26, జులై 2014, శనివారం

అధికారం కోసం ..అభివృద్ధి ఆమడ దూరం .....

15000 కోట్ల లోటు తో విడి పోయిన తర్వాత మన పరిస్థితి తెలిసి కూడా  అధికారం కోసం అలవి గాని హామీలను గుప్పించడం దూరదృష్టి ,దార్శనికత ఉన్న నాయకులకు తగదు. అధికారం లోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ ఏ  హామీలను ఇచ్చి అధికారం లోకి వచ్చారో  ఆ హామీలను నెర   వేర్చమని సహజంగానే ప్రతిపక్ష పార్టీలు  డిమాండ్ చేస్తాయి . అధికార ,ప్రతిపక్షాలు ఈ హామీల పైనే రాజకీయపు  ఎత్తులు పై ఎత్తులు వేయడం తో సరి పోతుంది .అభివృద్ధి పైన ఆలోచనలు వెల్లవు.  విడిపోయి కొన్ని సంవత్సరాలు వెనుక పడి పోతే ,ఈ రాజకీయాలలో మరి కొన్ని సంవత్సరాలు వెనక్కి పోతుంది . ఎ.పి . విడిపోయిన తర్వాత 15000 కోట్ల రూపాయల లోటు మరియు రాజధాని లేమి ఉన్న పరిస్థితిలో అటువంటి హామీలను ఇచ్చి ఉండవలసింది కాదు. ఎ.పి అభివృద్దిలో అధికార పక్షం ,ప్రతిపక్షం చేతిలో చెయ్యి వేసుకొని పరస్పరం సహకరించుకుంటూ పని చేసుకోవలసిన  సందర్భం ,అవకాశం ఇప్పుడు తప్పిపోయినట్లే కనిపిస్తుంది .దార్శనికత ,దూరదృష్టి లేని నాయకులు ఉండడం అంధ్రప్రదేశ్  ప్రజలు చేసుకున్న దురదృష్టం .    

కామెంట్‌లు లేవు: