30, మే 2009, శనివారం

బాబు గారి మరియు చిరంజీవి గారి విస్లేసన

చందబాబు గారు మరియు చిరంజీవి గారు ఇప్పటికి మారలేదు.ఓటమిని నిష్పక్షపాతంగా విస్లేసించలేకున్నారు.ఒకాయనేమో యి.వి.యం ల వలన ఓడిపోయినామంటున్నారు.ఇంకొక ఆయనేమో ప్రధానమంత్రి పథకాల వలన ఆయన ఓడిపోయినామని అంటున్నాడు.చిరంజీవి గారు మార్పు అంటూ వచ్చి చాలా మంది పాతకాపులకే టికెట్లు ఇచ్చి ,మూస రాజకీయాలు నడిపినాడు.అందువల్లనే ఆయనను కూడా ప్రజలు మిగతా పార్టీ ల గాటనే కట్టేశారు.ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని నిష్పక్షపాతంగా విస్లేసించుకొని చేసే పనులు మార్చు కుంటే ప్రజల ఆదరణ పొందుతారు,లేకుంటే చరిత్రలో కలసిపోతారు.

18, మే 2009, సోమవారం

సూడో సెక్యులరిజం

నిజామాబాదు లో పి.సి.సి. అధ్యక్షుడు శ్రీనివాస్ గారి ఓటమి సూడో లౌకికవాదులకు ఒక కను విప్పు కావాలి."మైనారిటీల మీదకి చేయి చూపిస్తే ఆ చెయ్యి ఉండదని ",మైనారిటీ లు ఉన్న సభలో మాట్లాడుతూ అన్నట్లు పత్రికలలో వార్తలు వచ్చినాయి.అది చూసి హిందువులంతా బి.జే.పి అభ్యర్థికి గంపగుత్తగా ఓట్లు వేసి శ్రీనివాస్ గారిని ఓడించినట్లున్నారు. ఈ వాళ దేశం లో కాంగ్రెస్,సమాజ్ వాదీ,ఆర్.జే.డి. లాంటి పార్టీ లు సూడో లౌకికవాద రాజకీయాలు నడిపినారు కాబట్టే ,బి.జే.పి లాంటి మతతత్వ పార్టీ లు బలం పుంజుకున్నాయి. మోడి లాంటి నాయకులు బలపడడానికి అవకాశం ఏర్పడింది.భిన్న మతాలు,కులాలు,సంస్క్రతులు ఉన్న దేశంలో పార్టీలు,నాయకులు సూడో లౌకిక వాదాన్ని వదిలి పెట్టి నిజమైన లౌకిక వాదులుగా మారితే ప్రజలకు,దేశానికి మంచిది.

16, మే 2009, శనివారం

జయహో ఓటరు మహాశయా!


ఈ ఎన్నికలలో దేశ ప్రజలు ,ముఖ్యంగా మన రాష్ట్ర ప్రజలు చాలా విస్పష్టమైన తీర్పు ఇచ్చినారు.ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు.

  • ముఖ్యంగా చంద్రబాబు గారి మోసపూరితమైన హామీలను నమ్మలేదు.అన్ని పార్టీలను కలుపుకొని ఒక కూటమి ఏర్పాటు చేసి ప్రజాసేవ కంటే అధికారమే పరమావధి గా పని చేసినారు.ఆయన విశ్వసనీయతను , చిత్తశుద్ది ని ప్రజలు ఎవరూ నమ్మలేదు."ముఖ్యంగా నాయకులు విశ్వసనీయత,చిత్తశుద్ది ఒక సారి కోల్పోతే ప్రజలు వారిని నమ్మరని తేలిపోయింది."
  • సామాజిక న్యాయం అంటూ వచ్చి రాత్రికి రాత్రే ముఖ్యమంత్రి కావాలని కలలు కన్న ఇంకొక ఆయనను చిత్తుగా ఓడించినారు. ముఖ్యంగా మార్పు అంటూ వచ్చిన ఆయన లోకసత్తా లాగా నిజాయితీ పరులకు టిక్కెట్లు ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంకో విధంగా ఉండేదేమో.ఈయన కూడా అధికార పేఠమే పరమావధిగా ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చినాడు.సభలకు వచ్చిన ప్రజలను చూసి అదంతా తన బలుపు అనుకొని ఆయన గాల్లో తేలిపోయినాడు.చివరికి అది వాపు అని తేలిపోయింది.చివరకు పాలకొల్లులో ఒక మామూలు మహిళ చేతిలో మెగాస్టార్ తలవంచ వలసింది. ఓట్ల కంటే ముందే ముఖ్యమైన నాయకుల ను కోల్పోయిన ప్రజారాజ్యం పార్టీ ,ఈ వాళ ఓట్లలో ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ,పార్టీ ఉనికే ప్రమాదంలో పడిపోయింది."ఈ వాళ ప్రజారాజ్యం తరుపున గెలిచిన వాళ్లు కూడా తమ సత్తాతో గెలిచిన వాళ్ళే,చిరంజీవి చరిష్మా ఏమీ పని చేయలేదని తేలిపోయింది."
  • కమ్యూనిస్టులు అధికారాన్ని ఆశిమ్చ కుండా ప్రజా ఉద్యమాలను నిర్మించి నిర్మాణాత్మక సూచనలను ప్రభుత్వాలకు చేస్తూ ,ప్రతిదినమూ ఒక పార్టీ తో అధికారంకోసం జట్టు కట్టేది మానుకొని వాళ్లు స్వంతం అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయాలి.విశ్వసనీయత లేని పార్టీలతో వీళ్ళు జట్టు కడితే వీళ్ళ విశ్వసనీయత కూడా దెబ్బ తింటుంది.
  • సినిమా వాళ్లు కూడా ,వాళ్ల గురించి వాళ్లు ఎక్కువగా ఊహించు కునేది మానుకోవాలి.నిన్న గాక మొన్న సినిమాలలోకి వచ్చి రెండు మూడు సినిమాలు విజయవంతమైన హీరోలందరూ కూడా ,ప్రజలు వీళ్ళు ఏది చెపితే అది వినే వెర్రి వాళ్లు అనుకొని జనాన్ని చూస్తూనే పూనకం వచ్చిన వాళ్ళలా ఇష్టమొచ్చిన డైలాగులు చెప్పి ,తొడలు కొట్టి ,మీసాలు తిప్పి నానా హంగామా చేసినారు.ప్రజా సేవ అంటే మూడు గంటల సినిమా కాదని ప్రజలు తేల్చేసారు.
  • చివరగా కాంగ్రెస్స్ పార్టీ కి కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయమని ,ఓటరు తీర్పు ఇచ్చినాడు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు భూములు ఇచ్చేత్తప్పుడు ఆ భూమి కోల్పోయే పేద రైతు ల కడుపు మంటను గుర్తు పెట్టుకొని పని చేయాలని ,ప్రభుత్వ పతకాలను ప్రజలందరికీ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేరవేయాలని,ఊర్లలో ఉండే చోటా లీడర్లను అదుపులో పెట్టుకొని ప్రజలకు ప్రభుత్వ పతకాలు నేరుగా అవినీతి లేకుండా చేరవేస్తే తిరిగి అయిదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం కాంగ్రెస్స్ వాళ్ళదే అవుతుంది.
  • ఒకసారి ఎన్నికవగానే సేవకులనే మాట మరిచిపోయి ప్రభువులమని అనుకుని ప్రజాసేవపట్టని నాయకులను ,మంత్రులను ఓడించి,ఓటరు వారికి ఒక మంచి గుణపాఠం చెప్పినాడు.
  • లోకసత్తా నాయకుని గెలిపించి ప్రజలు తమకు మెరుగైన ప్రజాస్వామ్య వ్యవస్థ కావాలని ,అవినీతి రహిత సమాజం కావాలని ,ప్రజాస్వామ్య పునాదులు ఇంకా గట్టి పదాలని,ఓట్లను డబ్బు తో కొనే విధానం పోవాలని చాలా బలంగా ,గట్టిగా కోరుకున్నారు.

14, మే 2009, గురువారం

ఆర్దిక మాంద్యంలో ఆంధ్రలో బాబు గారి పాలన ఉండింటే?


బాబు గారు తిరిగి అధికారం లోకి వస్తే అంతే.ఈ రోజు ఆర్థిక మాంద్యంలో కూడా ప్రజలు అంతో ఇంతో బాగున్నారంటే అది కాంగ్రెస్స్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలవలనే.ఒక వేళ బాబు గారు ఈ అర్థిక మాంద్యం ఉన్న రోజుల్లో అధికారంలో ఉండింటే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొనేవారో.ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక శాతం ప్రజలకు ఉపయోగపడే ఐ .టి గురించి మాత్రమే మాట్లాడే వాడు.ఆయన హై క్లాసు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించే వాడు.ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో ప్రజలు పాల పరిశ్రమ ,వ్యవసాయం పెట్టు కొని స్వయం సమ్రుద్ది సాధించి సంతోషంగా ఉన్నారు. ఆయన ఈ రోజు కూడా మారలేదు.అన్నీ ఫ్రీ గా ఇస్తానని అంటున్నాడు.ఎంతసేపు ప్రజలను భిక్షగాల్లను చేసి ఆయన పబ్బం గడుపు కోవాలని చూస్తున్నాడు.
ఈ ఆర్థికమాంద్యం రోజుల్లో బాబు గారు అధికారం లో ఉండింటే అని ఆలోచన వస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది.

9, మే 2009, శనివారం

నడమంత్రపుసిరి

తమ దాకా వచ్చేదాకా తెలియదన్నట్లు ,ఈవాళ స్కూలు ఫీజులు పెంచినారని ధర్నాలు చేస్తూ గగ్గోలు పెడుతున్నారు .విద్య,వైద్యం,గృహవసతి మధ్య తరగతి వారికి అందుబాటులో లేకుండా చేసింది నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళే .ఉదాహరణకు :-సాఫ్టువేరు ఉద్యోగస్తులు,మిగతా వైట్ కాలర్ ఉద్యోగస్తులు (క్షమించాలి ).వీళ్ళకు ఏదయినా ఒక వస్తువు ధర కానీ,ఒక సేవ ధర కానీ తక్కువ ఉంటే ఆ వస్తువు కు నాణ్యత లేనట్లే .పది రూపాయల వస్తువు విలువ వంద రూపాయలు చెబితే అది చాలా నాణ్యమైనదని కొనుక్కుంటారు.అసలు విలువ చెబితే వీళ్ళు కొనరు.అందుకే మార్కెట్టులో వస్తువు,సేవల విలువలు అంతగా పెరిగి సామాన్యుని కి అందుబాటులో లేకుండా పోయినాయి.

నేను ఒక సారి ఒక స్కూలుకు అడ్మిషన్ కోసం గురించి వెళ్తే ఫీజు చాలా చెప్పారు.ఎంత ఎక్కువ అంటే ఇంజనీరింగు ఫీజు కంటే ఎక్కువ చెప్పారు. ఎందుకు అంత ఎక్కువ ఫీజు అడుగుతున్నారంటే "ప్రజలు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాము "ఇది స్కూలు వాళ్ల సమాధానం .అంటే విలువ పెంచింది ఈ నడమంత్రపు సిరి వాళ్ళే.

రోజున్న ఆర్ధిక మాంద్యానికి కూడా కారణం వీళ్ళే.వీళ్ళు ఆర్ధిక క్రమశిక్షణ పాటిమ్చకపోవడమే.





8, మే 2009, శుక్రవారం

దారి తప్పిన పెద్దపులి

ఒక పోరాటంలో ప్రజాస్వామ్య పంథా లేకుండా నిరంకుశంగా ఉంటే ఫలితం ,ఇవాళ శ్రీలంక లో తమిళుల పరిస్థితి ని చూసి తెలుసుకోవచ్చు.మితవాద తమిళ పార్టీ ల నాయకులను ,తనకు అడ్డం వచ్చిన ప్రతి నాయకుని చంపుకుంటూ పోయి ఇవాళ తమిళ టైగర్లు అతర్జాతీయ మద్దత్తును కోల్పోయారు.తమిళ ఉద్యమానికి వేల మంది తమిళ సోదరుల ప్రాణత్యాగం చేసిన తర్వాత కూడా శ్రీలంక లో తమిళుల న్యాయ సమ్మతమైన కోర్కె లను తీర్చుకోలేని పరిస్థితి వచ్చింది.ఒక వేల ఎల్టి టి ఈ నేతృత్వంలో తమిళ దేశం వచ్చినా అది నియంతృత్వం లోకి జారు కొని ,అక్కడి తమిళ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి లోకి పడినట్లవుతుమ్ది.

కావున ఒక సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రజాస్వామ్యయుతంగా చర్చలు తప్ప ఆయుధం కాదని చరిత్రలో మరో సారి ఋజువు అయ్యింది.

5, మే 2009, మంగళవారం

నిజమైన నాగరికత

ఈ మధ్యన మేము మా కుటుంబం తో కలిసి వారణాసి ,అలహాబాద్,అయోధ్య వెళ్లి వచ్చాము .మన దక్షిణ భారత దేశం ,ఉత్తర భారత దేశం తో పోల్చుకుంటే చాలా అభివృద్ధి చెందింది అని మనం అనుకుంటూ ఉంటాము.కాని మనం నేర్చు కోవలసినవి చాలా ఉన్నవి.ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ గురించి.అక్కడ ప్లాస్టిక్ వాడకం చాలా తక్కువ.ముఖ్యంగా టీ,కాఫీ,లస్సి లు వాళ్లు మట్టి పాత్రలలో ఇస్తున్నారు .ప్లాస్టిక్ కప్పు లు అస్సలు కనబడలేదు.దీని వలన గ్లోబలైసేషన్ వలన కుంటుపడిన మన చేతి వృత్తులను కా పా డిన వాళ్లము అవుతాము.దీని వలన మట్టి పాత్రలు తయారి మీద ఆధారపడిన కుమ్మరులను ఆదుకున్నట్లవుతుది.
అభివ్రిద్ది అంటే సాఫ్టు వేరు ఉద్యోగాలు,కార్లు మాత్రమే కాదు.భవిష్యత్తు తరాలకు వీలైనంత స్వచ్చమైన ప్రక్రుతి ని మిగల్చడం కూడా .అప్పుడే మనకు నిజమైన నాగరికత ఉన్నట్లు.