11, జూన్ 2014, బుధవారం

అంతటి అనుభవజ్ఞులకు అంత సమయం అవసరమా ?

             వై.ఎస్ . గారికి ఎప్పుడో అంజయ్య గారి ప్రభుత్వం లో కొన్ని రోజులు మంత్రిగా చేసిన అనుభవం తప్ప ఏమీ అనుభవం లేకున్నా ముఖ్యమంత్రి అయిన వెంటనే తాను ఇచ్చిన ఉచిత విద్యుత్ హామీ పై మొదటి సంతకం చేసి అధికారం లోకి వచ్చిన మొదటి రోజు నుండే  అమలును ప్రారంభించారు . 
  
            కానీ మంత్రిగా ,9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా,10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా ,ప్రధానులని ,రాష్ట్రపతులని ఎన్నిక చేసిన వ్యక్తిగా,బిల్గేట్స్ ను,బిల్ క్లింటన్ ను రాష్ట్రానికి తీసుకొని వచ్చి మొత్తం ప్రపంచం దృష్టి ని మన రాష్ట్రం వైపు మరల్చి పెట్టుబడులను తీసుకొని వచ్చిన వ్యక్తిగా,హైదరాబాదును  హై టెక్ సిటి గా అభివృద్ది  చేసిన వ్యక్తిగా,విజన్ 2020 రూపశిల్పిగా, అంత దూర దృష్టి  ఉన్న వ్యక్తిగా   అంత అనుభవం  ఉన్న చంద్రబాబు గారు తాను  చెప్పిన  మొదటి సంతకం  రైతు రుణమాఫీ అమలుకు, కమిటీ వేసి ఎందుకు 45 రోజులు సమయం తీసుకున్నారో ప్రజలకు అర్థం కావడం లేదు.   

            తెలంగాణా విభజనకు లేఖ ఇచ్చి చివరి వరకూ దానికి కట్టుబడి ,సమైఖ్యాంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఒక్కసారి కూడా  జై సమైఖ్యాంధ్ర అనకుండా చంద్రబాబు గారు  మాటకు కట్టుబడి ఉన్నారు. తెలంగాణా విడిపోతే ఆంధ్రప్రదేశ్  ఆర్ధిక పరిస్థితి ఏమిటో  కూడా చంద్రబాబు లాంటి మేధావులకు తెలియనిది కాదు. అయినా కూడా  ఎన్నికల ముందు   ఆంధ్రప్రదేశ్   ప్రజలకు వాళ్ళ బాగు దృష్ట్యా చంద్రబాబు గారు తమ మేనిఫెస్టో లో వివిధ రకాలైన హామీలు ఇచ్చారు . తాను  చేసి చూపిస్తానన్నారు . ప్రజలు ఆయనకు ఉన్న అనుభవాన్ని నమ్మి  ఆయనను నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. కావున కమిటీ ల తో, శ్వేత పత్రాలతో కాలయాపన చేయకుండా హామీలను నెరవేర్చాలని ప్రజలందరూ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు . 

   


2 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

వారికి పథకాలు అమలు చేసే అనుహవం కన్నా కమిటీలు వేసే అనుభవం ఎక్కువేమో?

మయూఖ చెప్పారు...

చూస్తాఉంటే అలాగే ఉంది జై గారు.