12, ఆగస్టు 2010, గురువారం

రైతులను ఆదుకోక పొతే ఆహార భద్రత ఎండమావే?

ఉపాధి హామీ పథకం ద్వారా రైతు లకు కూలీలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు.ఉండే కొద్ది మంది కూలీలకు వారు చెప్పినంత కూలీ ఇవ్వవలసిన పరిస్థితి రైతు లకు దాపురించింది.నకిలీ విత్తనాలు,పురుగు మందులు ,ప్రక్రుతివైపరీత్యాలకు తోడు ఈ కూలీ ల ధరలు కూడా పెరిగి రైతుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా తయారైంది.ఇన్ని కష్టాలు పడి రైతులు పండించిన పంటకు మద్దత్తు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారు.పాలకులు రైతులకు వ్యవసాయం లాభదాయకం చేయక పొతే ప్రభుత్వాలు కలలు కంటున్న ఆహార భద్రత ఎండమావే అవుతుంది.

కామెంట్‌లు లేవు: