1, మే 2013, బుధవారం

అన్ని వ్యవస్థలు అలాగే ఉన్నాయి.ఎవరిని నమ్మాలి?

సి.బి.ఐ  మీద సుప్రీం కోర్టు వ్యాఖ్యలు మన దేశం లో వ్యవస్థలు ఏ విధంగా పని చేస్తున్నాయో తెలియ చెబుతుంది . ఒక్క సి.బి.ఐ  మాత్రమే కాదు చాలా వ్యవస్థలు అధికారంలో ఉన్న వాళ్లకు ,డబ్బున్న వాళ్లకు మాత్రమే  చాలా సందర్భాలలో పని చేస్తున్నాయి. చివరికి సామాన్యుడు తనకు అన్యాయం జరిగిందని కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెలితే ,ముందు కంప్లైంట్ తీసుకోకుండా నిందితుని స్థితిగతులు,రాజకీయ ప్రాబల్యం చూసుకున్న తర్వాతే కంప్లైంట్ తీసుకునే పరిస్థితి.ప్రజల పన్నులతో పని చేస్తున్న అన్ని వ్యవస్థల మీద ప్రజలకు విశ్వాసం   పోయింది .చివరికి ఫోర్త్ ఎస్టేట్ గా పిలువ బడుతున్న  మీడియా ను కూడా నమ్మే పరిస్థితి లేదు. వాటికి కూడా రకరకాల రాజకీయాలు ,వివిధ అవలక్షణాలు అబ్బాయి. చివరికి సామాన్యుడు ఈ దేశం లో ఎవరిని నమ్మాలో అర్థం  కాని పరిస్థితి.