించు కొని లబ్ది పొందుతారు.తమ జాతి ప్రజల మీద అభిమానం ఉంటే ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం పొందిన వారు స్వచ్చందంగా, సహృదయంతో  తమను జనరల్ కేటగిరి లోకి మార్చమని కోరాలి,చట్టం లో మార్పు కోసం పోరాడాలి. వర్గీకరణాల గురించి మాట్లాడే నాయకులు ముందు  దీని కోసం పోరాడాలి.అప్పుడే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల మౌలిక ఉద్దేశ్యం నెరవేరుతుంది.అలాగే OBC నాయకులు కూడా  క్రిమీలేయర్ లో ఉండే ఆదాయ పరిమితిని పెంచమన కుండా ఒకసారి లబ్ది పొందిన వారు ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి  అయ్యేటట్లుగా  చట్టం లో మార్పు కోసం పోరాడాలి.అప్పుడే తమ జాతి జనులు చిరకాలం గుర్తుంచుకుంటారు.  

22, జనవరి 2013, మంగళవారం

SC/ST ,OBC సోదరులకు అంత సహృదయత ఉందా?

రిజర్వేషన్ ఫలాలు పొందిన వాల్లే పొందుతున్నారు.ఎందుకంటే రిజర్వేషన్ లో ఒక సారి ఉద్యోగం పొందిన తర్వాత వారి ఆర్ధిక పరిస్థితి ,సామాజిక స్థితి మారి పోతుంది.వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలల లో  చదువు చెప్పిస్తారు.ఒకసారి రిజర్వేషన్ పొంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అయిన వాళ్ళ పిల్లలు కూడా తిరిగి రిజర్వేషన్ ఉపయోగించుకుంటున్నారు. వీళ్ళతో ఆర్థికంగా వెనుక పడిన, ఊర్లలో ఉండే SC/ST పిల్లలు పోటీ పడలేరు.దీని వలన రిజర్వేషన్ ఫలాలు నిజమైన అర్హులకు అందడం లేదు.కావున ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ కుటుంబం ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి లోకి మారి పోయేటట్లు చట్టాన్ని మార్చాలి.దీనివలన నిజమైన   అర్హులైన ,నిరుపేదలైన  SC/ST సోదరులు రిజర్వేషన్ ఉపయోగించు కొని లబ్ది పొందుతారు.తమ జాతి ప్రజల మీద అభిమానం ఉంటే ఒకసారి రిజర్వేషన్ సౌకర్యం పొంది ఉద్యోగం పొందిన వారు స్వచ్చందంగా, సహృదయంతో  తమను జనరల్ కేటగిరి లోకి మార్చమని కోరాలి,చట్టం లో మార్పు కోసం పోరాడాలి. వర్గీకరణాల గురించి మాట్లాడే నాయకులు ముందు  దీని కోసం పోరాడాలి.అప్పుడే రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల మౌలిక ఉద్దేశ్యం నెరవేరుతుంది.అలాగే OBC నాయకులు కూడా  క్రిమీలేయర్ లో ఉండే ఆదాయ పరిమితిని పెంచమన కుండా ఒకసారి లబ్ది పొందిన వారు ఆటోమాటిక్ గా జనరల్ కేటగిరి  అయ్యేటట్లుగా  చట్టం లో మార్పు కోసం పోరాడాలి.అప్పుడే తమ జాతి జనులు చిరకాలం గుర్తుంచుకుంటారు.  

21, జనవరి 2013, సోమవారం

అభివృద్ధి అంటే అప్పులా ?

పూర్వం పెద్దలు అప్పులు అంటే  భయపడేవారు.కానీ ప్రతి ఒక్కరికి నివాసం ఉండడానికి ఇల్లు ,తినడానికి తిండి  ఉండేది.అప్పులు మాత్రం ఉండేవి కాదు.ఒక వేల ఉన్నా కూడా భూమి కొనడానికో,పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికో చేసే వారు.అవి కూడా తాము తీర్చ గలిగేంత మాత్రమే ఉండేవి.చాలా పొదుపుగా ప్రశాంతంగా   బ్రతికే వారు.కానీ నేడు ఎంత జీతం వచ్చినా వినిమయ  సంస్కృతి పెరిగి  ప్రతి ఒక్కరికి అప్పులు ఉన్నాయి.అవి కూడా తాహతుకు మించి ఉన్నాయి.ఒకరిని చూసి ఒకరు ఇల్లో  ,కారో అప్పులు చేసి కొంటున్నారు.చివరికి ఇంటి లోని సామాన్లు కూడా అప్పులు చేసి కొంటున్నారు.పూర్వం కారు ఉందంటే  అతను  ఆర్థికంగా బాగా ఉండేవాడు.కానీ నేడు కారుకు నెలకు కనీసం  7000 రూపాయలు  కంతులు కట్టే వారు ఇంట్లో భోజనానికి మాత్రం నెలకు  అంత ఖర్చు పెట్టలేని వారున్నారు.ఇల్లు నెలకు పది వేల రూపాయలకు బాడుగకు దొరుకు తుంటే ,అదే మొత్తం కంతులు  కడితే మనకు  ఇల్లు స్వంతం అవుతే పరవా లేదు.కానీ నేటి పరిస్థితి అలా లేదు,నెలకు ఈ పది వేలకు తోడుగా మరొక ఇరవై వేలో ,ముప్పై వేలో కంతులు కట్టే విధంగా  అప్పులు చేయుచున్నారు.నాకు తెలిసి బెంగుళూరులో 20X30(600 చదరపు  అడుగులు ) స్థలంలో కట్టే డూప్లెక్ష్  ఇల్లును కనీసం కోటి రూపాయలకు అమ్ముతున్నారు.ఆతను నెలకు కనీసం కంతే 90000 రూపాయలు కట్టాలి.ఆ ఇల్లు కొనుక్కున్న వానికి అందులో పడుకుంటే నిద్ర పడుతుందా ?దీన్నే అభివృద్ధి అని మనం ఘనంగా చెప్పుకుంటున్నాం.అభివృద్ధి అంటే  అప్పులా ?   

17, జనవరి 2013, గురువారం

ఎవరు తీసిన గోతిలో వాల్లే పడ్డారు.

వై.ఎస్. చని పోయిన తర్వాత జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రాంతాలకతీతంగా మన  రాష్ట్రం లోని మెజారిటీ ప్రజా ప్రతినిధులు కోరుకున్నారు.జగన్ కూడా  ప్రజలకు దగ్గర అవుతూ ఒక బలమైన నాయకుడిగా  తయారవుతూ ఉంటే ,కాంగ్రెస్స్ అధినాయకత్వం జగన్ నాయకత్వాన్ని బలహీన పరచడానికి ,జగన్ ను సమర్థించే నాయకులను పరిమితం చేయడానికి తెలంగాణా అనే పాచిక వేసింది.తద్వారా జగన్ను ఒక రాయలసీమ  ప్రాంతానికి  మరియు రెడ్లకు మాత్రమే పరిమితం చేయాలని చూసింది.కానీ చివరికి అదే వాళ్ళ మెడకు ఉరి త్రాడై చుట్టు కుంది.అంత చేసినా జగన్ను కట్టడి చేయలేక పోయినారు.తెలంగాణాను తేల్చ లేక పోయారు.రాజకీయంగా ఎవరు తీసిన గోతిలో వాల్లే పడ్డారు.చివరికి రాష్ట్రాన్ని నిప్పుల కుంపటి లోకి తోసేసారు.  

రాష్ట్రాలు ముక్కలైతే ప్రజలకు ఏమైనా ఒరుగుతుందా ?

మళ్ళీ 28 డెడ్ లైన్ సమీపిస్తుండడంతో తెలంగాణా సమస్య మీద  చర్చలు , వాదాలు మొదలైయ్యాయి.స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని ఏళ్ల  తర్వాత కూడా పాలకులు ప్రజల కనీస అవసరాలైన త్రాగే నీరు ,విద్య ,వైద్యం అందించ  లేకుండా ఉన్నారు.రాష్ట్రాలు ఎన్ని ముక్కలైనా పాలకుల మైండ్ సెట్ మారకుంటే ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు.చిన్న సర్పంచ్ స్థాయి నుండి పాలకులు అవినీతి లో మునిగి తేలుతున్నారు.రాజకీయాలలోకి రావడం అంటేనే సంపాదనకోసం అనే అభిప్రాయంతో వస్తున్నారు.ప్రజలకు  కూడా పాలకుల మీద  నమ్మకం పోయింది.ఓట్ల రోజు తమకు ఇచ్చేదే గతి అని నిర్ణయించు కున్నారు.కావున ఆ రోజు రాజకీయ నాయకులు ఇచ్చేది తీసుకొని ,ఆ రోజు ఓట్లలో  నిలబడిన వాళ్ళలో తమకు నచ్చిన వాడికి ఓటు వేసి తమ పనులలో తాము  పడి  తమ బ్రతుకు తాము బ్రతుకుతున్నారు.

15, జనవరి 2013, మంగళవారం

ఇంటి కోసం వెట్టి చాకిరీ చేస్తున్నారు!

పూర్వం పెద్దలు ఉద్యోగాలు చేసేటప్పుడు ముందుగా పిల్లల చదువులు తర్వాత పిల్లల పెళ్ళిళ్ళు చేసి భాద్యతలు తీరిన తర్వాత ఇల్లు గురించి ఆలోచన చేసేవారు.వీలైతే అప్పు చేయకుండా తమ స్వంత డబ్బు తో కట్టుకునేవారు లేకపోతే స్వంత ఊరికి పోయి తమ పూర్వీకుల ఇళ్లలోనే కాలం వెళ్లి బుచ్చేవారు.ఇల్లు అనే దాన్ని ఒక ఆస్తి గా చూసే వారు కాదు.అది కేవలం నివాసం ఉండడానికి  ఒక గూడు  లాగా అను కునే వారు.కానీ నేడు ఉద్యోగం లో చేరి చేరక మునుపే ఇల్లు ,కార్లు బుక్ చేయుచున్నారు.అదీ 20 సంవత్సరాలకు లోన్లు తీసుకొని,నెలనెలా కంతులు చెల్లిస్తూ .పూర్వం పల్లెల్లో  ఇండ్లలో జీతగాళ్ళను పెట్టుకునేందుకు ముందే కొంత మొత్తం చెల్లించే వాళ్ళు ,వాళ్ళు అది తీరే దాకా ఇండ్లలో వెట్టి చాకిరి లాగా పని  చేసే వాళ్ళు.ఇప్పుడు చదువు కున్నోల్లు ,ఉద్యోగస్తులు చేసే పని దీనికంటే భిన్నంగా ఏమీ లేదు.ఒక యంత్రం లాగా ఆ కంతులు తీర్చడానికి భార్యా భర్తలు సమయం అనేది లేకుండా పని చేస్తున్నారు.చివరికి పిల్లల ఆలనా పాలనా కూడా  చూడలేక పోతున్నారు.  వీళ్ళ ఉద్యోగాలు ఎంత కాలం ఉంటాయో ఎవరికీ తెలియదు .ఒక వేల మధ్యలో పోతే అప్పులు తప్ప ఆస్తులు ఏమీ ఉండవు.ఒక వేల చివరి వరకు వీళ్ళు కంతులు  కట్టి ఆ ఇల్లు స్వంతమైనా వీళ్ళు కట్టిన మొత్తానికి ఆ రోజు ఆ ఇంటికి ఉన్న విలువకు సరి పోతుంది.కొన్ని సందర్భాలలో వీళ్ళు కట్టిన మొత్తాల కంటే ఇంటి విలువే తక్కువ అవుతుంది.ఇంత తీవ్ర మైన ఒత్తిడి తో పని చేసి వీళ్ళు చివరికి సంపాదించింది ఒక గూడు ,కొన్ని రోగాలు మాత్రమే.అప్పటికి పిల్లలు చేతికి అంది వస్తే పరవా లేదు .లేక పోతే అంత కన్నా నరకం ఇంకొకటి ఉండదు.తల్లిదండ్రులు పిల్లలను చూసుకోవడానికి సమయం లేక వాళ్ళను ముద్దు చేసి ,వాళ్లకు తాము లేని లోటును తీర్చాలని వాళ్లకు అడిగినవన్నీ కొనిపించి ,చాలా వరకు పిల్లలు  భాధ్యత లేకుండా పెరుగు తున్నారు.మనం అభివృద్ధి సాధించినామని చంకలు గుద్దుకుంటున్నాము ,ఆ అభివృద్ధి ఏమిటో ఒక 15 ,20 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది. 

13, జనవరి 2013, ఆదివారం

నాకైతే ఏమీ అర్థం కాలేదు?

