5, డిసెంబర్ 2014, శుక్రవారం

రాయలసీమ కళాకారులు ..

              ఒక చిన్న స్టీలు స్కేలు ,ఉలి ,బొగ్గు ,చిన్న సుత్తె తో బేతంచర్ల పని వారు అక్కడి నాప రాళ్ళతో రకరకాల లతలు,పుష్పాలు ,ఫ్లోరింగ్ డిజైన్లను చాలా అద్బుతంగా చేస్తారు.అందులో చాలా జామెట్రీ దాగి ఉంది.ఏ పరికరమూ ,యంత్ర సహాయం లేకుండా చాలా ఖచ్హితంగా చేస్తారు.కానీ ఈ మధ్యన ఈ ఆర్టిఫిసీల్ టైల్స్ వచ్హిన తర్వాత వారికి పని తగ్గి పోయింది.ఈ పని లో చాలా మటుకు ముస్లిం మైనారిటీ కి చెందిన వారు ,వెనుక బడిన కులాలకు చెందిన వారు ఉపాధి పొందుతూ ఉండేవారు.ఉపాధి తగ్గినందువలన కొత్త తరం ఈ పనిలోకి రావడానికి జంకుతున్నారు.ఇప్పటికే ఎన్నో కళల ను మనం కోల్పోయాము.కావున ప్రభుత్వం,పెద్దలు స్పందించి ఇటువంటి కళను ,కళాకారులను దూరం కాకుండా చేసు కోవలసిన అవసరం ఉంది.





3, డిసెంబర్ 2014, బుధవారం

క్రెడిట్ అంతా ప్రతిపక్షాలకే పోతుంది .

           మొదటి సంతకం రైతు రుణమాఫీ పై పెడతామని అధికారం లోకి  వచ్చి 6 నెలలు అయినా కూడా  ఒక్క రైతు ఖాతా లోకి ఒక్క రూపాయి కూడా  జమ కాలేదు. కొత్త అప్పులు పుట్ట లేదు . దీనిపై  ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి పెంచుతున్నాయి . 

               ఒక వేల అధికార పక్షం ఈ రుణమాఫీ ని  తాము ఎన్నికల ముందు చెప్పినట్లుగా కాకుండా ,అరకొరగా చేసినామంటే  చేసినామని అనిపిస్తే వారు రైతుల విశ్వాసాన్ని పొందలేరు . 

                ఈ మటుకు చేసింది కూడా  ప్రతిపక్షాల వత్తిడికి తలఒగ్గి మాత్రమే చేసారని రైతులు అనుకొంటారు . అధికారపక్షానికి  నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఇన్ని రోజులు మొదటి సంతకానికి సమయం పట్టదని అనుకుంటున్నారు. చివరికి ఈ క్రెడిట్ అంతా ప్రతిపక్షాలకే పోతుంది .  

17, నవంబర్ 2014, సోమవారం

రాజధాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెరట్లో నే ఉండాలి..

           ఒక వైపు రాజధాని తుళ్లూరు ప్రాంతం వైపు అని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అక్కడ రైతుల భూముల ధరలు విపరీతంగా పెరిగాయని వార్తలు వస్తున్నాయి. మరో వైపు అక్కడ కొంత మంది రైతులు మూడు నాలుగు పంటలు పండే పచ్హని తమ భూములు ఇవ్వమని చెబుతూనే ,రాజధాని అమరావతి,తాడికొండ మండలాల్లో పెట్ట వచ్హుకదా అని చెబుతున్నారు. కానీ రాజధానిని తీసుకొని పోయి ప్రభుత్వ బీడు భూములు ఉన్న చోట పెట్టమని చెప్పడం లేదు.అంటే రాజధాని మాత్రం తమ పెరట్లోనే ఉండాలి కానీ తమ భూముల్లో ఉండకూడదు.
             ఒకప్పుడు వేరుశనగ పంట విపరీతంగా పండే అనంతపురం జిల్లా లోని కదిరి ప్రాంతం లో ,ఇప్పుడు వర్షాలు లేక వేల ఎకరాలు భూముులు బీడు పడి ఉన్నాయి.ఇప్పటికీ అక్కడ ఎకరా భూమి 30000 రూపాయలు ధర కూడా పలకని ప్రాంతాలు ఉన్నాయి.
             ఇటువంటి ప్రాంతం లో రాజధాని పెడితే అక్కడ భూములకు కొంచ మైనా గిరాకీ వచ్హి రైతులు బాగు పడతారు. ఇన్ని రోజులూ ఆంధ్ర ప్రాంతం వాల్లకు నీరు ఇచ్హి రెండు మూడు పంటలు పండే లా చేసి వాల్లను ఆర్థికంగా బలపడేటట్లుగా చేసారు.ఇప్పుడు మల్లీ రాజధానిని తీసుకు వెళ్ళి అక్కడే పెట్టి తిరిగి వాల్లనే బలవంతులను చేస్తున్నారు.
           ఆర్థికాభివృద్దిని ఒకే వైపు కేంద్రీకరిస్తున్నారు.రాయలసీమ వాల్లు కూడా ఈ రాష్ట్రం లోని ప్రజలే అని ప్రభుత్వాలు ,అక్కడి ప్రజలు గుర్తిస్తే బాగుంటుంది.

11, నవంబర్ 2014, మంగళవారం

స్వచ్చ భారత్ ...

ఈ స్వచ్హ భారత్ లో పాల్గొంటున్న వారు వేసుకున్న హ్యాండ్ గ్లౌసులు ,మూతికి కట్టుకునే గుడ్డలు ,మంచి చీపుర్లు మరియు ఈ ప్రొగ్రాం లో పాల్గొనడానికి వచ్హే ముందు వేయొంచు కున్న ఇంజెక్షన్లు ,తీసుకున్న జాగ్రత్తలలో కొంత శాతమైనా ప్రతి రోజూ ఈ స్వచ్హ భారత్ లో ఫోటో లు లేకుండా ,శ్రమించే పారిశుద్ద కార్మికుల కోసం కేటాయిస్తే చాలాసంతోషం.




9, అక్టోబర్ 2014, గురువారం

పాతర్లు ... పిల్లకాయలు .

    ఒకప్పుడు ఊర్లలో జొన్నలు దాచు కోవడానికి పాతర్లు ఉండేవి.5 పుట్లు 6 పుట్లు (ఇంకా పెద్దవి కూడా ఉండేవి )పట్టే  పాతర్లు ఉండేవి.రైతుకు ఎన్ని పాతర్లు ఉంటే అంత గొప్ప .ఆ పాతర్లను పంట వచ్హే ముందు సున్నం కొట్టించి ,అందులో సొప్పతో మంట పెట్టెవారు.దాని వలన ఎన్ని రోజులైనా జొన్నలకు పురుగు వచ్హేది కాదు.
          రైతుకు జొన్నలు అవసరం అయినప్పుడు ఆ పాతరను తీసి నులక మంచాన్ని ఆ పాతర మీద పడుకో బెట్టేవారు.అందులోని చెడుగాలి బయటికి పోయిన తర్వాత జొన్నలు తీయడానికిమనుషులు దిగేవారు.
        ఎవరైనా పాతర తీసినారని తెలుస్తే ఆ రోజు ఆ వీధి లోని పిల్లకాయలు ఆన్నాన్నే తారాడ్తంటారు.పిల్లకాయలకు ఆ రోజు పండగ లాగా ఉండేది.రైతులు ఆ పిల్లకాయల అంగీలో జొన్నలు పోసేవారు.జొన్నలు తీసుకొని అంగటికి పోయి బొంగులో ,నిమ్మప్పులో,చిలక బిస్కట్లో కొనుక్కునేవారు.
       ఇప్పుడు జొన్నలు పండించే వాల్లు తక్కువైనారు,ఒక వేల పండించినా ఈ ఏరోసు లు (వేర్ హవుస్ ,గోడౌన్లు )వచ్హిన తర్వాత పంటని అక్కడికి తోల్తన్నారు.జొన్నలు తీసుకుని బొంగులో ,నిమ్మప్పులో,చిలక బిస్కట్లో ఇచ్హే అంగడి వాళ్ళు లేరు.పాతర్లు పాడు బడ్డాయి. 

21, ఆగస్టు 2014, గురువారం

ప్రజలు పోలింగు కు 100 శాతం ఎందుకు రావడం లేదు !

     రాజకీయ పార్టీ లు ఓటర్లు పోలింగు కు రావడం లేదని చెబుతూ ,పోలింగు శాతం పెంచడానికి ఓటింగు ను కంపల్సరీ చేయాలని చెబుతూ ఉంటారు . ప్రజలు పోలింగు కు ఎందుకు రావడం  లేదని రాజకీయ పార్టీలు ఎప్పుడైనా ఆలోచించాయా ?ముఖ్యంగా రాజకీయ పార్టీలు  ఇచ్చే హామీల మీద నమ్మకం లేకనే !

                  ప్రతి చిన్న వస్తువు కొన్నా కూడా  వినియోగదారుడు మోస పోకుండా వినియోగ దారుల చట్టం ఉంది . కానీ ప్రజాస్వామ్యం లో ఓటరు కు తానూ నమ్మి ఓట్లు వేసిన ప్రభుత్వాలు తమకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో లేదో అనే నమ్మకం లేదు .  

                    ఎన్నికల కమీషన్ ఇప్పటి కైనా  సంస్కరణ లు తేవాలి. రాజకీయ పార్టీల హామీలు స్పష్టంగా కూడా ఉండాలి,ఉదా: సింగపూర్ చేస్తాను,అమెరికా చేస్తాను,ఆఫ్రికా చేస్తాను లాంటి అస్పష్టమైన హామీలు ఉండ  కూడదు . రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల మీద బడ్జెట్ చూపించి నిధులు ఏ రూపంగా సేకరిస్తారో ,ఎంత సమయం లోపల ఆ హామీలు నేర వేరుస్తారో రాజకీయ పార్టీల నుండి రాతపూర్వకంగా  తీసికోవాలి . ఎన్నికల కమీషన్ ఆ హామీల మీద సంతృప్తి  చెందిన తర్వాత నే ఆ పార్టీలు మానిఫెస్టో లో పెట్టాలి . ఒక వేల ఆ హామీలు ఆ నిర్దిష్ట సమయం లోపల నెరవేరక పోతే ఆ ప్రభుత్వం ఆటోమాటిక్ గా రద్దయ్యే గా చట్టం చేయాలి. తిరిగి ఎన్నికలు నిర్వహించాలి . ఆ ఎన్నికల ఖర్చును హామీలు నెరవేర్చ లేక అధికారం నుండి  దిగి పోయే రాజకీయ పార్టీ నుండి  వసూలు చేయాలి . ఆ అసత్యపు  హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీ ని కొన్ని సంవత్సరాల పాటు తిరిగి ఎన్నికలలో పోటీ చేయ కుండా నిషేధించాలి . 

                           అప్పుడు చూడండి ఓటర్లు పోలింగుకు ఎందుకు  బారులు తీరరో !తాము కోరుకున్న పార్టీని ,తమకు నచ్చిన హామీలు ఇచ్చిన పార్టీని ఎన్నుకోవడానికి  ఓటర్లు బారులు తీరి పోలింగు బూతు కు వస్తారు . 
                     

15, ఆగస్టు 2014, శుక్రవారం

జగన్ అధికారం లోకి రాక పోవడం మంచిదైంది !

ఒక వేల జగన్ అధికారం లోకి వచ్చి ఉండుంటే   --- , వివిధ మీడియా చర్చల్లో టి. డి. పి  నాయకులు ,మరియు వారికి సంభందించిన మీడియా  ల లో-- "టి. డి. పి అధికారం లోకి వచ్చి ఉండింటే  ఈ పాటికే లక్షా రెండు  వేల కోట్ల రైతు  రుణమాఫీ జరిగి పోయి ఉండును ,అలాగే డ్వాక్రా రుణమాఫీ ,అందరికీ ఉద్యోగాలు ,ఉద్యోగం రాని  వారికి నిరుద్యోగ భృతి ,కాలేజి పిల్లలకు ట్యాబులు ఇలా తాము మానిఫెస్టో లో  ప్రకటించిన  ప్రతి పని ,పైన మోడి ఉన్నారు కాబట్టి  ఈ పాటికే అయి పోయి ఉందును అని" , ఎన్నికల ముందు  తమ కు సంభందించిన మీడియా లో ఎలా ప్రచారం చేసారో  అలా ఊదర గొట్టేసేవారు . పాపం ప్రజలు కూడా  తాము జగన్ ను అధికారం లోకి తీసుకు వచ్చి చాలా తప్పు చేసామని భావించే పరిస్థితిని కల్పించే వారు . ఆ పథకాలను ఎలాగైనా అందుకోవటానికి తక్షణం జగన్ ను అధికారం లో నుండి   దించి ,  టి. డి. పి ని అధికారం లోకి తీసుకు రావాలన్నంతగా  ప్రచారం ఉండేది . ఆ ప్రమాదం ఇప్పుడు తప్పి పోయింది . 

శుభాకాంక్షలు

అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ  శుభాకాంక్షలు .  

28, జులై 2014, సోమవారం

మీ సాయం అక్కరలేదు ...

"ఋణమాఫీ కి మా సాయం ఉండదు "----వెంకయ్య నాయుడు . 


"సార్  అంధ్రప్రదేశ్ కు మీ సాయం అక్కరలేదు ,ఎందుకంటే ఇక్కడ ఋణమాఫీ అయిపోయింది ,ఋణమాఫీ పొందిన ప్రజలు ఆనందం లో సన్మానాలు కూడా  చేస్తున్నారు ." 


కావాలంటే తెలంగాణా కు మీ సాయం ఏమైనా అవసరమేమో కనుక్కోండి .         

26, జులై 2014, శనివారం

అధికారం కోసం ..అభివృద్ధి ఆమడ దూరం .....

15000 కోట్ల లోటు తో విడి పోయిన తర్వాత మన పరిస్థితి తెలిసి కూడా  అధికారం కోసం అలవి గాని హామీలను గుప్పించడం దూరదృష్టి ,దార్శనికత ఉన్న నాయకులకు తగదు. అధికారం లోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ ఏ  హామీలను ఇచ్చి అధికారం లోకి వచ్చారో  ఆ హామీలను నెర   వేర్చమని సహజంగానే ప్రతిపక్ష పార్టీలు  డిమాండ్ చేస్తాయి . అధికార ,ప్రతిపక్షాలు ఈ హామీల పైనే రాజకీయపు  ఎత్తులు పై ఎత్తులు వేయడం తో సరి పోతుంది .అభివృద్ధి పైన ఆలోచనలు వెల్లవు.  విడిపోయి కొన్ని సంవత్సరాలు వెనుక పడి పోతే ,ఈ రాజకీయాలలో మరి కొన్ని సంవత్సరాలు వెనక్కి పోతుంది . ఎ.పి . విడిపోయిన తర్వాత 15000 కోట్ల రూపాయల లోటు మరియు రాజధాని లేమి ఉన్న పరిస్థితిలో అటువంటి హామీలను ఇచ్చి ఉండవలసింది కాదు. ఎ.పి అభివృద్దిలో అధికార పక్షం ,ప్రతిపక్షం చేతిలో చెయ్యి వేసుకొని పరస్పరం సహకరించుకుంటూ పని చేసుకోవలసిన  సందర్భం ,అవకాశం ఇప్పుడు తప్పిపోయినట్లే కనిపిస్తుంది .దార్శనికత ,దూరదృష్టి లేని నాయకులు ఉండడం అంధ్రప్రదేశ్  ప్రజలు చేసుకున్న దురదృష్టం .    

ఇంజనీర్ కావాలంటే అక్కడ మాత్రమే చదవాలి......

            ఇప్పటికే ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థ వలన ,ప్రభుత్వ విద్యావ్యవస్థలు మూతపడే స్థాయికి వచ్చినాయి . తీరా ఈ కార్పొరేట్ విద్యావ్యవస్థ వలన ఏమైనా మెరుగు పడిందా అంటే అదీ లేదు. చాలా మంది పేదలు విద్యకు దూరం అవ్వాల్సిన పరిస్థితి.విద్యలో కూడా నాణ్యత లోపించింది .  
     
                    ఇప్పుడు కార్పొరేట్ కాలేజీలల్లో చదువుతున్న విద్యార్థులకు ఇంటర్ లో మార్కులు చాలా మందికి 95 శాతానికి పైగా వస్తున్నాయి,ఇంకా కొన్ని సబ్జక్టుల్లో అయితే 100 శాతం వస్తున్నాయి. కానీ  EAMCET  విషయం లోకి వచ్చేసరికి ర్యాంకులు వేలల్లో ,లక్షల్లో వస్తున్నాయి.ఇదేం  చదువో అర్థం కావడం లేదు.  

                    ఇటువంటి పరిస్థితి ఉంటే ఇప్పడు ఏకంగా మంత్రి గారు ఇంజనీరింగు అడ్మిషన్లను ఇంటర్ మార్కుల ఆధారంగా చేయడానికి స్టడీ చేస్తున్నామనడం చాలా హాస్యాస్పదంగా ఉంది . ఇదే కనుక అమలు చేస్తే ఇంజనీరింగు కావాలంటే ఆ రెండు కార్పొరేట్ కాలేజీల లోనే చదవాలని పరోక్షంగా సూచించడమే! 




2, జులై 2014, బుధవారం

చంద్రబాబు గారు మాట నిలబెట్టుకునేటట్లు గానే కనిపిస్తున్నారు !

చంద్రబాబు గారు ఎన్నికల ప్రచారం  లో భాగంగా "ఏం  తమ్ముడూ నీకు ఋణ  మాఫీ వద్దా "," ఏం  చెల్లెమ్మా నీకు డ్వాక్రా ఋణ  మాఫీ వద్దా " అని వేలు చూపిస్తూ అడిగినప్పుడు ,ప్రజలనుండి కావాలి..కావాలి .. అని కేకలు . ఆ ప్రచారం ఇప్పటికీ ప్రజలకు కళ్ళకు కట్టినట్లుగా గుర్తుకు వస్తూనే ఉంది . ఆయన మాటలు నమ్మి ప్రజలు ఎంతో ఆశతో ఓట్లు వేసి ఆయనను అధికారం లో కూర్చో బెట్టి ఇప్పటికి దగ్గర ,దగ్గరగా  నెల రోజులు అయ్యింది . కానీ ఋణ  మాఫీ గురించి  ఊసే లేదు ,మిగతా హామీల సంగతి దేవుడెరుగు! దీన్ని బట్టి  చూస్తే  చంద్రబాబు గారు "మాట తప్పడం లో " మాట నిలబెట్టుకునేటట్లు గానే కనిపిస్తున్నారు !   

1, జులై 2014, మంగళవారం

మీడియా మరియు వార్తా పత్రికలు ప్రజా పక్షం వహించి ప్రతి పక్ష పాత్ర పోషించాలి!

            మీడియా మరియు వార్తా పత్రికలు ప్రజా పక్షం వహించి ప్రతి పక్ష పాత్ర పోషించాలి. ఎందుకంటే ఎన్నికలలో వివిధ హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన మొట్టమొదటి హామీ వ్యవసాయ  ఋణమాఫీ  మీద రైతులు ఎదురు చూస్తున్నారు . ఇది ఆలస్యం చేస్తే ,ఒక వేల ఋణమాఫీ చేయక పోతే ఇప్పడు  ఖరీఫ్ కోసం కొత్త ఋణాలు  బ్యాంకులు ఇవ్వక పోగా ,ముందు తీసుకున్న ఋణాలకు వర్తించే సున్నా శాతం వడ్డీ కూడా  వర్తించదు .మొత్తం వడ్డీ కూడా  కట్ట వలసిన పరిస్థితి . ఇటువంటి క్లిష్ట సమయం లో నైనా పత్రికలు ,మీడియా ప్రజల వైపు ఉండి ప్రతిపక్ష పాత్ర వహించి ప్రజల తరుపున న్యాయం కోసం పోరాడాలి ,ఒక వేల ఈ సమయంలో కూడా పోరాడక పోతే మీడియా కు విశ్వసనీయత పోతుంది. పోరాడక పోతే ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియా కు  అర్థమే ఉండదు . 

26, జూన్ 2014, గురువారం

అప్పుడు చూడండి ఓటర్లు పోలింగుకు ఎందుకు బారులు తీరరో !

                  ఎన్నికలప్పుడు వివిధ రకాలైన ఉచిత హామీలు ఇచ్చి ఎన్నికలు అయిన తర్వాత అవి తీర్చ లేక  వాటి నుండి తప్పించు కోవటానికి ప్రభుత్వాలు  రక రకాల షరతులు  విధిస్తూ  ఉంటే, హామీలు నమ్మి ఓట్లు వేసిన ఓటర్లు  తమ గోడు ను ఎవరికీ చెప్పు కోవాలనో అర్థం కాక తెల్ల మొకం వేసికొని బిత్తర చూపులు చూస్తున్నారు . 

                  ఇలా ఇంత సులభంగా ఉచిత హామీలు ఇచ్చి అధికారం లోకి రావచ్చు అనుకుంటే  ఇంకొకాయన వచ్చి తలా ఒక కిలో బంగారం ఇస్తానంటాడు(ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి ) . ఓట్లు వచ్చి అధికారం లోకి వచ్చిన తర్వాత తాను  నియోజకవర్గానికి ఒక కిలో ఇస్తానన్నా నని ,ఒక కారెట్ బంగారం కిలో  ఇస్తానన్నాని , బంగారం పూత పూసినది  ఒక కిలో ఇస్తానన్నాని ఇలా రకరకాలుగా చెప్పి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి తమ పబ్బం గడుపుకొని వెళ్తారు . చివరికి ఓటర్లు తాము మోస పోయామని  గుర్తిస్తారు. తిరిగి 5 సంవత్సరాల తర్వాత మోసం చేయడానికి కొత్త హామీల తో  వస్తారు.     
            
                  రాజకీయ పార్టీ లు ఓటర్లు పోలింగు కు రావడం లేదని చెబుతూ ,పోలింగు శాతం పెంచడానికి ఓటింగు ను కంపల్సరీ చేయాలని చెబుతూ ఉంటారు . ప్రజలు పోలింగు కు ఎందుకు రావడం  లేదని రాజకీయ పార్టీలు ఎప్పుడైనా ఆలోచించాయా ?ముఖ్యంగా రాజకీయ పార్టీలు  ఇచ్చే హామీల మీద నమ్మకం లేకనే !

                  ప్రతి చిన్న వస్తువు కొన్నా కూడా  వినియోగదారుడు మోస పోకుండా వినియోగ దారుల చట్టం ఉంది . కానీ ప్రజాస్వామ్యం లో ఓటరు కు తానూ నమ్మి ఓట్లు వేసిన ప్రభుత్వాలు తమకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో లేదో అనే నమ్మకం లేదు .  

                    ఎన్నికల కమీషన్ ఇప్పటి కైనా  సంస్కరణ లు తేవాలి. రాజకీయ పార్టీల హామీలు స్పష్టంగా కూడా ఉండాలి,ఉదా: సింగపూర్ చేస్తాను,అమెరికా చేస్తాను,ఆఫ్రికా చేస్తాను లాంటి అస్పష్టమైన హామీలు ఉండ  కూడదు . రాజకీయ పార్టీలు ఇచ్చే హామీల మీద బడ్జెట్ చూపించి నిధులు ఏ రూపంగా సేకరిస్తారో ,ఎంత సమయం లోపల ఆ హామీలు నేర వేరుస్తారో రాజకీయ పార్టీల నుండి రాతపూర్వకంగా  తీసికోవాలి . ఎన్నికల కమీషన్ ఆ హామీల మీద సంతృప్తి  చెందిన తర్వాత నే ఆ పార్టీలు మానిఫెస్టో లో పెట్టాలి . ఒక వేల ఆ హామీలు ఆ నిర్దిష్ట సమయం లోపల నెరవేరక పోతే ఆ ప్రభుత్వం ఆటోమాటిక్ గా రద్దయ్యే గా చట్టం చేయాలి. తిరిగి ఎన్నికలు నిర్వహించాలి . ఆ ఎన్నికల ఖర్చును హామీలు నెరవేర్చ లేక అధికారం నుండి  దిగి పోయే రాజకీయ పార్టీ నుండి  వసూలు చేయాలి . ఆ అసత్యపు  హామీలు ఇచ్చిన రాజకీయ పార్టీ ని కొన్ని సంవత్సరాల పాటు తిరిగి ఎన్నికలలో పోటీ చేయ కుండా నిషేధించాలి . 

                           అప్పుడు చూడండి ఓటర్లు పోలింగుకు ఎందుకు  బారులు తీరరో !తాము కోరుకున్న పార్టీని ,తమకు నచ్చిన హామీలు ఇచ్చిన పార్టీని ఎన్నుకోవడానికి  ఓటర్లు బారులు తీరి పోలింగు బూతు కు వస్తారు . 
                     

                 
                          

24, జూన్ 2014, మంగళవారం

ఎవరు దార్శనికులు ?

విడిపోయిన  తర్వాత 15000 కోట్ల  లోటు బడ్జెట్ ఉందని తెలిసినా   అధికారం  కోసం ఇష్టమొచ్చిన  హామీలు  ఇచ్చిన  చంద్రబాబు గారు దార్శనికులా ,బాధ్యత గా  అమలు చేయగలిగే హామీలు ఇచ్చిన జగన్ దార్శనికులా ?వయసుకు దార్శనికతకు  ఏమైనా సంభంధం ఉందా? ఒక వేల చంద్రబాబు గారు ఇచ్చినటువంటి  హామీలు ఇచ్చి  జగన్ అధికారం లోకి వచ్చి ఉండి  ఉంటే  ఈ పాటికే వివిధ మీడియాలలో దార్శనికత మీద చర్చలు జరిగి ఉండక పోయేవా? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు .  

11, జూన్ 2014, బుధవారం

అంతటి అనుభవజ్ఞులకు అంత సమయం అవసరమా ?

             వై.ఎస్ . గారికి ఎప్పుడో అంజయ్య గారి ప్రభుత్వం లో కొన్ని రోజులు మంత్రిగా చేసిన అనుభవం తప్ప ఏమీ అనుభవం లేకున్నా ముఖ్యమంత్రి అయిన వెంటనే తాను ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ పై మొదటి సంతకం చేసి అధికారం లోకి వచ్చిన మొదటి రోజు నుండే  అమలును ప్రారంభించారు . 
  
            కానీ మంత్రిగా ,9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా,10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా ,ప్రధానులని ,రాష్ట్రపతులని ఎన్నిక చేసిన వ్యక్తిగా,బిల్గేట్స్ ను,బిల్ క్లింటన్ ను రాష్ట్రానికి తీసుకొని వచ్చి మొత్తం ప్రపంచం దృష్టి ని మన రాష్ట్రం వైపు మరల్చి పెట్టుబడులను తీసుకొని వచ్చిన వ్యక్తిగా,హైదరాబాదును  హై టెక్ సిటి గా అభివృద్ది  చేసిన వ్యక్తిగా,విజన్ 2020 రూపశిల్పిగా, అంత దూర దృష్టి  ఉన్న వ్యక్తిగా   అంత అనుభవం  ఉన్న చంద్రబాబు గారు తాను  చెప్పిన  మొదటి సంతకం  రైతు రుణమాఫీ అమలుకు, కమిటీ వేసి ఎందుకు 45 రోజులు సమయం తీసుకున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు.   

            తెలంగాణా విభజనకు లేఖ ఇచ్చి చివరి వరకూ దానికి కట్టుబడి ,సమైఖ్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక్కసారి కూడా  జై సమైఖ్యాంధ్ర అనకుండా చంద్రబాబు గారు  మాటకు కట్టుబడి ఉన్నారు. తెలంగాణా విడిపోతే ఆంధ్రప్రదేశ్  ఆర్ధిక పరిస్థితి ఏమిటో  కూడా చంద్రబాబు లాంటి మేధావులకు తెలియనిది కాదు. అయినా కూడా  ఎన్నికల ముందు   ఆంధ్రప్రదేశ్   ప్రజలకు వాళ్ళ బాగు దృష్ట్యా చంద్రబాబు గారు తమ మేనిఫెస్టో లో వివిధ రకాలైన హామీలు ఇచ్చారు . తాను  చేసి చూపిస్తానన్నారు . ప్రజలు ఆయనకు ఉన్న అనుభవాన్ని నమ్మి  ఆయనను నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. కావున కమిటీ ల తో, శ్వేత పత్రాలతో కాలయాపన చేయకుండా హామీలను నెరవేర్చాలని ప్రజలందరూ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు . 

   


9, జూన్ 2014, సోమవారం

ఇదేంది బాబూ!

మొదటి సంతకం రైతు  ఋణ మాఫీ మీద అని ఎన్నికల ప్రచారం లో ఊదర గొట్టేసిన టి.డి. పి  వాళ్ళు మరియు వారి అనుకూల మీడియా  తీరా ప్రమాణ స్వీకారం సమయం వచ్చేటప్పటికి ఋణ మాఫీ మీద ఏర్పాటు చేసిన కమిటీ మీద సంతకం చేసి  రైతులను ఉసూరుమనిపించారు.కిరణ్ గారి ప్రభుత్వం లోకూడా డెల్టా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి ఆందోళనలు చేస్తుంటే ,వివిధ మీడియాలలో చర్చలు పెట్టి చివరికి ఒక మోహన్ కందా కమిటీ వేసారు. అది ఏమయ్యిందో ఇంత వరకూ తెలియదు. ఇది కూడా  అలాంటి కమిటీ కాకుంటే బాగుంటుంది . అయినా ఇప్పుడు రైతులకు అర్జెంటుగా ఋణాలు  కావాలి. సీజన్ మొదలైంది. కమిటీ ల తో కాలయాపన చేస్తే అదును  తప్పి పోతుంది. కావున ప్రభుత్వం కమిటీ ల తో కాలయాపన చేయకుండా ఋణమాఫీ  యుద్దప్రాతిపదిక మీద  అమలు చేయాలి.           

1, జూన్ 2014, ఆదివారం

శుభాకాంక్షలు!

తెలంగాణా రాష్ట్రం ఏర్పడుతున్న సందర్భంలో తెలంగాణా ప్రజలందరికీ హృదయపూర్వక  శుభాకాంక్షలు .  

28, మే 2014, బుధవారం

చాలా ఈర్హ్య గా ఉంది ఎ. పి .ప్రజలను చూస్తే!

ఆంధ్రప్రదేశ్ పజలను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం మరియు ఈర్ష్య   కలుగు తున్నది. ఎందుకంటే జూన్ 2  తర్వాత  వారు అనుభవించే సుఖాలను గురించి తలచు కొని. 
    
 ఎలా లేదన్నా ఇంటికి ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్లకు పెన్సన్ 2000 రూపాయలు,ఇద్దరు నిరుద్యోగులు వాళ్లకు భృతి  4000 .ఇలా ఏం  పని చేయకున్నా ప్రతి కుటుంబానికి నెలకు కనీసం ఆరు వేల రూపాయలు వస్తాయి. ఇక మహిళలు వంట చేయ వలసిన పని లేదు,ఎందుకంటే అన్నా క్యాంటీన్ నుండి  తక్కువ రేటు తో పార్సల్ తెచ్చు కోవచ్చు. హాయిగా ఇంట్లో కూర్చొని ఉచిత విద్యుత్ ఉపయోగించుకొని టి.వి. చూస్తూ ఉండడమే . అలాగే యువకులు /యువతులు బోర్ కొడితే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ట్యాబ్ తీసికొని పబ్లిక్ ప్లేసెస్ ల ఉచితంగా లభించే ఎ.సి లో కూర్చొని ,వై.ఫై.  ఉపయోగించుకొని స్నేహితులతో చాటింగ్ చేయ వచ్చు . ఇప్పటికే ఒక వేళ ఋణాలు  చేసి ఉంటే అవి తీర్చాలనే బాధ లేదు,ఎలాగూ ప్రభుత్వం మాఫీ చేస్తుంది .1,50,000 ల తో ఇల్లు కూడా ఉచితంగా ప్రభుత్వం కట్టి ఇస్తుంది .  ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇలాంటివి చాలా ఉన్నాయి ఎ. పి . ప్రజలు అనుభవించే సుఖాలు.
                  కానీ నాకు చాలా ఈర్హ్య గా ఉంది  ఎ. పి  .ప్రజలను చూస్తే ,ఎందుకంటే  ఈ స్వర్గ సుఖాలను నేను అనుభవించే అవకాశం  లేదు కాబట్టి.            

18, మే 2014, ఆదివారం

మరొక సారి విశ్వసనీయతకు పరీక్ష !

ముందుగా అంధ్రప్రదేశ్ ,తెలంగాణా లో కొత్త ప్రభుత్వాలు చేబడుతున్న పార్టీ ల పెద్దలకు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు . కాంగ్రెస్స్ అధిష్టానానికి నిజాలు చెప్పకుండా ఇక్కడ వై .ఎస్. హవా ఏమీ ఉండదు అని చెప్పి తెలంగాణా ఇస్తే పార్టీని అధికారం లోకి తీసుక వస్తామని బీరాలు పలికిన నేతలు నేడెక్కడ?తెలంగాణా ఇచ్చిన తర్వాత కూడా పార్టీని అధికారం లోకి తేవడం పక్కన పెట్టి చివరికి తమ స్థానాల్లో కూడా  గెలవలేక పోయారు. అదే వై.ఎస్.  ఉన్నప్పుడు 2009 లో తెలంగాణా సెంటిమెంట్ ఉన్నప్పుడు , తెలంగాణాకు మొదటి ప్రతినిధిగా భావించే టి.ఆర్.ఎస్ ,టి.డిపి. ఇంకా ఇతర పార్టీలు కూటమిని ఏర్పాటు చేసినా  కూడా వై.ఎస్. ఒంటి చేత్తో అధికారం లోకి తీసుకొని వచ్చాడు . అదీ నాయ కత్వం అంటే ! 
        
            ఇంక అంధ్రప్రదేశ్  లో జగన్ తాను  ఖచ్చితంగా అధికారం లోకి వస్తాను అనుకున్నాడు,అందుకే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అవి తీర్చలేక ,విశ్వసనీయతను పోగొట్టుకోవడం ఇష్టం లేక అమలు చేయ గలిగే హామీలనే ఇచ్చాడు .కానీ టి.డి.పి  కి ఇప్పటికే పది సంవత్సరాలుగా  అధికారం లేదు ,చావో రేవో తేల్హుకోవలసిన పరిస్థితి,ఒక వేల ఇప్పుడు ఓడిపోతే పార్టీ ఉనికే ప్రమాదం లో పడే పరిస్థితి,కావున ఒకప్పుడు గొప్ప సంస్కరణ వాదిగా ,ఎ. పి  లో సంస్కరణలకు ఆద్యుడుగా తనకు తానూ చెప్పు కునే చంద్రబాబు గారు హామీలను తీర్చగల నో లేదో అని ఆలోచించ కుండా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చేశారు. ముఖ్యంగా రైతు  ఋణ  మాఫీ ని ప్రజలు  బాగా నమ్మినట్లున్నారు.  ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో లేక మరొక సారి తన విశ్వసనీయతను కోల్పోతారో చూడాలి.  
     
         జగన్ గారు తన అపజయానికి కారణాలేవో నిష్పాక్షికంగా విశ్లేసించు కొని ఒక బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరుపున పనిచేస్తూ ,టి.డి .పి  ఇచ్చిన అన్ని హామీలను నూటికి నూరు పాళ్ళు  అమలు చేసేలా అధికార పక్షాన్ని ప్రజల తరపున ప్రశ్నిస్తూ ప్రయాణం చేయాలని ఆశిస్తూ ......  

19, ఏప్రిల్ 2014, శనివారం

నోటా బటన్ నొక్కిన తర్వాత?

చాలా  రాజకీయ పార్టీ లు నిలబెట్టే అభ్యర్తు ల  చరిత్ర  చూసినా ఏమున్నది గర్వకారణం,పాత రౌడినో లేక ఖూనికోరో లేక అక్రమ వ్యాపారాలవలన కోట్లు సంపాదించినవాడో కనిపిస్తున్నాడు.వీళ్ళకు వోట్లు వేయాలంటే వెగటు పుడుతుంది. కాబట్టి వోటింగ్ యంత్రం లో నోటా  బటన్ పెట్టినట్లున్నారు . నిల్చిన అభ్యర్థులెవరూ ఇష్ఠంలేని వాళ్లు ఆ బటన్ నొక్కుతారు. మొత్తం వోట్లు లెక్కించిన తర్వాత కొంత శాతం వోట్లు నోటా  బటనుకు వస్తే ఆ ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించాలి.ఆ ఇష్ఠం లేని అభ్యర్థులను కొన్ని సంవత్సరాలు ఎన్నికలలో పాల్గొనకుండా డిబార్ చేసి,ఆ ఎన్నికల ఖర్చును ఆ గుర్తింపు పొందిన పార్టీలనుండి వసూలు చేయాలి.ఇలా చేస్తే తర్వాత నుండి  ఆ పార్టీ లు వీలైనంత మంచి అభ్యర్ధు లను నిలబెడతారు. దీని మీద ఎన్నికల కమీషన్ దృష్టి  పెట్టాలి. 

16, ఏప్రిల్ 2014, బుధవారం

సామాన్య ప్రజలకు సింగపూర్ ఎలా ఉంటుందో ఏం తెలుసు ?

తమ పార్టీ ని గెలిపిస్తే సామాన్య ప్రజలకు ఏం  చేస్తామో చెప్పకుండా  ఆంధ్ర ని  సింగపూర్ చేస్తామని   హామీ లు ఇస్తున్నారు. అసలు  సింగపూర్ ఎలా ఉందో అక్కడ ఏముందో సామాన్య ప్రజలకు ఏం  తెలుసు. వాళ్ళు అక్కడికి ఎప్పుడూ వెళ్ళలేదుగా!కావున సింగపూర్ మాటలు కాకుండా తాము అధికారం లోకి వస్తే ఏం చేస్తామో చెబితే బాగుంటుంది . 

తెలంగాణా విధ్వంసం లో కె.సి.ఆర్ పాత్ర !

సీమాంధ్ర పాలనలో   తెలంగాణా  లో హిరోషిమా,నాగసాకి తరహాలో విధ్వంసం జరిగింది అంటున్న  కె.సి.ఆర్ ఒక విషయం గుర్తుకు పెట్టుకోవాలి. అదే సీమాంధ్ర పాలనలో తను కూడా  మంత్రిగా పని చేసారు. అధికారాన్ని అనుభవించారు . ఒక వేల ఆయన చెప్పినట్లు విధ్వంసం  జరిగి ఉంటే దానికి ఆయన కూడా  బాధ్యత వహించాలి . తెలంగాణా ప్రజలకు క్షమాపణ చెప్పాలి.