16, డిసెంబర్ 2010, గురువారం

ఇప్పుడున్నది వ్యవస్థలను గౌరవించే నాగరిక సమాజమేనా?

ఊర్లలో పొలాల కోసం కావలి వాండ్లు ఉండే వారు.ఇప్పటికీ కూడా పద్దతి చాలా ఊర్లలో ఉంది.ఊరి పంచాయితీ మరియు పెద్దమనుషులు కలిసి వాళ్ళను పెట్టే వారు.చాలా సందర్భాలలో కావలి వాండ్లు దళిత కులాలకు చెందిన వారే ఉండే వారు.వాళ్ళు ఊరి మొదట్లో ఒక కర్ర చేత బట్టుకొని ఉండే వారు.ఊర్లోని వాళ్ళు ఎవరైనా సరే పంటల సమయం లో పొలాల్లో నుండి కోసుకు రాకుండా ఉండడానికి వీళ్ళను పెట్టే వారు (పంటలు కోసే సమయం లో తప్ప ).దీనివలన ఇతరుల పంటలను దొంగతనం చేయడానికి వీలు లేకుండా ఉండేది.ఒక వేళ సమయంలో ఎవరైనా పంటను తీసుక వస్తే వాళ్లకు జుర్మానా విధించి డబ్బును పంచాయితీకి జమ చేసేవాళ్ళు.వీళ్ళను చూస్తే ఎవరికైనా భయం ఉండేది.నూరు ఎకరాల ఆసామి అయినా వాళ్లకు భయపడే వాడు.పెద్దగా చదువుకోని పల్లెటూరి సమాజాలల్లో కూడా వ్యక్తులతో సంబంధం లేకుండా వ్యవస్థల పట్ల అంత గౌరవం ఉండేది.కానీ నేడు బాగా చదువుకున్న నాగరిక సమాజం(?) లో కూడా వ్యవస్థలకు విలువ లేకుండా పోయింది.పోలీసులు చివరికి ముఖ్యమంత్రి ,ప్రధాన మంత్రి వంటి ప్రధాన మైన వ్యవస్థలకు కూడా విలువ ఇవ్వడం లేదు.

21, నవంబర్ 2010, ఆదివారం

జగన్ ఎవరి వాడు?

జగన్ మీడియాలో కాంగ్రెస్స్ పార్టీ గురించి మరియు సోనియా గారి గురించి వచ్చిన వార్తా కథనాన్ని చూసి కాంగ్రెస్స్ పార్టీ వీరాభిమానులు(?) రెచ్చిపోయి ఖండనలు మరియు మీడియా ఆఫీసుల మీద దాడికి పాల్పడుతున్నారు.ఇంతకు ముందు ఒక పత్రికా యాజమాన్యం మీడియాను అడ్డుపెట్టుకొని చట్ట వ్యతిరేకమైన ఆర్ధిక కార్యకలాపాలు చేస్తూ ఉంటే రాజశేఖర రెడ్డి గారు చట్టప్రకారం చర్యలు తీసుకుంటే మీడియా మీద దాడి అని ప్రతి ఒక్కరూ గగ్గోలు పెట్టారు,కానీ నేడు ప్రజాస్వామిక వాదులు సాక్షి మీద దాడి జరుగుతూ ఉంటే నోరు మెదపడం లేదు.ఎక్కడ దాక్కున్నారు.రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన మీద అవాకులు చెవాకులు పేలిన కాంగ్రెస్స్ నాయకులకు తెలీదా, ఆయన కూడా కాంగ్రెస్స్ పార్టీ కి చెందిన నాయకుడని.జగన్ ఓదార్పు యాత్ర చేస్తుంటే దానికి లెక్కలేనన్ని అడ్డంకులు కల్పించారు.అప్పుడు తెలీదా జగన్ పార్టీకి చెందిన వ్యక్తో? ఓదార్పు యాత్రను సమర్థిస్తున్నారన్న ఏకైక కారణంతో ఎందరో నిజమైన కాంగ్రెస్స్ కార్య కర్తలను పార్టీ నుండి వెలివేశారు.రాజశేఖరరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన అభిమానులని కాంగ్రెస్స్ దగ్గరకు తీసుకో లేదు సరి కదా వాళ్ళని నానా ఇబ్బందులకు గురిచేసింది. వాళ సాక్షి మీడియాలో ఏదో వార్త వచ్చిందని, కాంగ్రెస్స్ పార్టీ వాళ్ళు నానా యాగీ చేస్తున్నారు.రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ ను మరియి రాజశేఖర రెడ్డి గారి అభిమానులని తమ పార్టీ వాళ్ళే అని,కాంగ్రెస్స్ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా గుర్తించారా ?

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

ఎ.పి.పి.ఎస్.సి పరీక్షలు రాయలేని విద్యార్థుల బాధలకు భాధ్యులు ఎవరు?

తెలంగాణా విమోచన దినం గురించి మాట్లాడ కుండా తప్పించుకోవడానికి టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్ళు నానా రభస చేసి .పి.పి.ఎస్.సి. నిర్వహించే పరీక్షలను తెర పైకి తెచ్చి అడ్డుకుని చాలా మంది కష్టపడి చదివిన విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకున్నారు. వాళ నష్టపోయిన విద్యార్థుల గురించి ఎవరూ మాట్లాడడం లేదు.టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్ళు .పి.పి.ఎస్.సి. పరీక్షలను తెర మీదికి తెచ్చి తెలంగాణా విమోచన దినం గురించి మాట్లాడకుండా తప్పుకుని తమ రాజకీయ పబ్బం గడుపుకున్నారు.కాని అమాయక విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకున్నారు.ఇప్పటికైనా తెలంగాణా విద్యార్థులు భావోద్వేగాలతో ఆడుకునే రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మసలుకోవాలి.

4, సెప్టెంబర్ 2010, శనివారం

తెలంగాణా ప్రజలు తిరిగి కే.సి.ఆర్ ఉచ్చులో పడ్డారు.

సెప్టెంబర్ 17 తేదిని తెలంగాణా విమోచన దినం జరపాలని అన్ని పార్టీ నుండి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ,టి.ఆర్.ఎస్ పార్టీ కూడా చిన్నగా డిమాండ్ చేసింది.కానీ టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్లకు ముఖ్యంగా కే.సి.ఆర్ కు విమోచన దినం డిమాండ్ చేసి ముస్లిం ను దూరం చేసుకోవడం ఇష్టం లేదు ,అలాగని తెలంగాణా పరుగులో వెనక పడ్డం ఇష్టం లేదు .అందుకే వ్యూహాత్మకంగా .పి.పి.ఎస్.సి నిర్వహించే గ్రూప్ -1 పరీక్షలను ముందుకు తెచ్చి తెలంగాణా వాళ్ళను ముఖ్యంగా విద్యార్థులను రెచ్చగొట్టి తను అనుకున్నది సాధించారు.ఇప్పుడు అందరూ .పి.పి.ఎస్.సి నిర్వహించే పరీక్షల వెంట పడ్డారు.విమోచన దినం గురించి అందరూ మర్చి పోయారు.రాజకీయ నాయకుల స్వార్థ వ్యూహాలు వాళ్లకు ఉంటాయి.విద్యార్థులు స్వార్థ రాజకీయనాయకుల ఉచ్చులో పడి వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.

2, సెప్టెంబర్ 2010, గురువారం

పేదల పక్షపాతి కి అశ్రునివాళులు

పేదల పక్షపాతి ,విశ్వనీయతకు మారు పేరైన రాజశేఖర రెడ్డి గారి ప్రథమ వర్థంతి సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని కోరుకుంటూ .....

12, ఆగస్టు 2010, గురువారం

ధరల పెరుగుదల ఎందుకు ఎన్నికల నినాదం కావడం లేదు?

ఒకప్పుడు ఉల్లిగడ్డల ధరలు పెరిగితే ప్రజలు ప్రభుత్వాలను కూల్హారు.కానీ నేడు ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు మరియు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి.అయినా కూడా అది ఎన్నికల నినాదం కావడం లేదు ,ఎందుకని?రెండురూపాయలకు కిలో బియ్యం ప్రభావమా?ఉపాధి హామీ పథకం ప్రభావమా?లేక ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందా?లేక పాలకులు ఎవరు వచ్చినా వాళ్ళ బ్రతుకులు ఏమీ మారవని నిర్వేదమా?

రైతులను ఆదుకోక పొతే ఆహార భద్రత ఎండమావే?

ఉపాధి హామీ పథకం ద్వారా రైతు లకు కూలీలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు.ఉండే కొద్ది మంది కూలీలకు వారు చెప్పినంత కూలీ ఇవ్వవలసిన పరిస్థితి రైతు లకు దాపురించింది.నకిలీ విత్తనాలు,పురుగు మందులు ,ప్రక్రుతివైపరీత్యాలకు తోడు ఈ కూలీ ల ధరలు కూడా పెరిగి రైతుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా తయారైంది.ఇన్ని కష్టాలు పడి రైతులు పండించిన పంటకు మద్దత్తు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారు.పాలకులు రైతులకు వ్యవసాయం లాభదాయకం చేయక పొతే ప్రభుత్వాలు కలలు కంటున్న ఆహార భద్రత ఎండమావే అవుతుంది.

6, జులై 2010, మంగళవారం

రాయలసీమ మాండలికం లో వాడే కొన్ని పదాలు

రాయలసీమ(జమ్మలమడుగు,ప్రొద్దుటూరు ప్రాంతాలలో పల్లెల్లో ) లో వాడే కొన్ని పదాలు మధ్య కనుమరుగవుతున్నాయి.ఒకసారి గుర్తు చేసుకుంటూ..

అమ్మలపొద్దు = ఉదయం తొమ్మిది గంటల సమయం.
పైటాల = మధ్యాన్నం.
మాయిటాల = పొద్దు గూకే వేళ.
వాకిలి =తలుపు.
సిలుకు = తలుపుకు పెట్టే గొళ్ళెం లాంటిది.
గడెమాను = తలుపుకు అడ్డంగా లోపలనుండి పెట్టే గడియ.
బూయిండ్లు = వంట గది.
నడవ = హాల్ .
ఆయిపిండ్లు = పంటలను దాచు కునే రూము.
దండెం = బట్టలను వేసేందుకు ఉపయోగించే త్రాడు లేక కర్ర.
ఉట్టి = పదార్థాలను ఎత్తిపెట్టెందుకు వేలాడదీసిన త్రాడు(గిన్నెలను పెట్టడానికి అనుకూలంగా ఉన్న).
సుట్టకూతురు = కుండలు పడిపోకుండా ఉండేదుకు కుండ క్రింద పెట్టే వృత్తాకారంలో ఉండే త్రాడు.
అటిక = మట్టికుండ.
బాణ = నీళ్ళు నింపుకునేందుకు ఉపయోగించే మట్టి కుండ .
కడవ = నీళ్ళు పట్టుకు రావడానికి ఉపయోగించే మట్టి పాత్ర.
తప్యాల = వంట వండుకునే లోహ పాత్ర.
బోకులు = లోహ పాత్రలు.
చెంబు = నీళ్ళు త్రాగడానికి ఉపయోగించే లోహ పాత్ర .
ఆబువ్వ = వరి అన్నం.
సిబ్బి = అన్నం గంజి వార్చ డానికి ఉపయోగించే వెదురుప్లేట్ .
తాపలు = మెట్లు (స్టెప్స్ ).
మెట్లు = చెప్పులు.
మచ్చు = పశువుల కోసం గడ్డిని ఉంచే ప్రదేశం.
మేపు = పశువుల కోసం ఉపయోగించే ఎండు గడ్డి.
జొల్ల = పశువుల గడ్డిని తేవడానికి ఉపయోగించే వెదురుతో చేసిన ఒక పెద్ద బుట్ట.
గాజ = ధాన్యాన్నినిలువ చేసేందుకు ఉపయోగించే వెదురు బుట్ట.
ఎనుము =బర్రె.
రొచ్చు = పశువుల మూత్రం.
తలుగు =పశువులను కట్టేందుకు ఉపయోగించే త్రాడు.
మోకు = వ్యవసాయ పనులకు ఉపయోగించే త్రాడు .
మాసీలు =పంటలు.
అబ్బ =నాన్న నాన్న.
జేజి = నాన్న అమ్మ.
తాత =అమ్మ నాన్న.
అవ్వ =అమ్మమ్మ.

పదాలు కొన్ని మధ్యన కనుమరుగు అవుతున్నాయి,వాటిని కాపాడుకోవలసిన భాద్యత ఉంది.

మరి కొన్ని పదాలు తర్వాత చూద్దాం..



29, మే 2010, శనివారం

ప్రత్యేక వాదుల ప్రజాస్వామ్యం?

మనం ఎవరింటికైనా వెళ్తా వుంటే ,మనం వాళ్ళింటికి వెళ్ళడం వాళ్లకు ఇష్టం లేక పొతే వాళ్ళు చెప్పాలి వాళ్ళింటికి రావద్దని,కానీ పక్కింటివాడు చెప్పద్దు వాళ్ళింటికి పోవద్దని.ఇదేం న్యాయమో అర్థం కావడం లేదు , మరణించిన కుటుంబాలను పరామర్శిం డానికి జగన్ పోతా ఉంటే టి.ఆర్.ఎస్ వాళ్ళు అడ్డుకోవడం ,హింస సృష్టించడం ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం చేసారో అర్థం కావడం లేదు.టి.ఆర్.ఎస్ వాళ్ళ రెచ్చగొట్టే మాటల వలన చనిపోయిన తెలంగాణా వాదులను ఒక రోజు కూడా పరామర్శించి ,ఆర్ధిక సాయం చేయని వీళ్ళు జగన్ మాత్రం కుటుంబాలను ఒక చోట చేర్చి ఆర్ధిక సాయం చేయాలని ,పరామర్శకు వెళ్ళవద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారు. టి.ఆర్.ఎస్ వాళ్ళు చెప్పిన టైము లో పరామర్శకు వెళ్ళాలంట,వాళ్ళు చెప్పిన విధంగా ఆర్ధిక సాయం చేయాలంట ,మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటు పయనిస్తుంది,ఆటవిక సమాజంలోకి తీసుకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారా? టి.ఆర్.ఎస్ వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు పేలుతుంటే రాష్ట్రప్రభుత్వం ఏం చేస్తున్నట్లు,మేధావి వర్గాలు ఏం చేస్తున్నట్లు. ప్రత్యేక తెలంగాణా కావాలని కోరిన వాళ్ళు వాళ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో మంత్రులుగా చలామణి అవుతున్నారు,ఇది విధంగా నైతికతో అర్థం కావడం లేదు.ప్రత్యేక వాదం మాట్లాడే వాళ్లకు సమైక్య ఆంధ్రప్రదేశ్ కు మంత్రులుగా పనిచేసే అర్హత లేదు.వాళ్ళు మంత్రిపదవులకు రాజీనామా చేసిన తరవాత మాత్రమే ప్రత్యేక వాదం గురించి మాట్లాడాలి.

18, మే 2010, మంగళవారం

కే.సి.ఆర్ క్షమాపణ చెప్పిన తర్వాతనే విజయవాడ పర్యటన చేయాలి.

సీమాంధ్ర ప్రజలు తెలంగాణా ప్రజలను దోచుకున్నారని ,సీమాంధ్ర ప్రజలు దోపిడిదారులని ఇన్ని రోజులు విష ప్రచారం చేసి , సీమాంధ్ర ప్రజల మనసులను గాయ పరిచిన కే.సి.ఆర్ విజయవాడ పర్యటనకు వెళ్లేముందు సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పి తర్వాతనే పర్యటనచేయాలి.సమైక్యాంధ్ర ఉద్యమ కారులు ,నాయకులు కే.సి.ఆర్ క్షమాపణకు పట్టుపట్టాలి.

17, ఏప్రిల్ 2010, శనివారం

కే.సి.ఆర్ గారు ఓదార్పు యాత్ర చేయరా?

రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత భాధతో మరణించిన వ్యక్తుల కుటుంబాలను ప్రాంతాలకతీతంగా పరామర్శిస్తూ ,వీలైనంత ఆర్ధిక సాయం ప్రకటిస్తున్న జగన్ గారిని కే.సి.ఆర్ మరియు ఆయన పార్టీ వాళ్ళు అభినందించాల్సి పోయి విమర్శించడం చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది.కే.సి.ఆర్ మరియు టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్ళ రెచ్చగొట్టే మాటల వలన తెలంగాణా లోని అమాయక ప్రజలు కొంత మంది ప్రాణ త్యాగం చేసినారు.తెలంగాణా కోసం అమరులైనారని పదేపదే చెప్పుకొని శవ రాజకీయాలు చేస్తున్న టి.ఆర్.ఎస్ వాళ్ళు కుటుంబాలను ఒకసారైనా పరామర్శించి,వాళ్లకు ఏమైనా ఆర్ధిక సాయం చేశారా? విషయం చూస్తే తెలుస్తుంది,టి.ఆర్.ఎస్ వాళ్లకు తెలంగాణా ప్రజల మీద ఉన్నప్రేమ.తెలంగాణా ప్రజల మేలు కోసమే తెలంగాణా రాష్ట్రాన్ని సాధిస్తామని చెప్పుకుంటున్న టి.ఆర్.ఎస్ .పార్టీ కి పదవుల మీద ఉన్న ఆసక్తి తెలంగాణా ప్రజల మీద లేనట్లుంది. ఇటువంటి వాళ్ళ వలన వచ్చిన తెలంగాణా(ఒక వేళ వస్తే) విధంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడుతుందో తెలంగాణా ప్రజలు ఒక సారి ఆలోచన చేయాలి.

3, ఏప్రిల్ 2010, శనివారం

ఏ తెలంగాణా రాష్ట్రం కావాలి?

ప్రత్యేక తెలంగాణా కావాలనుకునే వారిని ఒకటి అడగాలనుకుంటున్నాను,వాళ్లకు కావలసిన తెలంగాణా ఇప్పుడు మూడు రాష్ట్రాల దగ్గర ఉన్నది.మహారాష్ట్ర దగ్గర,కర్నాటక దగ్గర ,ఆంధ్రప్రదేశ్ దగ్గర ఉన్నది.వాళ్లకు తెలంగాణా కావాలనో? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోఉండేది,తెలుగు మాట్లాడే ప్రజలు ఉండే భాషా ప్రయుక్త రాష్ట్రం.భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడక ముందు ఉండే తెలంగాణా వాళ్లకు కావాలనుకుంటే మూడు రాష్ట్రాల ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలి.

29, మార్చి 2010, సోమవారం

వై.ఎస్.కుటుంబం పై బురద జల్లుడు కార్యక్రమం తిరిగి మొదలైంది .

వై.ఎస్ కుటుంబం మీద బురద జల్లుడు కార్యక్రమం తిరిగి మొదలైంది.తొంబైలలో హైదరాబాదు నగరంలో మత కలహాలు జరిగినపుడు అప్పటి ముఖ్యమంత్రి అయిన చెన్నారెడ్డి గారిని దించడానికి రాజశేఖరరెడ్డి గారే మతకలహాలు సృష్టించారని దుష్ప్రచారం గావించారు.దానిపైన ఒక కమిటీ ని కూడా వేసారు.చివరికి కమిటీ రాజశేఖరరెడ్డి హస్తం లేదని తేల్చింది. రాజశేఖరరెడ్డి గారి మీద ఉన్న ప్రజాభిమానాన్ని, రాజకీయ గ్లామర్ ను చూసి ఓర్వలేని కొన్ని పత్రికలు ,కాంగ్రెస్స్ పార్టీ లోని సోకాల్డ్ సీనియర్ నాయకులు ,ప్రతిపక్షాలు కలిసి ఆయనను ఫాక్షనిష్టు అని హత్యలు చేయిస్తారని విష ప్రచారం గావించాయి.ప్రజలకు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఎంత ప్రజా రంజకంగా పాలన సాగించారో,ప్రజలను ఎంతగా ప్రేమిస్తారో ,సామాన్య ప్రజలు ఎంత సులభంగా ఆయనను కలుసుకోవచ్చో తెలిసింది.అదే ఆయన మీద విష ప్రచారం లేనట్లయితే ఆయన ఇరవై సంవత్సరాల ముందే ముఖ్యమంత్రి అయి ఉండేవారు.అప్పుడు రాష్ట్రం ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. వాళ ఉన్న ప్రాంతీయ వాదాలు తలెత్తేవి కావు.ఆయన చనిపోయిన తర్వాతకూడా ఆయనను శత్రువులు కూడా తలుచుకుంటున్నారు,ఆయన ఉంటే ఈవాళ రాష్ట్రానికి పరిస్థితి దాపురించేది కాదని.

వాళ హైదరాబాదు లో మత కలహాలు జరిగితే దానికి కూడా పరోక్షంగా జగన్ మీద వేలెత్తి చూపిస్తున్నారు.జగన్ రాజ కీయ గ్లామర్ ను ఎదుర్కోలేని కొందరు కాంగ్రెస్ నాయకులు ,ప్రతిపక్షం వాళ్ళు ,జనాకర్షణ లేని నాయకులు రాజశేఖరరెడ్డి గారిని దెబ్బతీసినట్లుగా దెబ్బ తీయాలని ప్రయత్నాలు మొదలు పెట్టినారు.దీన్ని జగన్ సమర్థవంతంగా ఎదుర్కొని వాళ్ళ నాన్న లాగ రాజకీయాలలో రాటుదేలి ,తిరుగు లేని నాయకుడుగా ఎదుగుతాడో లేదో కాలమే నిర్ణయిస్తుంది.

21, మార్చి 2010, ఆదివారం

బెహన్ జీ నోట్ల దండలు

తమను ఉద్దరిస్తారని ఎంతో ఆశతో మాయావతి గారిని అధికారంలోకి తీసుక వచ్చిన ఉత్తరప్రదేశ్ ప్రజలు ముఖ్యంగా దళితుల భ్రమలు తొలగిపోయాయి.అక్కడ ప్రజలు ఎంతో పేదరికంతో మగ్గి పోతుంటే మాయావతి గారు ఇవేమీ పట్టకుండా పార్కులు,ఏనుగు శిల్పాలు,తన ప్రతిమలను రాష్ట్రం అంతటా పెడుతూ ,నోట్ల దండలను వేయించు కుంటూ ప్రజా ధనాన్ని చాలా దారుణంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారు.అగ్రవర్ణాల ముఖ్యమంత్రులకు మాత్రం తీసి పోకుండా ఇంకా కొంచం ఎక్కువగానే మాయావతి గారు ప్రజాస్వామ్యాన్ని చాలా అపహాస్యం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఒక సారి రాజకీయాల్లోకి వచ్చిన నాయకులు కులం వాళ్లైనా, మతం వాళ్లైనా వాళ్ళ లక్ష్యం ప్రజలను రాబందుల్లాగా పీక్కు తినటమే అని మరోసారి జువైనది. తమ కులం వాళ్లకు రిజర్వేషన్ లు ఇచ్చి ,తమ కులం వాళ్ళను ముఖ్యమంత్రులను చేయాలని అలా చేస్తే తమకు వాళ్ళు ఏదో ఒరగ పెడతారని ప్రజలు భావించి పోరాటాలు చేయడం మాను కోవాలి.

13, మార్చి 2010, శనివారం

నీరు ఉండి నీరు లేని భారతదేశం!

మధ్యన ఒక నివేదిక లో ప్రపంచం లో ఎక్కువ భూగర్భ జలాలు వినియోగించే దేశాల్లో భారత దేశం కూడా ముందు భాగంలోఉంది,మరో ఇరవై ఏళ్లలో భూగర్భ జలాలు పూర్తిగా ఇంకిపోయే స్థితి భారత దేశానికి దాపురించ వచ్చు,అనే వార్త చదివి పోస్ట్ వ్రాస్తున్నాను.

మనదేశం ఎన్నో జీవనదులకు పుట్టినిల్లు. అటువంటి దేశం లో ఇప్పటికీ గుక్కెడు మంచినీళ్ళ కోసం ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కిలోమీటర్ల కొద్దీ పోయి తెచ్చుకోవలసిన పరిస్థితి ఉంది.దీనికంతటికీ కారణం పాలకులకు ముందుచూపు లేక పోవడం,వాళ్ళ అక్రమసంపాదనే కారణం.ప్రజలు నీళ్ళ కోసం ఇంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నా పాలకులు మాత్రం శీతల పానీయాలు,మినరల్ వాటర్ తయారు చేసే బహుళ జాతి కంపెనీలు ఇచ్చే డబ్బులకు కక్కుర్తి పడి వాళ్లకు ఇష్టం వచ్చినట్లు అనుమతులు ఇచ్చారు.బహుళ జాతి కంపెనీలు ఒక లీటర్ శీతల పానీయం తయారుచేయడానికి తొమ్మిది లీటర్ల నీటిని వృధా చేస్తారని నేనెక్కడో చదివాను. విధంగాభూగర్భ జలాలను వృధా చేసుకుంటూ పొతే భూగర్భ జలాలు ఇంకి పోవడానికి ఇరవై సంవత్సరాలు అవసరం లేదు,అంతకంటే ముందే ఇంకి పోతాయి.

నేను ఒక సారి త్రివేణి సంగమం,వారణాసి కి వెళ్ళాను.అక్కడ పెద్ద సముద్రమంత నీళ్ళు ఉన్నాయి,కానీ ఒక గ్లాసు నీళ్ళు కూడా త్రాగలేని దౌర్భాగ్య పరిస్థితి,అంత అపరిశుభ్రంగా ఉన్నాయి.ఒక గ్లాసు నీళ్ళు త్రాగితే చాలు ఖచ్చితంగా కైలాసానికి పోవచ్చు.ప్రజలు ఒక వైపు" గంగా మాతా " అంటూ పూజలు చేస్తున్నారు,మరో వైపు అక్కడే మల మూత్ర విసర్జన చేస్తున్నారు.పూజల పేరుతో ప్రజలు ,పారిశ్రామికవ్యర్థాలను వదులుతూ ఫ్యాక్టరీలు విధంగా జీవనదులను కాలుష్యం చేసుకుంటూ పొతే చివరికి ప్రజలకు గుక్కెడు మంచినీరు లేకుండా పోతుంది.విశ్వహిందూ పరిషత్,శివసేన మరియు ఆర్.ఎస్.ఎస్ వాళ్ళు అనవసర విషయాలలో ప్రజలను రెచ్చగొట్టకుండా,నదులను అపరిశుభ్రం చేయ కుండా హిందూ సమాజాన్ని చైతన్య వంతులను చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసినవారు అవుతారు. ముఖ్యంగా పాలకులు తమ స్వార్థ చింతన పక్కన పెట్టి దూరదృష్టి తో ఆలోచించి జీవనదులను కాలుష్యం బారినపడకుండా ,భూగర్భ జలాలను ఇష్టం వచ్చినట్లు వాడకుండా కట్టడి చేయ వలసిన అవసరం ఎంతో ఉంది,లేక పొతే భవిష్యత్ తరాలకు ఒక గ్లాసెడు మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితి దాపురిస్తుంది.


9, మార్చి 2010, మంగళవారం

ఎవరికోసం ౩౩ శాతం మహిళా రిజర్వేషన్లు?

ఈ వాళ ౩౩ శాతం మహిళా రిజర్వేషన్ ఇచ్చినందు వలన నిజంగా తెలివైన మహిళలకు ,సమాజహితం కోరే మహిళలకు ఏమీ ఉపయోగం ఉండదు.ఇప్పటికే రాజకీయాల్లో పాతుకు పోయి ఆ రాజకీయాలనే సంపాదన మార్గంగా ఎంచుకున్న దొరలకే ఉపయోగం ఉంటుంది.మహిళలకు రిజర్వేషన్ ఇచ్చిన స్థానాల్లో ఇప్పటికే పాతుకు పోయిన ప్రజాప్రతినిధుల భార్యలనో,తల్లులనో ,సోదరీమనులనో నిలబెట్టి గెలిపించుకుంటారు.రాజకీయాలు తిరిగి వాళ్ళ చేతుల్లోకే పోతాయి.సామాన్య ప్రజలు నిలబడితే గెలిచే పరిస్థితి లేదు.ఉదాహరణకు మార్పుకోసం వచ్చిన లోక్సత్తా పార్టీ పరిస్థితి ఏమైందో మన అందరికీ తెలుసు.దళిత రిజర్వేషన్లు పొంది ప్రజాప్రతినిధులు అయిన దళిత సోదరులు ఈ వాళ వాళ్ళ దళితులకు ఏమి చేస్తున్నారు,దళిత దొరలూ అయి వాళ్ళ ఆస్తులు పెంచు కోవడం తప్ప. ముఖ్యంగా ప్రజల భావన లో మార్పు రావాలి. అంతవరకూ రిజర్వేషన్లు ఇచ్చినా ఇంకేమి ఇచ్చినా పరిస్థితిలో మార్పు ఉండదు.

6, మార్చి 2010, శనివారం

కాంగ్రెస్స్ మార్క్ రాజకీయానికి చిత్తైన కే.సి.ఆర్

మాటిమాటికి రాజీనామా అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఇప్పటివరకూ తన రాజకీయ పబ్బం గడుపుకొస్తున్న కే.సి.ఆర్ కు అదే రాజీనామా అస్త్రం బూమ్రాంగ్ లా తిరిగి వచ్చి తన మెడకే చుట్టుకునేటట్లుగా ఉంది.తన నిర్ణయాల్ని తెలంగాణా జే..సి. నిర్ణయాలుగా చెబుతూ ,ముందుగా రాజీనామాలు చేసి తెలంగాణా ప్రజల దృష్టి లో హీరో అయిపోదామని చూసారు.కానీ టి.ఆర్.ఎస్ వాళ్ళు,ఒక బి.జే.పి ఎం.ఎల్. తప్పకాంగ్రెస్స్ ,టి.డి.పి. వాళ్ళు ఒక్కరు కూడా రాజీనామాలు సమర్పించలేదు. వాళ తెలంగాణా లో అమరులైన విద్యార్థుల బంధువులను రాజీనామాలు చేసిన స్థానాల్లో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని డిమాండ్ ఊపందుకుంది.చనిపోయిన శ్రీకాంతాచారి తండ్రిని డిల్లీ లో కాంగ్రెస్స్అధిష్టానం పిలిపించి పరామర్శించింది. పరిస్థితులలో కే.సి.ఆర్ ,టి.ఆర్.ఎస్ వాళ్ళ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది.కాంగ్రెస్స్ వాళ అన్ని స్థానాల్లో అమరులైన విద్యార్థుల బంధువులను నిలబెట్టినా ఆశ్చర్య పోనక్కరలేదు.ఎందుకంటే కాంగ్రెస్స్ వాళ్లకు పోయేది ఏమీ లేదు,వస్తే టి.ఆర్.ఎస్. స్థానాలు తన వశం అవుతాయి.ఒక వేళ టి.ఆర్.ఎస్ వాళ్ళు స్థానాల్లో పోటీ చేస్తే తెలంగాణా ప్రజల దృష్టి లో దోషి గా నిలబెట్ట వచ్చు. పరిస్థితులల్లో కే.సి.ఆర్ ఎటువంటి చాణుక్య నీతిని చూపుతారో వేచిచూడాలి.కాంగ్రెస్స్ రాజకీయమా మజాకా!

4, మార్చి 2010, గురువారం

టి.ఆర్.ఎస్ రాజీనామా చేసిన స్థానాల్లో అమరులైన విద్యార్థుల బంధువులను నిలబెట్టి ఏకగ్రీవంగా గెలిపించు కోవాలి .

రాజీనామా చేసిన టి.ఆర్.ఎస్ ప్రజా ప్రతినిధులకు ,కే .సి.ఆర్ కు తెలంగాణా మీద నిబద్దతను చాటుకునే మంచి ఆవకాశం ఇప్పుడుదొరికింది.వారు రాజీనామా చేసిన స్థానాల్లో అమరులైన విద్యార్థుల తల్లిదండ్రులను గానీ ,వారి సోదర ,సోదరీమణు మణులను నిలబెట్టి (లగడపాటి రాజగోపాల్ గారు చెప్పినట్లు) ఏకగ్రీవంగా తెలంగాణా జే..సి వాళ్ళు ఎన్నుకోవాలి.అప్పుడు మాత్రమే టి.ఆర్.ఎస్ వాళ్ళు చేసినది డ్రామా కాదు ,వాళ్ళు పదవులకోసం ప్రాకులాడే వాళ్ళు ఏమాత్రం కాదు అని తెలంగాణా ప్రజలకు తెలిసి టి.ఆర్.ఎస్ మీద తెలంగాణా ప్రజలలోగౌరవం పెరుగు తుంది. విషయమై .యు విద్యార్థులు మరియు తెలంగాణా జే..సి కృషి చేస్తే బావుంటుంది.అప్పుడు మాత్రమే అమరులైన తెలంగాణా విద్యార్థులకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుంది.

2, మార్చి 2010, మంగళవారం

ప్రజాప్రతినిధులను భాధ్యులుగా చేయాలి.

ప్రజా ప్రతినిధులు మరియు మంత్రులు మా ప్రాంతం అభివృద్ధి కాలేదు మా ప్రాంతం అభివృద్ధి కాలేదు అని పోటీ పడి ప్రకటనలు ఇస్తూ, దానికి ప్రత్యక రాష్ట్రమే పరిష్కారం అని చెబుతున్నారు.ప్రభుత్వం ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ,వాళ్ళ నియోజక వర్గాలకు విడుదలైన నిధులవివరాలను ప్రకటించి ఎందుకు అభివృద్ధి చెందలేదో ప్రజా ప్రతినిధులను కనుక్కొని ప్రజా ప్రతినిధులను భాధ్యులుగా చేసి శిక్షించాలి.ప్రజాప్రతినిధులను భాధ్యులుగా చేయనంత వరకూ రాష్ట్రం ఎన్ని ముక్కలైన ప్రజలకు ఏమీ ఉపయోగం ఉండదు.

11, జనవరి 2010, సోమవారం

"అదుర్స్" సినిమాను అడ్డుకుంటా మనడం అప్రజాస్వామికం

రోజు సాయంత్రం సాక్షి టి.వి. లో తెలంగాణా జాగృతి అధ్యక్షురాలు కవిత గారి (కే.సి.ఆర్ గారి కుమార్తె) మాటలు విన్న తర్వాత పోస్ట్ వ్రాయకుండా ఉండలేక పోయాను."అదుర్స్" సినిమాను ఆంధ్ర వాళ్ళు నిర్మించి నటించారు కాబట్టి సినిమాను తెలంగాణాలో అడ్డుకుంటామంటున్నారు. సినిమా నిర్మాత లగడపాటి నిరాహారదీక్ష శిబిరంలో కూర్చున్నారని ఒక సాకు చెబుతున్నారు.తెలంగాణా వాళ్ళు వాళ్ళ వాదాన్ని ఎంత బలంగా వినిపిస్తున్నారోఆంధ్రా వాళ్ళు కూడా వాళ్ళ వాదాన్నిఅంతే బలంగా వినిపించే హక్కు ఉంది.దీన్ని అడ్డుకోవడానికి వీళ్ళు ఎవరు.ఆంధ్రా వాళ్ళు వీళ్ళాలాగ వేర్పాటు వాదం వినిపించడం లేదు.అందరం సమైఖ్యంగా ఉందాం అంటున్నారు. ప్రజాస్వామ్య దేశం లో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళ భావాలను ఇతరులకు ఇబ్బంది లేకుండా ప్రకటించవచ్చు.తెలంగాణా సమస్య కే.సి.ఆర్.కుటుంబ సమస్య మాత్రం కాదు.అందరూ తెలంగాణా వాళ్లకు నచ్చినట్లు మాత్రమే మాట్లాడాలి,అనుకూలంగా మాట్లాడక పోతే అడ్డుకుంటా మంటే కుదరదు. విషయం చూస్తే తెలుస్తున్నది ,తెలంగాణా ఉద్యమం లో ఎంత మేర ప్రజాస్వామ్యం ఉందో.వీళ్ళంతా ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు.ఇటువంటి ఉద్యమ కారుల వలన వచ్చిన తెలంగాణా రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మాత్రం మన జాలదు,నిరంకుశత్వం లోకి జారుకుంటుంది.సామాన్య ప్రజలు వీళ్ళఉక్కు కౌగిళ్ళలో నలిగి పోవలసి వస్తుంది.ఇటువంటి అప్రజాస్వామిక,నియంతృత్వ,బ్లాక్మెయిల్ రాజకీయాలను , ఉద్యమాలను,ఉద్యమ కారులను నిజమైన ప్రజాస్వామిక వాదులు తీవ్రంగా ఖండించాలి .

8, జనవరి 2010, శుక్రవారం

అంబానీల,రామోజీల ఆస్తులు ధ్వంసం అయినప్పుడు మాత్రమే చంద్రబాబు గారు స్పందిస్తారా?

గత నెల రోజులుగా అటు సమైఖ్యాంధ్ర ఉద్యమం ,ఇటు తెలంగాణా ఉద్యమం లో ప్రభుత్వ,ప్రజల ఆస్తులు ఎన్నో ధ్వంసం అవుతున్నా , ఉద్యమాలతో సామాన్య ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నా మీడియాకు,ప్రజలకు ముఖం చాటేసిన చంద్రబాబు గారు ,నిన్న రిలయన్స్ వారి ఆస్తులు ధ్వంసం అయినాయని తెలిసి రోజు మీడియా ముందుకు వచ్చిఖండనలు ఇస్తున్నారు.దీన్ని బట్టి చూస్తే చంద్రబాబు గారికి రిలయన్స్ వారి ఆస్తులు,రామోజీ గారి ఆస్తులు,తన మరియు తన వాళ్ళ ఆస్తులు మాత్రం బాగుంటే సరి ,ప్రజల,ప్రభుత్వాల ఆస్తులు ఏమై పోయినా పరవాలేదని అనిపిస్తుంది.నెల రోజులుగా ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నా ఒక్క రోజు కూడా ఆయన ఖండనలు ఇవ్వలేదు.దీన్నిబట్టి చూస్తే అర్థం అవుతుంది ,చంద్రబాబు గారు పెట్టుబడి దారులకు మాత్రమే కొమ్ముకాసే వ్యక్తి అని ,సామాన్య ప్రజల గోడు మాత్రం పట్టించుకోడని .ఇటువంటి భాధ్యతా రాహిత్యమైన ,అవకాశవాద ,స్వార్థపరమైన రాజకీయనాయకులు ఉండబట్టే వాళ మన రాష్ట్రం పరిస్థితులలోకి నెట్టి వేయబడినది.

3, జనవరి 2010, ఆదివారం

పాఠ్య పుస్తకాలు కూడా తెలంగాణా మాండలికంలో ఉండాలా?

మధ్యన తెలంగాణా వాదులు వాళ్ళ భాషను సినిమాలలో విలన్ల మరియు కమేడియన్ల చేత మాట్లాడిస్తున్నారని ,హీరోలచేత మాట్లాడించలేదని ఆరోపణలు చేస్తున్నారు.సినిమా వాళ్ళు ఏదో ఒక మాండలికాన్ని ప్రామాణికం చేసుకొని మాట్లాడిస్తుంటారు.అలాగే కొన్ని రోజుల వరకూ ఫ్యాక్షన్ సినిమాల నేపథ్యంలో రాయలసీమ మాండలికాన్నివాడారు.సినిమా వాళ్ళ ముఖ్య ఉద్దేశ్యం వినోదాన్ని ప్రేక్షకులకు పంచడమే. ఇలా ప్రతి దానిలో సెంటిమెంటు నురెచ్చకొట్టడం సరి కాదు. ఇవాళ తెలంగాణా సినీ రచయతలు వ్రాసే పాటలు కూడా తెలంగాణా మాండలికంలో లేవు.దీనికితెలంగాణా వాదులు ఏమంటారో ? అలా అనుకుంటూ పోతే చివరికి పాఠ్య పుస్తకాలలో కూడా తెలంగాణా మాండలికాన్నిప్రవేశ పెట్టాలని డిమాండ్ రావచ్చు.