నిన్న నేను "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు "సినిమా కు వెళ్ళాను.అందులో పెద్దోడు అనే పాత్రకు ఏమీ పనిలేదు అని హైలెట్ చేసారు.అందరూ అడుగుతుంటారు ఏం చేస్తుంటావని.కానీ పెద్దోడు పాత్ర మాత్రం చిన్నోని పాత్రకు వద్దన్నా డబ్బులు ఇస్తూ ఉంటాడు.జేబులో కుక్కేస్తూ ఉంటాడు .అది నాకు అర్థం కాలేదు అతడు డబ్బు ఎక్కడ నుండి తెస్తుంటాడో ?అక్కడ ఏమీ సెంటిమెంటు లేకున్నా సెంటిమెంటు ఉందని మనలను భ్రమింప చేయాలని చాలా ప్రయత్నం చేసారు.ఆ సినిమా పేరుకు ఆ సినిమా కు ఏం  సంభంధం   ఉందో అర్థం కాలేదు.ఇప్పటికే యువత పనీ పాట లేకుండా చెట్ల క్రింద కూర్చొని బాతాఖాని కొడుతున్నారు.ఆ సినిమాలో కూడా భాధ్యత లేకుండా చెట్ల క్రింద కూర్చొని ఉంటారు.ఏం సందేశం ఇవ్వాలను కున్నారో అర్థం కాలేదు.

12, జనవరి 2013, శనివారం

శుభాకాంక్షలు

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు .

8, జనవరి 2013, మంగళవారం

ఎక్కడికి పోతున్నాం మనం ఇంక చాలు .....

రాజకీయ నాయకులకు ప్రజాస్వామ్యం ఈ మధ్యన ఎక్కువైంది.తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒకాయనేమో ఆంధ్ర వాళ్ళను తరిమి కొట్టండి అంటాడు.ఇంకొక ఆయనేమో ఒక మెజారిటీ మతానికి వ్యతిరేకంగా ప్రజల హర్షధ్వానాల మధ్యన తన నాలుక ఎలా తిరిగితే అలా మాట్లాడాడు.ఈ మధ్యన హిందూ దేవుళ్ళను ,దేవతలను విమర్శిం చడం ఒక ఫ్యాషన్ అయి పోయింది.ఒక జీసస్ కానీ ,మహమ్మద్ ప్రవక్త కానీ ,రాముడు కానీ ,కృష్ణుడు కానీ ఇన్ని రోజులు ఉన్నా కూడా  ప్రజలకు  తమ ఆరాధ్య దైవాలుగా ఉన్నారంటే నే చరిత్రలో వాళ్లకు ఒక బలమైన స్థానం ఉంది.వాళ్ళను విమర్శించే స్థాయిలో మనం ఉన్నామా అని ఒక సారి మనం ప్రశ్నించు  కోవాలి.ఇదా మనం చదివిన తర్వాత నేర్చుకున్న నాగరికత ?చదువులు మనలను ఇంత సంకుచితంగా తయారు చేసాయా?మేం చిన్నప్పుడు ఉర్సు జరిగేటప్పుడు దర్గాలకు వెళ్లి   చక్కర పంచి వచ్చేవాళ్ళం.ఇప్పటికీ కూడా పీర్ల పండుగల లో ,దస్తగిరి స్వామి పండుగలలో చాలా మంది హిందువులు మనస్పూర్తిగా ,ఉత్సాహంగా పాల్గొంటున్నారు.మెజారిటీ హిందువులకు పరమత సహనం ఉంది.ఊర్లలో చర్చి లు మసీదులు కట్టుకోవడానికి హిందువులు సహాయం చేసిన సందర్భాలు ఉన్నాయి.దీన్ని హిందువుల  చేతగాని తనంగా చూస్తున్నారు.ఈ మధ్యన మాధ్యమాలల్లో కూడా చర్చ చేయడానికి ఏమీ దొరకక పోతే కుహనా మేధావులను కూర్చో బెట్టి దేవుళ్ళ గురించి  చర్చలు చేస్తున్నారు.ఒకాయనేమో ఆయన చూసి వచ్చినట్లు రావణుడు తమ దేవుడు అని పురాణాలకు వక్ర భాష్యం చెపుతాడు .దీన్ని చర్చకు పెడతారు మీడియా వాళ్ళు.ఇది ఆపుతే బాగుంటుంది.హిందూ మతాన్ని చాలా చులకన చేసి సినిమాలలో కూడా  చూపుతున్నారు. మనలను మనం గౌరవించు కోలేనప్పుడు ఇతరులు మనలను ఎందుకు గౌరవిస్తారు.తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రాంతాలను ,మతాలను గురించి రెచ్చ గొట్టే విధంగా మాట్లాడే వాళ్ళను ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలి.

6, జనవరి 2013, ఆదివారం

నష్టాలను లాభాలుగా ప్రచారం చేస్తున్నారు!

ఈ కాలంలో ప్రకటనలు ఇచ్చే వాళ్ళు  నెగెటివ్ ను పాజిటివ్ గాను పాజిటివ్ ను నెగెటివ్ గాను చెప్పుకుంటున్నారు.అలాగే ప్రజలు స్వీకరిస్తున్నారు కూడా !ఎందుకంటే అపార్ట్మెంట్ లు కట్టే వాళ్ళు ,ఇళ్ళ స్థలాల లేఅవుట్ వేసే వాళ్ళు తమ అపార్ట్మెంట్ లకు పెట్రోల్ స్టేషన్లు,గ్యాసు ఫిల్లింగ్ స్టేషన్లు ,సినిమా హాలులు ,పరిశ్రమలు దగ్గరగా ఉన్నాయని   ప్రకటనలు ఇచ్చు కుంటున్నారు.ఒకప్పుడు పెట్రోల్ స్టేషన్లు,గ్యాసు ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర ఇల్లు కట్టుకునేవారు కాదు ,ఎందుకంటే  ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందని.అలాగే ఇంటికి దగ్గర్లో సినిమా హాలు ఉంటే శబ్ద కాలుష్యం ఉంటుందని ,రకరకాల పోకిరి వ్యక్తులు వస్తారని ఇల్లు కట్టు కునే వారు కాదు.అలాగే కాలుష్యం ఉంటుందని  పరిశ్రమలకు దూరంగా ఇల్లు కట్టుకునేవారు.కానీ నేడు ఆ నష్టాలనే లాభాలుగా ప్రచారం చేస్తున్నారు.ప్రజలు కూడా  వాటివెంటే పరిగెత్తుతున్నారు.అదీ కలికాలం అంటే !


1, జనవరి 2013, మంగళవారం

నూతన ఆంగ్ల సంవత్సరంలో చిన్న కోర్కెలు కోరుకుంటూ ......

అందరికి నూతన ఆంగ్ల సంవత్సర  శుభాకాంక్షలు .


  • ఉన్న వాడికి లేని వాడికి చట్టం సమానంగా పనిచేయాలని
  • పోలీసు స్టేషన్ కు వెళ్ళినప్పుడు బాధితుని ఫిర్యాదును నిందితుని  హోదాను పరిశీలించిన తర్వాత మాత్రమే  స్వీకరించే పని చేయ  కుండా ఉండాలని
  • ఒక సారి రాజకీయాల్లోకి కాని అధికారంలోకి కాని వస్తే చిన్న పదవి నుండి ,పెద్ద పదవి వరకు ఉన్న వ్యక్తుల ఆదాయం విపరీతంగా పెరగ కుండా  ఉండాలని
  •  రాజకీయ నాయకులు  ప్రజల సొమ్మును ఎవరికి అవకాశం  ఉన్నంత వాళ్ళు  తిన్న తర్వాత నీవు ఎక్కువ తిన్నావు ,నీవు ఎక్కువ తిన్నావని విమర్శలు చేసుకోకుండా కొంచం ప్రజల గురించి ఆలోచన చేయాలని 
  • ప్రజల నుండి పన్నులు వసూలు చేసిన తర్వాత  ప్రజలకు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత   తమదే అని ప్రభుత్వాలు గుర్తించాలని
  • బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి ,మూత్ర విసర్జన ,పొగ త్రాగడం చేయ వద్దనే ముందు ఉమ్మి తొట్లు ,మూత్రశాలలు ,పొగ త్రాగే రూములు పెట్టినామా అని ఆలోచన చేసి తర్వాత ప్రజలకు  చట్టాలను  గౌరవించాలని చెప్పాలని
  • ప్రజలను సోమరిపోతులను చేసే పథకాలను ప్రవేశ పెట్టవద్దని 
  • ప్రతిభను గౌరవించాలని 
  • వ్యవసాయదారులను గౌరవించాలని  
  • ప్రజలందరూ బాధ్యత గా మెలగాలని 
  • అవకాశం చిక్కినప్పుడల్లా తెలుగు వాళ్ళు తెలుగులోనే మాట్లాడాలని  
  • అన్ని వ్యవస్థలు వీలైనంత సక్రమంగా పని చేయాలని
  • తమ అభిప్రాయాలను ప్రజలు స్వేచ్చగా వెల్లడించే అవకాశం ఉండాలని  కోరుకుంటూ......