10, ఫిబ్రవరి 2012, శుక్రవారం

పిల్లల కంటే ముందు తల్లిదండ్రులను శిక్షించాలి.

పిల్లల్లో మధ్య హింసా ప్రవృత్తి పెరిగి పోతాఉంది. దీనికి పరాకాష్టే మొన్న తమిళనాడు లో జరిగిన సంఘటన .ఒక విద్యార్థి తమ టీచర్ ను క్లాసు రూము లోనే కత్తి తో పొడిచి చంపడం.ఇటువంటి పిల్లలు పెరిగి పెద్దైతే సమాజానికి చాలా ముప్పు.పిల్లవాని కంటే ముందు పిల్లవాని తల్లిదండ్రులను ఠినంగా శిక్షించాలి.ఎందుకంటే పిల్లవాడు విధంగా తయారు కావడానికి బాధ్యులు వాళ్ళే .చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు తప్పు చేస్తున్నా అది తప్పు అని చెప్పకుండా నవ్వుతూ ఆనందిస్తుంటారు .పిల్లలకు తప్పొప్పులు చెప్పకుండా చాలా ముద్దు చేస్తుంటారు.ఇటువంటి పిల్లలే తర్వాత సమాజానికి ముప్పుగా పరిణమిస్తుంటారు. మధ్యన వస్తున్న సినిమాలు కూడా ఒక కారణం.చాలా సినిమాలల్లో టీచర్లను ,లెక్చరర్లను చాలా తేలిగ్గా చూపిస్తున్నారు.స్టూడెంట్స్ లెక్చరర్ల మీద కుళ్ళు జోకులు వేసే సీన్లు ఉంటున్నాయి.ఇంకా టి.వి. లలో యాంకర్లు ప్రేక్షకులతో మాట్లాడేటప్పుడు ,మొదట ఏం చదువుతున్నావు అని అడిగిన తర్వాత బాగా చదువుతున్నావా అని అడగడం లేదు .మీది కో ఎడ్యుకేషనా,కాలేజికి బంక్ కొడుతున్నావా ,ర్యాగింగ్ చేసారా,బాగా ఎంజాయ్ చేస్తున్నారా ? అని అడుగుతున్నారు.చాలా మంది పిల్లలు వీటిని అనుకరిస్తున్నారు. కాలేజీ లకు ,స్కూళ్ళకు పోయేది పై వాటి కోసమే నేమో మనమేమో చదువుకొని పొరపాటు చేసున్నామేమో అని అంతో ఇంతో చదివే పిల్లలు కూడా మారుతున్నారు.ముఖ్యంగా తల్లిదండ్రులు ,మీడియా చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

6, ఫిబ్రవరి 2012, సోమవారం

అధికార యంత్రాంగం నిష్పాక్షికంగా పని చేయగలదా?

అధికార యంత్రాంగాన్ని మన రాజకీయ నాయకులు నిజంగా నిష్పాక్షికంగా పని చేయనిస్తారా? నూరు ఎకరాల భూమి ఉండే అతనికి వృద్దాప్య పించను వస్తా వుంది.ఆర్థికంగా బాగా ఉండేవారు కూడా నాలుగైదు ఇందిరమ్మ గృహాలను సాంక్షను చేయించుకొని మేడలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు.అధికారులేమో వీళ్ళకు ఇవ్వొద్దని చెబుతారు.కానీ వీళ్ళకు ఎలా అందాయి.వీళ్ళు అక్కడ స్థానికంగా ఉండే సర్పంచ్ లాంటి వ్యక్తులకు కావలసిన వ్యక్తులో ,చుట్టాలో అయి ఉంటారు.ఇవన్నీ రాజకీయ నాయకుల ప్రమేయం తోనే జరుగుతాయనేది బహిరం రహస్యం.సర్పంచ్ స్థాయి లోనే ఇంత జరుగుతుంటే పై స్థాయిలో అధికారుల మీద ఎంత ఒత్తిడి ఉంటుందో ఊహించుకోవచ్చు.ఇప్పుడు రాజకీయ నాయకులు మేము చేయమంటే చేయడానికి అధికారులేమైనా చిన్నపిల్లలా అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.నిజంగా ఏమి జరుగుతుందో రాజకీయనాయకులకు తెలియదా?ఎందుకు ఆత్మ ద్రోహం చేసుకొని మాట్లాడుతున్నారు.మొన్నటికి మొన్న మద్యం సిండికేట్ల విషయంలో .సి.బి. దాడులు జరిగాయి.అందులో చాలా మంది రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయని వార్తలు వచ్చినాయి.కాని వాటిని బయట పెట్టలేదు . అవి బయట పెట్ట వద్దని అధికారైనా చెప్పారా?వాటిని మూసి పెట్టి తమ తమ రాజకీయ మైలేజీలను సాధించు కోవాలని ప్రయత్నం చేయడం లేదా?ఇన్ని మాటలు మాట్లాడుతున్నరాజకీయనాయకులు తాము నిజాయితీ పరులమని గుండెల మీద చేయి వేసుకొని చెప్పగలరా?ఇంత రాద్దాంతం జరుగుతున్న సమయం లో కూడా ఒక టాక్ షో లో పాల్గొన్న ఒక రాజకీయ నాయకుడిని వాళ్ళ అనుచరులను పోషించడానికి ,రాజకీయాలు చేయడానికి నెలకు ఎంత ఖర్చు అవుతుందన్న ప్రశ్నకు రాజకీయ నాయకుడు జవాబు దాట వేసాడు . రాజకీయనాయకుడు నిజాయితీ గా ఆదాయపన్ను కట్టి చేస్తున్న ఖర్చు అయితే ఎందుకు జవాబు దాట వేస్తాడు.వ్యవస్థ లో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళు తప్ప ఆవతలి వాళ్ళు అందరూ అవినీతి పరులని ఆత్మ ద్రోహం చేసుకుంటూ మాట్లాడుతున్నారు.ఇలా ఉన్న వ్యవస్థలో కూడా ఇంకా నిజాయితీ పరులైన అధికారులూ మరియు రాజకీయ నాయకులు మిగిలే ఉన్నారు.అందుకే వ్యవస్థలు కొంతవరకైనా పనిచేస్తున్నాయి.

2, ఫిబ్రవరి 2012, గురువారం

మగోల్లంతా పైకేక్కండి.

మా చిన్నప్పుడు టవున్నుండి మా ఊరికి బస్సేక్కడానికి బస్టాపులో నిల్చుంటే బస్సు ఆగగానే కండక్టర్ బస్సు దిగి మగోల్లంతా పైకెక్కండి ,మగోల్లంతా పైకెక్కండి, అని అరుస్తా ఉండే వాడు .ఎందుకంటే అప్పుడు మా ఊరికి ఆర్.టి.సి. బస్సు సర్వీసులు చాలా తక్కువగా ఉండేవి.అందువలన బస్సులో ఎంత మంది జనాలు ఉండారో అంతకంటే ఎక్కువ జనాలు బస్సు టాపు పైన ఉండేవారు.మమ్మల్నేమో మా నాయన వాళ్ళు టాపు పైన ఎక్కద్దు కరెంటు తీగలు,చెట్ల కొమ్మలు తగులుతాయని చెప్పేవారు.కానీ కండెక్టరేమో మగోల్లంతా పైకెక్కండి ,మగోల్లంతా పైకెక్కండి, అని అరుస్తా ఉండే వాడు. ఒక వేల టాపు పైకి ఎక్కుతే మా వాళ్ళ కంట పడితే దెబ్బలు తప్పవు.మేమేమో మగోల్లమైపోతిమి మా సావు సావు కాకుండా ఉండేలే ఏం చెబుతావు .