3, సెప్టెంబర్ 2009, గురువారం

ఆగి పోయిన తెలుగు ప్రజల హృదయ స్పందన ...

ఎనిమిది కోట్ల తెలుగు ప్రజల హృదయ స్పందన ఆగి పోయింది.అధికారం కోసం కాకుండా ప్రజల కోసం పరితపించిన మనసున్న మనిషి ఇక లేడు అని వార్తను ఇప్పటికీ నమ్మలేకున్నాము.నిన్నటి నుండి ఏదో మిరాకిల్ జరిగి ఆయనకు ఏమీ కాదు అని అను కుంటూ ఉంటిని,కాని దేవుడు చిన్నచూపు చూసినాడు.ఇంతమంది ప్రజాభిమానాన్ని చూరగొన్న రాజశేఖర రెడ్డి లాంటి నాయకుడు ఇంతకు ముందు లేడు,ఇక రాడు.ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మందికి ప్రాణదానం చేసిన ఆయనను మృత్యుదేవత ఇంత నిర్దాక్షిణ్యంగా కబలిస్తుందని ఊహించలేదు.ఆయన ఆత్మకు శాంతి కలగాలని భాదాతప్త హృదయం తో దేవుని మనసారా ప్రార్థిస్తూ......

కామెంట్‌లు లేవు: