29, మే 2010, శనివారం

ప్రత్యేక వాదుల ప్రజాస్వామ్యం?

మనం ఎవరింటికైనా వెళ్తా వుంటే ,మనం వాళ్ళింటికి వెళ్ళడం వాళ్లకు ఇష్టం లేక పొతే వాళ్ళు చెప్పాలి వాళ్ళింటికి రావద్దని,కానీ పక్కింటివాడు చెప్పద్దు వాళ్ళింటికి పోవద్దని.ఇదేం న్యాయమో అర్థం కావడం లేదు , మరణించిన కుటుంబాలను పరామర్శిం డానికి జగన్ పోతా ఉంటే టి.ఆర్.ఎస్ వాళ్ళు అడ్డుకోవడం ,హింస సృష్టించడం ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం చేసారో అర్థం కావడం లేదు.టి.ఆర్.ఎస్ వాళ్ళ రెచ్చగొట్టే మాటల వలన చనిపోయిన తెలంగాణా వాదులను ఒక రోజు కూడా పరామర్శించి ,ఆర్ధిక సాయం చేయని వీళ్ళు జగన్ మాత్రం కుటుంబాలను ఒక చోట చేర్చి ఆర్ధిక సాయం చేయాలని ,పరామర్శకు వెళ్ళవద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారు. టి.ఆర్.ఎస్ వాళ్ళు చెప్పిన టైము లో పరామర్శకు వెళ్ళాలంట,వాళ్ళు చెప్పిన విధంగా ఆర్ధిక సాయం చేయాలంట ,మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటు పయనిస్తుంది,ఆటవిక సమాజంలోకి తీసుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారా? టి.ఆర్.ఎస్ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పేలుతుంటే రాష్ట్రప్రభుత్వం ఏం చేస్తున్నట్లు,మేధావి వర్గాలు ఏం చేస్తున్నట్లు. ప్రత్యేక తెలంగాణా కావాలని కోరిన వాళ్ళు వాళ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా చలామణి అవుతున్నారు,ఇది విధంగా నైతికతో అర్థం కావడం లేదు.ప్రత్యేక వాదం మాట్లాడే వాళ్లకు సమైక్య ఆంధ్రప్రదేశ్ కు మంత్రులుగా పనిచేసే అర్హత లేదు.వాళ్ళు మంత్రిపదవులకు రాజీనామా చేసిన తరవాత మాత్రమే ప్రత్యేక వాదం గురించి మాట్లాడాలి.

18, మే 2010, మంగళవారం

కే.సి.ఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతనే విజయవాడ పర్యటన చేయాలి.

సీమాంధ్ర ప్రజలు తెలంగాణా ప్రజలను దోచుకున్నారని ,సీమాంధ్ర ప్రజలు దోపిడిదారులని ఇన్ని రోజులు విష ప్రచారం చేసి , సీమాంధ్ర ప్రజల మనసులను గాయ పరిచిన కే.సి.ఆర్ విజయవాడ పర్యటనకు వెళ్లేముందు సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పి తర్వాతనే పర్యటనచేయాలి.సమైక్యాంధ్ర ఉద్యమ కారులు ,నాయకులు కే.సి.ఆర్ క్షమాపణకు పట్టుపట్టాలి.