28, మే 2014, బుధవారం

చాలా ఈర్హ్య గా ఉంది ఎ. పి .ప్రజలను చూస్తే!

ఆంధ్రప్రదేశ్ పజలను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషం మరియు ఈర్ష్య   కలుగు తున్నది. ఎందుకంటే జూన్ 2  తర్వాత  వారు అనుభవించే సుఖాలను గురించి తలచు కొని. 
    
 ఎలా లేదన్నా ఇంటికి ఇద్దరు ముసలి వాళ్ళు ఉంటారు, వాళ్లకు పెన్సన్ 2000 రూపాయలు,ఇద్దరు నిరుద్యోగులు వాళ్లకు భృతి  4000 .ఇలా ఏం  పని చేయకున్నా ప్రతి కుటుంబానికి నెలకు కనీసం ఆరు వేల రూపాయలు వస్తాయి. ఇక మహిళలు వంట చేయ వలసిన పని లేదు,ఎందుకంటే అన్నా క్యాంటీన్ నుండి  తక్కువ రేటు తో పార్సల్ తెచ్చు కోవచ్చు. హాయిగా ఇంట్లో కూర్చొని ఉచిత విద్యుత్ ఉపయోగించుకొని టి.వి. చూస్తూ ఉండడమే . అలాగే యువకులు /యువతులు బోర్ కొడితే ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ట్యాబ్ తీసికొని పబ్లిక్ ప్లేసెస్ ల ఉచితంగా లభించే ఎ.సి లో కూర్చొని ,వై.ఫై.  ఉపయోగించుకొని స్నేహితులతో చాటింగ్ చేయ వచ్చు . ఇప్పటికే ఒక వేళ ఋణాలు  చేసి ఉంటే అవి తీర్చాలనే బాధ లేదు,ఎలాగూ ప్రభుత్వం మాఫీ చేస్తుంది .1,50,000 ల తో ఇల్లు కూడా ఉచితంగా ప్రభుత్వం కట్టి ఇస్తుంది .  ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే ఇలాంటివి చాలా ఉన్నాయి ఎ. పి . ప్రజలు అనుభవించే సుఖాలు.
                  కానీ నాకు చాలా ఈర్హ్య గా ఉంది  ఎ. పి  .ప్రజలను చూస్తే ,ఎందుకంటే  ఈ స్వర్గ సుఖాలను నేను అనుభవించే అవకాశం  లేదు కాబట్టి.            

18, మే 2014, ఆదివారం

మరొక సారి విశ్వసనీయతకు పరీక్ష !

ముందుగా అంధ్రప్రదేశ్ ,తెలంగాణా లో కొత్త ప్రభుత్వాలు చేబడుతున్న పార్టీ ల పెద్దలకు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు . కాంగ్రెస్స్ అధిష్టానానికి నిజాలు చెప్పకుండా ఇక్కడ వై .ఎస్. హవా ఏమీ ఉండదు అని చెప్పి తెలంగాణా ఇస్తే పార్టీని అధికారం లోకి తీసుక వస్తామని బీరాలు పలికిన నేతలు నేడెక్కడ?తెలంగాణా ఇచ్చిన తర్వాత కూడా పార్టీని అధికారం లోకి తేవడం పక్కన పెట్టి చివరికి తమ స్థానాల్లో కూడా  గెలవలేక పోయారు. అదే వై.ఎస్.  ఉన్నప్పుడు 2009 లో తెలంగాణా సెంటిమెంట్ ఉన్నప్పుడు , తెలంగాణాకు మొదటి ప్రతినిధిగా భావించే టి.ఆర్.ఎస్ ,టి.డిపి. ఇంకా ఇతర పార్టీలు కూటమిని ఏర్పాటు చేసినా  కూడా వై.ఎస్. ఒంటి చేత్తో అధికారం లోకి తీసుకొని వచ్చాడు . అదీ నాయ కత్వం అంటే ! 
        
            ఇంక అంధ్రప్రదేశ్  లో జగన్ తాను  ఖచ్చితంగా అధికారం లోకి వస్తాను అనుకున్నాడు,అందుకే ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అవి తీర్చలేక ,విశ్వసనీయతను పోగొట్టుకోవడం ఇష్టం లేక అమలు చేయ గలిగే హామీలనే ఇచ్చాడు .కానీ టి.డి.పి  కి ఇప్పటికే పది సంవత్సరాలుగా  అధికారం లేదు ,చావో రేవో తేల్హుకోవలసిన పరిస్థితి,ఒక వేల ఇప్పుడు ఓడిపోతే పార్టీ ఉనికే ప్రమాదం లో పడే పరిస్థితి,కావున ఒకప్పుడు గొప్ప సంస్కరణ వాదిగా ,ఎ. పి  లో సంస్కరణలకు ఆద్యుడుగా తనకు తానూ చెప్పు కునే చంద్రబాబు గారు హామీలను తీర్చగల నో లేదో అని ఆలోచించ కుండా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చేశారు. ముఖ్యంగా రైతు  ఋణ  మాఫీ ని ప్రజలు  బాగా నమ్మినట్లున్నారు.  ఆయన ఇచ్చిన హామీలు నెరవేరుస్తారో లేక మరొక సారి తన విశ్వసనీయతను కోల్పోతారో చూడాలి.  
     
         జగన్ గారు తన అపజయానికి కారణాలేవో నిష్పాక్షికంగా విశ్లేసించు కొని ఒక బలమైన ప్రతిపక్షంగా ప్రజల తరుపున పనిచేస్తూ ,టి.డి .పి  ఇచ్చిన అన్ని హామీలను నూటికి నూరు పాళ్ళు  అమలు చేసేలా అధికార పక్షాన్ని ప్రజల తరపున ప్రశ్నిస్తూ ప్రయాణం చేయాలని ఆశిస్తూ ......