8, మే 2009, శుక్రవారం

దారి తప్పిన పెద్దపులి

ఒక పోరాటంలో ప్రజాస్వామ్య పంథా లేకుండా నిరంకుశంగా ఉంటే ఫలితం ,ఇవాళ శ్రీలంక లో తమిళుల పరిస్థితి ని చూసి తెలుసుకోవచ్చు.మితవాద తమిళ పార్టీ ల నాయకులను ,తనకు అడ్డం వచ్చిన ప్రతి నాయకుని చంపుకుంటూ పోయి ఇవాళ తమిళ టైగర్లు అతర్జాతీయ మద్దత్తును కోల్పోయారు.తమిళ ఉద్యమానికి వేల మంది తమిళ సోదరుల ప్రాణత్యాగం చేసిన తర్వాత కూడా శ్రీలంక లో తమిళుల న్యాయ సమ్మతమైన కోర్కె లను తీర్చుకోలేని పరిస్థితి వచ్చింది.ఒక వేల ఎల్టి టి ఈ నేతృత్వంలో తమిళ దేశం వచ్చినా అది నియంతృత్వం లోకి జారు కొని ,అక్కడి తమిళ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి లోకి పడినట్లవుతుమ్ది.

కావున ఒక సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రజాస్వామ్యయుతంగా చర్చలు తప్ప ఆయుధం కాదని చరిత్రలో మరో సారి ఋజువు అయ్యింది.

1 కామెంట్‌:

టింగు రంగడు చెప్పారు...

బాగా చెప్పారు!!