17, ఏప్రిల్ 2010, శనివారం

కే.సి.ఆర్ గారు ఓదార్పు యాత్ర చేయరా?

రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత భాధతో మరణించిన వ్యక్తుల కుటుంబాలను ప్రాంతాలకతీతంగా పరామర్శిస్తూ ,వీలైనంత ఆర్ధిక సాయం ప్రకటిస్తున్న జగన్ గారిని కే.సి.ఆర్ మరియు ఆయన పార్టీ వాళ్ళు అభినందించాల్సి పోయి విమర్శించడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది.కే.సి.ఆర్ మరియు టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్ళ రెచ్చగొట్టే మాటల వలన తెలంగాణా లోని అమాయక ప్రజలు కొంత మంది ప్రాణ త్యాగం చేసినారు.తెలంగాణా కోసం అమరులైనారని పదేపదే చెప్పుకొని శవ రాజకీయాలు చేస్తున్న టి.ఆర్.ఎస్ వాళ్ళు కుటుంబాలను ఒకసారైనా పరామర్శించి,వాళ్లకు ఏమైనా ఆర్ధిక సాయం చేశారా? విషయం చూస్తే తెలుస్తుంది,టి.ఆర్.ఎస్ వాళ్లకు తెలంగాణా ప్రజల మీద ఉన్నప్రేమ.తెలంగాణా ప్రజల మేలు కోసమే తెలంగాణా రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పుకుంటున్న టి.ఆర్.ఎస్ .పార్టీ కి పదవుల మీద ఉన్న ఆసక్తి తెలంగాణా ప్రజల మీద లేనట్లుంది. ఇటువంటి వాళ్ళ వలన వచ్చిన తెలంగాణా(ఒక వేళ వస్తే) విధంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందో తెలంగాణా ప్రజలు ఒక సారి ఆలోచన చేయాలి.

3, ఏప్రిల్ 2010, శనివారం

ఏ తెలంగాణా రాష్ట్రం కావాలి?

ప్రత్యేక తెలంగాణా కావాలనుకునే వారిని ఒకటి అడగాలనుకుంటున్నాను,వాళ్లకు కావలసిన తెలంగాణా ఇప్పుడు మూడు రాష్ట్రాల దగ్గర ఉన్నది.మహారాష్ట్ర దగ్గర,కర్నాటక దగ్గర ,ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్నది.వాళ్లకు తెలంగాణా కావాలనో? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోఉండేది,తెలుగు మాట్లాడే ప్రజలు ఉండే భాషా ప్రయుక్త రాష్ట్రం.భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు ఉండే తెలంగాణా వాళ్లకు కావాలనుకుంటే మూడు రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి.