22, సెప్టెంబర్ 2011, గురువారం

ఎవరికోసం రూపాయికి కిలో బియ్యం ?

ఒక రూపాయకే కిలో బియ్యం అని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది.కానీ క్షేత్ర స్థాయిలో బియ్యం మెజారిటీ లబ్దిదారులు రేషన్ బియ్యం మేము తినడం లేదు ,మేము సన్న బియ్యం కొనుక్కుంటున్నాం అని గర్వంగా చెప్పుకుంటున్నారు.రేషన్ బియ్యాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు. బియ్యం రీసైకిల్ అయ్యి వాటిని సిటీ లోపట్టణాలలో ఉండే ప్రజలు కిలో ముప్పై రూపాయలు పెట్టి కొనుక్కొని తింటున్నారు ,.కావున పథకం చాలా దుర్వినియోగం అవుతున్నది.నిజమైన అవసరమైన లబ్దిదారులకు మాత్రమే అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసు కోవాలి.

కామెంట్‌లు లేవు: