9, మే 2009, శనివారం

నడమంత్రపుసిరి

తమ దాకా వచ్చేదాకా తెలియదన్నట్లు ,ఈవాళ స్కూలు ఫీజులు పెంచినారని ధర్నాలు చేస్తూ గగ్గోలు పెడుతున్నారు .విద్య,వైద్యం,గృహవసతి మధ్య తరగతి వారికి అందుబాటులో లేకుండా చేసింది నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళే .ఉదాహరణకు :-సాఫ్టువేరు ఉద్యోగస్తులు,మిగతా వైట్ కాలర్ ఉద్యోగస్తులు (క్షమించాలి ).వీళ్ళకు ఏదయినా ఒక వస్తువు ధర కానీ,ఒక సేవ ధర కానీ తక్కువ ఉంటే ఆ వస్తువు కు నాణ్యత లేనట్లే .పది రూపాయల వస్తువు విలువ వంద రూపాయలు చెబితే అది చాలా నాణ్యమైనదని కొనుక్కుంటారు.అసలు విలువ చెబితే వీళ్ళు కొనరు.అందుకే మార్కెట్టులో వస్తువు,సేవల విలువలు అంతగా పెరిగి సామాన్యుని కి అందుబాటులో లేకుండా పోయినాయి.

నేను ఒక సారి ఒక స్కూలుకు అడ్మిషన్ కోసం గురించి వెళ్తే ఫీజు చాలా చెప్పారు.ఎంత ఎక్కువ అంటే ఇంజనీరింగు ఫీజు కంటే ఎక్కువ చెప్పారు. ఎందుకు అంత ఎక్కువ ఫీజు అడుగుతున్నారంటే "ప్రజలు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాము "ఇది స్కూలు వాళ్ల సమాధానం .అంటే విలువ పెంచింది ఈ నడమంత్రపు సిరి వాళ్ళే.

రోజున్న ఆర్ధిక మాంద్యానికి కూడా కారణం వీళ్ళే.వీళ్ళు ఆర్ధిక క్రమశిక్షణ పాటిమ్చకపోవడమే.





కామెంట్‌లు లేవు: