29, జనవరి 2011, శనివారం

జగన్ రాజశేఖరరెడ్డి గారి లాగే చరిత్ర సృష్టిస్తాడు.

చరిత్ర మళ్ళీ పునరావృతం అవుతూ ఉంది.ఇరవై సంవత్సరాల క్రితం రాజశేఖరరెడ్డి గారి కి ఉన్న జనాదరణ ను చూసి కొన్ని మీడియా సంస్థలు ,కొన్ని పార్టీల పెద్దలు ఆయన్ను ఫ్యాక్షనిస్టు అని రాష్ట్రం లో ఏం జరిగినా ఆయనకే ఆపాదిస్తూ ఆయన్ను ప్రజల మనస్సులలో నుండి దూరం చేయాలని నానా ప్రయత్నాలు చేసినా , ఎవరెన్ని కుట్రలు పన్నినా ఒక ధీరుని వలె ఒంటి చేత్తో పార్టీ ని అధికారంలోకి తీసుకొని వచ్చి ప్రజారంజకంగా పరిపాలన సాగించి ప్రజల మనస్సులలో ఒక దేవుని వలె నిలిచి పోయినాడు.ఆయన ఎవరికీ వెన్నుపోటు పొడవలేదు, మీడియా సంస్థలకు వంగి వంగి సలాములు చేసి తమకు అనుకూలంగా ప్రచారం చేసికొని పరిపాలన సాగించ లేదు.ప్రత్యర్థులు సైతం పొగిడే విధంగా పరిపాలన సాగించారు.ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన మీడియా సంస్థల ,మరియు ప్రతిపక్ష నేతల మరియు అధికార పక్షం లోని ఆయన వ్యతిరేకుల విశ్వసనీయతను ప్రశ్నార్థకం లో పడేసారు.
వాళ జగన్ కు ఉన్న ప్రజాదరణను చూసి ఆయన్ను అడ్డుకోవడానికి అన్ని పార్టీ లు చాలా మీడియా సంస్థలు ఏకం అయ్యాయి.కొన్ని మీడియా లో ప్రశ్నార్థక చిహ్నం(?) పెట్టి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు దుష్ప్రచారం చేసిందే చేస్తున్నారు.ఇలా చేసి వాళ్ళ విశ్వసనీయత ను పోగొట్టుకుంటున్నారు.ఇప్పటికే కొన్ని పార్టీలు ఇలా విష ప్రచారం చేసి ప్రజలలో విశ్వసనీయత పోగొట్టుకొని నవ్వుల పాలయ్యాయి.ఇలా ఎన్ని చేసినా ప్రజల మనస్సులలో నుండి రాజశేఖర రెడ్డి గారిని మరియు జగన్ ను తీసి వేయలేరు.ఎప్పటికైనా వాళ్ళ నాన్న గారి లాగే జగన్ కూడా ఇవన్నీ చేదించుకొని బయట పడి అధికారం లోకి వచ్చి చరిత్ర సృష్టిస్తాడు.

1, జనవరి 2011, శనివారం

శుభాకాంక్షలు

బ్లాగు మిత్రులందరికీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు.