5, జులై 2009, ఆదివారం

లోకసత్తా పార్టీ మీద చంద్రబాబు గారి గోబెల్స్ ప్రచారం

చంద్రబాబు గారు లోక్సత్తా పార్టీ మీద తిరిగి గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టినారు.ముఖ్యమంత్రి కావడానికి ఆంధ్రప్రదేశ్ లో ఆయనకు మాత్రమే అర్హతలు ఉన్నాయని ఆయన భ్రమ.లోక్సత్తా ,ప్రజారాజ్యం వాళ్లు వచ్చి ఆయన ఓటు బ్యాంకు ను కొల్లగొట్టారని ఆయన ఆరోపణ.ఏదో ఆయన జాగీరు పోయినట్లు,ఆయన అధికారంలోకి రాకపోవడం ఆంధ్రప్రజలు చేసుకున్న పాపం లాగా ఆయన చాలా బాధపడిపోతున్నారు.ఆయనకు విశ్వసనీయత లేదని మొన్న జరిగిన ఎన్నికలలో ప్రజలు తేల్చేశారు.ఆయన ఏ రోజు కూడా ప్రజల అవసరాలు గుర్తించలేదు.ఎంతసేపు ఆయన దృష్టి అంతా అధికారాన్ని ఏదోవిధంగా పొందడమే.ఈవాళ లోక్సత్తా మీద ఆయన ఆరోపణలుచూసి ప్రజలు నవ్విపోతున్నారు.ప్రజలకు కొత్తరాజకీయాన్ని పరిచయం చేసిన లోక్సత్తా లాంటి పార్టీని ఆయన కాంగ్రెస్ ఏజెంటు లాగా అభివర్ణిస్తే అంతకంటే సిగ్గుచేటైన విషయం ఇంకొకటి లేదు.చంద్రబాబుగారి మీద కొంతమందికి అంతో ఇంతో ఉన్న సానుకూల మైన అభిప్రాయం కూడా ఈ వాళ పటాపంచలయి పోయింది.ఈ ప్రకటన తో ఆయన విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింది.ఆయన వైఖరి ఎలా ఉందంటే ఏదైనా పోటీలో నేనొక్కన్నే ఆడతాను ,అందులో నేనే మొదటి ,తర్వాతి స్థానాలలో ఉంటాను మిగతా వాళ్ళంతా చూస్తూ ఉండండి అనే విధంగా ఉంది.ఆయన ఓటమి ని క్రీడా స్ఫూర్తితో తీసుకోలేకున్నారు.ఆయన మానసిక పరిస్థితి ఇలాగే ఉంటే ఆయన పార్టీ పరిస్థితి ,ఆయన్ను నమ్ముకున్న వాళ్ల పరిస్థితి కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు ఉంటుంది.తెలుగుదేశం పార్టీకి చంద్రబాబుగారే గుదిబండగా మారే పరిస్థితి ఉంది.