14, మే 2011, శనివారం

మీసాలు తెగి పడ్డాయి,తొడలు బొబ్బలెక్కాయి.

మీసాలు తెగిపడ్డాయి.తొడలు బొబ్బలెక్కాయి.అధికార ,ప్రతిపక్షాలు కుమ్మక్కై ముప్పేట దాడి చేసినా వై.ఎస్.ఆర్ .కాంగ్రెస్స్ పార్టీ కడప ,పులివెందుల ఉప ఎన్నికలలో భారీ మెజార్టీ తో బోణీ కొట్టింది.జగన్ పేరుతో మరియు విజయమ్మ పేరుతో పదిమంది చేత నామినేషన్లు వేయించి, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి వై.ఎస్.ఆర్. పార్టీ కార్యకర్తల మీద అన్యాయంగా బైండోవర్ కేసులు పెట్టించి ,విచ్చల విడిగా డబ్బులు పంచి ,గెలవడానికి అధికార పార్టీ చేయని కుట్ర అంటూ ఏమీ లేదు.అయినా కూడా కడప వోటర్లు వాళ్ళ ప్రలోభాలకు లొంగ కుండా విశ్వసనీయతలో రాజశేఖర రెడ్డి గారి వారసులమని మరోసారి చాటి చెప్పారు.అధికార ,ప్రతిపక్షాలు ఎన్ని మేకపోతు గాంభీర్యపు మాటలు మాట్లాడుతున్నా రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంది.అపజయాన్ని ఇప్పటికైనా హుందా గా ఒప్పుకుంటే ప్రజలు వాళ్ళను మన్నిస్తారు.

కామెంట్‌లు లేవు: