13, డిసెంబర్ 2009, ఆదివారం

ఈ వేర్పాటు ఉద్యమాలు ప్రజలను గొర్రెలను చేయడానికి రాజకీయనాయకులు పన్నిన కుట్ర.

ఇప్పటికే ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు ఎక్కువ అయి పోయి జాతీయవాదం లేకుండా పోయింది.ఉదాహరణకు ఈ వాళ తమిళనాడు వాళ్ల కంటే మనకు ఎం.పిలు ఎక్కువ ఉన్నా మనకు కేంద్ర కాబినెట్ లో సరైన బెర్తులు దొరక లేదు.తమిళనాడు వాళ్ళది ప్రాంతీయ పార్టీ కాబట్టి వాళ్లు బ్లాక్ మెయిల్ చేసి మంత్రుల ఫోర్టుఫోలియోలు గాని ,నిధులు ,పెద్ద పెద్ద ప్రాజెక్టులు వాళ్ల రాష్ట్రానికి తరలించుకొని పోతున్నారు. చిన్న చిన్న బ్లాక్మెయిల్ లకు భయపడి రాష్ట్రాలను విభజించు కుంటూ పొతే దేశం చాలా ముక్కలు అయి పోయి దేశ సమగ్రతకే ముప్పు ఏర్పడుతుంది.ఇవాళ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళు అయ్యింది.మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను నిలదీసి అడగాలి,ఎందుకు వెనకబడి ఉన్నామో .అది చేతగానప్పుడు ఎన్ని రాష్ట్రాలు అయిన కూడా అభివృద్ధి అనేది ఏమీ జరగదు.అభివృద్ధి కోసం కొట్లాడాలి.ఈ వాళ తెలంగాణా వచ్చిన తర్వాత కూడా అలాగే ఉంటుంది.అప్పుడు పాలకులు వాళ్ల తప్పును కప్పిపుచ్చుకోవడానికి తిరిగి వేర్పాటు వాద ఉద్యమాలు మొదలు పెడుతారు.అప్పుడు ఉత్తర తెలంగాణా లేక దక్షిణ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాలు కావాలని ఇంకొకరు వచ్చి ఉద్యమం మొదలు పెట్టి ప్రజలను తమ మౌళిక సమస్యల నుండి దృష్టి మరల్చడానికి ప్రయత్నం చేస్తారు.ఈ వేర్పాటు ఉద్యమాలు ప్రజలను గొర్రెలను చేసి వాళ్ల హక్కుల కోసం పోరాడకుండా డైవర్ట్ చేయడానికి ,వేర్పాటు ఉద్యమ నాయకులు ధనవంతులు అవ్వడానికి,కొన్ని రాజకీయ పదవులు పొందడానికి తప్ప ప్రజలకు మేలు చేయడానికి మాత్రం కాదని ప్రజలు గుర్తిస్తే చాలా మంచిది.

కామెంట్‌లు లేవు: