12, జూన్ 2009, శుక్రవారం

జూనియర్ డాక్టర్ల లొల్లి

జూనియర్ డాక్టర్లు మళ్ళీ లొల్లి మొదలు పెట్టినారు.డాక్టర్లను ఎవరూ ఊరకే కొట్టరు.ఆవతల వ్యక్తికి చాలా కడుపు మండుతే తప్ప ఊరకనే ఎవరూ కొట్టరు.ప్రభుత్వాసుపత్రులలో డాక్టర్లు చేసే అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.నాకు కూడా ప్రభుత్వాసుపత్రిలో ఒక అనుభవముంది.మా బంధువు ఒకాయన కు చేయి విరిగితే కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వెళ్ళాం.అక్కడ డాక్టర్లకు ప్రతి ఒక్కరికీ ప్రేవేట్ ప్రాక్టీసు ఉంది.అక్కడ డాక్టర్లు అందరూ విదేశీ కార్లు వాడుతున్నారు.అక్కడ మా బంధువును చూసిన తర్వాత అక్కడ డాక్టరు తన ప్రవేట్ క్లినిక్కు కు రమ్మని అడ్రస్ చెప్పాడు.అక్కడ బేరం మొదలు పెట్టినాడు.మేము అంత డబ్బు ఇవ్వమని చెప్పేసరికి మాకు పదునైదు రోజులు అడ్మిస్సినే దొరకలేదు.అడ్మిట్ అయిన తర్వాత ఒక డాక్టరు ఉదయం ఇంజేక్షేన్ వ్రాసి పోతే అది వేయడానికి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు .అక్కడ ఉన్న నర్సులను అడిగితే మేము వేయకూడదు.జూనియర్ డాక్టరు వేస్తాడు,అని చెప్పేవాళ్ళు.జూనియర్ డాక్టర్లు ను అడిగితే చాలా నిర్లక్ష్యంగా జవాబు చెప్పేవాళ్ళు.చివరకు రోజంతా ప్రయత్నం చేసినా గానీ ఇంజక్షన్ వేయించు కోలేకపోయాము.మాకేమో ఇన్ఫెక్షన్ వస్తుందని భయం.చివరికి అక్కడ నుండి డిశ్చార్జ్ చేయించుకొని పుత్తూరు కు వెళ్లి కట్టుకట్టించుకొని వచ్చినాము.అటువంటి సందర్భములో కొట్టాలని అనిపించదా? ప్రభుత్వం ఆసుపత్రుల మీద ,డాక్టర్లమీద ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంది.కానీ డాక్టర్లకు కొంచం కూడా సామాజిక భాద్యత లేదు.వీళ్ళు డాక్టరులుగామారడానికి ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది ప్రజల సొమ్మే అని వీళ్ళు మర్చిపోతున్నారు.ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకుజవాబుదారీగా లేనంతవరకూ ప్రజలకు వేరే మార్గంలేక ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూనేఉంటారు.జూనియర్ డాక్టర్లు స్త్రైకులు,ధర్నాలు చేస్తే వాళ్ల డిగ్రీ ని రద్దు చేయాలి.ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే హక్కువాళ్లకు లేదు.వీళ్ళు ప్రతిసారీ ఇలాగే చేస్తున్నారు.కావున వాళ్ల బెదిరింపులకు ప్రభుత్వం భయపడకూడదు.

6, జూన్ 2009, శనివారం

భూస్వామ్య భావజాలం

చాలా మంది రాజకీయనాయకులు మేము దళితులకు స్పీకరు పదవి ఇచ్చినాము.మైనారిటి లకు రాష్ట్రపతి పదవి ఇచ్చినాము అనడం ఫ్యాషన్ అయి పోయింది.అంటే వాళ్లకు ప్రతిభ లేదా .వీళ్ళు ఇచ్చేవాళ్ళు ,దళితులు పుచ్చుకునేవాల్లా.ప్రతిభా భారతి గారిని,బాలయోగి వంటి దళితులను స్పీకరు ను చేసినాము అని ,మరియు కలాం గారి లాంటి మైనారిటి ని రాష్ట్రపతిని చేసినాము అని చంద్రబాబు గారు,ఈ మధ్యన మీరాకుమార్ లాంటి దళిత మహిళ ను లోక్సభ స్పీకర్ ను చేసినామని కాంగ్రెస్స్ వాళ్లు చాలా సార్లు అంటున్నారు.అంటే దళితులైన ,మైనారిటి లైన వీళ్ళందరికి ప్రతిభ లేదా.వాళ్ల వాళ్ల ప్రతిభను బట్టి వాళ్లకు ఆ పదవులు దక్కినాయి.ప్రజాస్వామ్య భారతదేశం లో ప్రజలందరికీ వాళ్ల వాళ్ల ప్రతిభను బట్టి ఎలాంటి పదవైనా పొందే అవకాశం ఉంది. దళితులని ఆ పదవులు ఇచ్చినాము అనడం దళితులను ,వాళ్ల ప్రతిభను అవమానించడమే అవుతుంది.మన రాజ్యాంగాన్ని వ్రాసింది ఒక దళితుడే. కావున ఆ మాటను పదేపదే అనడం భూస్వామ్య భావజాలమే అవుతుంది.మన రాజకీయనాయకులు ఆ పద ప్రయోగం మానుకుంటే దళితుల ను , మైనారిటి ల ను నిజంగా గౌరవించి నట్లవుతుంది.

4, జూన్ 2009, గురువారం

చంద్రబాబు గారి విజ్ఞత ను చూసారా?

ఎన్నికలు అయి ,ఓడిపోయిన తర్వాత చంద్రబాబు గారి ప్రకటనలు,ఆయన ముఖంలోని భావాలను గమనించినట్లైతే అధికారం అనేది ఈ రాష్ట్రంలో ఆయనకు తప్ప వేరే ఎవరికీ ఇవ్వకూడదు,రాజరికం లాగా ఆయననే ప్రతిసారీ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుండ పెట్టాలి అనే భావనతో ఉన్నారు.లోక్సత్తా ,ప్రజారాజ్యం పార్టీలు వచ్చి మమ్మలను ప్రతిపక్షంలో కూర్చో పెట్టినారు అన్నాడు.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా పార్టీ పెట్టి వాళ్ల విధానాలు చెప్పుకొని ఎన్నికలలో పోటీ చేయవచ్చు.వాళ్ళొచ్చి ఈయన జాగీర్దారును లాక్కోన్నట్లు ప్రజాస్వామ్య స్ఫూర్తి కి విరుద్దంగా మాట్లాడాడు.తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతాడని ఊహించలేదు.అటువంటి ఫ్యూడలిస్టిక్ భావాలు కలిగిన వ్యక్తి తో తొమ్మిది సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాలించ బడినారంటే అది ప్రజల ఖర్మ . అసెంబ్లీ లో స్పీకరు గా ఎన్నికైన వ్యక్తిని అన్ని రాజకీయ పార్టీల నాయకులు అతని స్థానానికి పిలుచుకొని పోవడం ఒక సాంప్రదాయం.మొదటి సారి అసెంబ్లీ కి వచ్చినపార్టీ సభ్యులు కూడా చాలా హుందాగా ఆ సంప్రదాయం పాటించారు.ఈయన ఆ సంప్రదాయాన్ని కూడా పాటించ కుండా ప్రజాస్వామ్య వ్యవస్థ లో స్పీకరు స్థానానికున్న గౌరవాన్ని దిగజార్చారు.ఈ రోజు అసెంబ్లీ లో ఆయన హావభావాలు పరిశీలిస్తే ఆయన చాలా అన్ ఈసీ గా కూర్చున్నట్లు కనిపించింది.ముఖ్యమంత్రి పీఠం ఆయన జన్మ హక్కు అయినట్లు,దాన్ని వేరెవరో ఆయననుంచి బలవంతంగా లాక్కున్నట్లు ఆయన భావాలు కన్పిస్తున్నాయి.వాళ్ల సభ్యుడు మాట్లాడు తూ స్పీకర్ స్థానానికి కులాన్ని,ప్రాంతాన్ని అంటగడుతూ మాట్లాడాడు.ముఖ్యమంత్రి,ప్రతిపక్షనాయకుడు,స్పీకర్ ముగ్గురూ ఒకే ప్రాంతం నుండి వచ్చినట్లు తెలుగుదేశం వాళ్లకు బాధగా ఉంటే ప్రతిపక్ష నాయకుని పదవిని చంద్ర బాబు గారిని త్యజించి వేరే ప్రాంతం వాళ్లకు ఇస్తే సరి పోతుంది.ఇప్పుడు చంద్రబాబు గారి కి వచ్చిన సీట్లు ఆయన ముఖం చూసి ఎవరూ ఓట్లు వేయలేదు.మహా కూటమి కట్టడం వలెనే ఆయనకు ఆ సీట్లు వచ్చినాయి అని ఆయన గుర్తు పెట్టుకుంటే మంచిది.చంద్రబాబుగారిని నమ్మడం ప్రజలు ఎప్పుడో మర్చి పోయినారు.ఆయన ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తి తో వ్యవహరిస్తే ఆయన గౌరవం మరియు శాసన సభ గౌరవం ఇనుమడిస్తుంది.లేదంటే రామారావు గారు ప్రజలకు ఎంతో సేవ చేయాలనీ స్థాపించిన పార్టీని ,చంద్రబాబు గారిని ప్రజలు ఛీ కొడతారు.

1, జూన్ 2009, సోమవారం

ఆధునిక వెట్టిచాకిరి

కార్పోరేట్ కాలేజీలు తమ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి.తమ కాలేజీ లకు ఇన్ని ర్యాంకులు వచ్చినాయి ,ఇంతమంది .ఐ.టి లకు సెలెక్ట్ అయినారని తిరిగి తమ విద్యా వ్యాపారాన్ని పెంచు కోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నారు.ఎంతమంది పరీక్షలు వ్రాసినారు,సీట్లు,ర్యాంకులు రాని వారు ఎంతమంది కాలేజీ లలో ఉన్నారనే విషయం ఎవరికీ తెలియడంలేదు. కాలేజీలు తల్లితండ్రులను,పిల్లలను తమ వ్యాపారాన్ని పెంచుకోవడానికి ,తాముకోటీశ్వరులు కావడానికి పావులుగా వాడుకుంటున్నారు,తప్ప పిల్లల భవిష్యత్ గురించి ఏమీ పట్టించుకోవడం లేదు.సివిల్ సర్విసులలో నెగ్గిన వాళ్లు కూడా రోజుకు ఎనిమిది గంటలు చదివితే చాలంటున్నారు.కానీ కాలేజీలు పిల్లలనుఒక రూము కు పరిమితము చేసి సుమారు పంతొమ్మిది గంటలు చదివిస్తున్నారు.చదివించడమనే దాని కంటే యాజమాన్యాలు కోటీశ్వరులు కావడానికి పిల్లల చేత వెట్టి చాకిరి చేయిస్తున్నారని చెప్పవచ్చు.పిల్లలకు ఆటలు ,మరే ఇతర వ్యాపకాలు లేకుండా చేసి వారిని మానసిక వికలాంగులుగా మారుస్తున్నారు. కాలేజీ లు సాగిస్తున్నఅరాచకాలను,ఆధునిక వెట్టి చాకిరి ని అడ్డుకోక పోతే సమాజం భ్రష్టు పట్టి పోతుంది.