1, మే 2011, ఆదివారం

మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కినట్లు....

మొన్న జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ,మరియు ఇప్పుడు జరుగుతున్న కడప,పులివెందుల ఉప ఎన్నికలల్లో ప్రచారానికి వెళ్ళిన బాలకృష్ణ,చిరంజీవి మరియు ఇప్పుడు నిల్చున్న తెలుగుదేశం అభ్యర్థి తొడగొట్టి ,మీసాలు తిప్పి తమ కున్న ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని చాటుకుంటున్నారు.రాజశేఖర రెడ్డి గానీ,జగన్ గానీ ఎప్పుడూ తొడగొట్టి మీసాలు మెలేయలేదు.ఎవరు ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వాళ్ళో,దీన్ని బట్టి అర్థం అవుతున్నది, .కానీ తెలుగుదేశం నాయకులు మరియు ఇతర ప్రతిపక్షం వాళ్ళు రాజశేఖర రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని ఫ్యాక్షన్ కుటుంబంగా ముద్ర వేసి గోబెల్స్ ప్రచారం చేసారు.అందుకే ప్రజలు వీళ్ళ ప్రచారాన్ని ఎవరూ నమ్మకుండా వై.ఎస్. నాయకత్వాన్ని రెండు సార్లు బలపరిచారు.ఇది ఎలాగుందంటే మొగుణ్ణి కొట్టి మొగసాలకెక్కి నట్లుంది.ఇప్పటికైనా ప్రతిపక్షం వాళ్ళు గోబెల్స్ ప్రచారం మానుకుంటే మంచిది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

emi leni aaku yegiri yegiri padiddanta.

anni unna aaku anigi manigi untundanta.

So evervu factionistlu