26, జనవరి 2013, శనివారం

చాలా ఆలస్యం అయ్యింది!

నిన్న ఉండవల్లి గారు మీటింగ్ పెట్టి సమైఖ్యాంధ్ర ఏర్పడడం గురించి కొన్ని  సాక్ష్యాలు  చెప్పారు.ఇది చాలా ఆలస్యం అయ్యిది.ఈ విషయం టి.ఆర్.ఎస్ పార్టీ పెట్టి వాళ్ళు తమకు అన్యాయం జరిగిందని ప్రచారం చేసినప్పటి నుండి ఇరు ప్రాంతాల మేధావులను కూర్చోబెట్టి చెప్పి ఉండవలిసింది.అలా చెప్పకుండా ఈ 10 సంవత్సరాలు ఈ తెలంగాణా అనే అంశాన్ని అన్ని పార్టీలు తమకు ఇష్టం వచ్చినట్లు తమ రాజకీయాల కోసం వాడుకొని ఇప్పుడు చెప్పి ఉపయోగం లేదు.ఇప్పుడు తెలంగాణా ప్రజలు ఏమీ వినిపించుకునే   స్థితి లో లేరు.ఆ విధంగా అన్ని రాజకీయ పార్టీలు  వాళ్ళ మనస్సులను మార్చి వేసాయి.ఇప్పుడు నిజాలు చెప్పినా  వాళ్ళు  వినే  పరిస్థితి లో లేరు.రాజకీయ నాయకులు  భావోద్వేగాలను రెచ్చ గొట్టి ప్రజలను ఒక రకమైన ట్రాన్స్ లోకి తీసుకెళ్ళారు. ఇది రాజకీయ నాయకులు చేసిన,వాళ్ళు మాత్రమే చేయగలిగిన  మరొక ఘనమైన నిర్వాకం .   

కామెంట్‌లు లేవు: