28, ఏప్రిల్ 2012, శనివారం

ఆర్గానిక్ మోసం

          పూర్వం రైతులు తాము పండించిన విత్తనాలనే మళ్ళీ  విత్తడం కోసం  దాచిపెట్టుకొని తర్వాత సంవత్సరం విత్తుకునేవాళ్ళు.విత్తన శుద్ది కూడా రొచ్చు(పశువుల మూత్రం ) తో చేసుకునేవారు.పంటలకు పశువుల ఎరువును వాడే వారు.
    తర్వాత కాలంలో బహుళ జాతి కంపినీలు తమ లాభాల కోసం మార్కెట్ లో దిగి  ఒకసారి విత్తిన విత్తనాలు తర్వాత పనికి రాకుండా చేసి తప్పని సరిగా ప్రతి సంవత్సరం వాళ్ళ దగ్గరే వాళ్ళు చెప్పిన  ధరకు విత్తనాలను కొనేలా చేసినారు.
         రైతులకు  రసాయనిక ఎరువులను దగ్గర చేయడం వలన వాళ్ళు పశువులను  పెంచకుండా పోయినారు.దీనివలన రైతులు తప్పని సరిగా రసాయనిక ఎరువుల మీద ఆధార పడేలా  చేసినారు .పూర్వం రైతులు దేని కోసం ఎవరి మీద ఆధార పడకుండా ఉండేవారు.కానీ ప్రభుత్వాల కున్న బహుళజాతి సంస్థల మీద ప్రేమ వలన రైతులు ఆర్థికంగా దెబ్బతిని పోయినారు.ఇన్ని చేసినా రైతులు పండించిన పంట కు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైనారు.

      కానీ అవే బహుళ జాతి సంస్థలు ఈ మధ్యన "ఆర్గానిక్ ఫుడ్ "అనే   ఒక కొత్త నినాదాన్ని ఎత్తుకొని తిరిగి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి.అదేం కొత్త విషయం కాదు.మన రైతులు పూర్వం సంప్రదాయకంగా చేస్తున్న పనిని ,వారిని దారి మళ్ళించి నాశనం చేసి తిరిగి అదే పద్దతి లోకి వచ్చి ప్రజలను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాయి.బహుళ జాతి సంస్థల విష కౌగిలి నుండి రైతులను కాపాడడానికి ప్రభుత్వాలు రైతు పక్షపాతిగా పని చేయాలి.
         

1 కామెంట్‌:

anrd చెప్పారు...

బాగా చెప్పారండి. ఈ రోజుల్లో కష్టం ఒకరిదైతే లాభం ఇంకొకరు పొందుతున్నారు. కష్టం రైతులదైతే లాభం ఇతరులకు అన్నట్లు.