1, జులై 2014, మంగళవారం

మీడియా మరియు వార్తా పత్రికలు ప్రజా పక్షం వహించి ప్రతి పక్ష పాత్ర పోషించాలి!

            మీడియా మరియు వార్తా పత్రికలు ప్రజా పక్షం వహించి ప్రతి పక్ష పాత్ర పోషించాలి. ఎందుకంటే ఎన్నికలలో వివిధ హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన మొట్టమొదటి హామీ వ్యవసాయ  ఋణమాఫీ  మీద రైతులు ఎదురు చూస్తున్నారు . ఇది ఆలస్యం చేస్తే ,ఒక వేల ఋణమాఫీ చేయక పోతే ఇప్పడు  ఖరీఫ్ కోసం కొత్త ఋణాలు  బ్యాంకులు ఇవ్వక పోగా ,ముందు తీసుకున్న ఋణాలకు వర్తించే సున్నా శాతం వడ్డీ కూడా  వర్తించదు .మొత్తం వడ్డీ కూడా  కట్ట వలసిన పరిస్థితి . ఇటువంటి క్లిష్ట సమయం లో నైనా పత్రికలు ,మీడియా ప్రజల వైపు ఉండి ప్రతిపక్ష పాత్ర వహించి ప్రజల తరుపున న్యాయం కోసం పోరాడాలి ,ఒక వేల ఈ సమయంలో కూడా పోరాడక పోతే మీడియా కు విశ్వసనీయత పోతుంది. పోరాడక పోతే ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలువబడే మీడియా కు  అర్థమే ఉండదు . 

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

sir asa indochu kaani asyasa paniki raadu media patrikalu anni edo oka rajakeeyaparty lave kada adi janma lo jaragadu