7, మార్చి 2013, గురువారం

చివరికి పశువులకు కూడా ఆహారం లో వైవిధ్యం లేకుండా పోయింది .

నా చిన్నప్పుడు తినే  ఆహారం లో  వైవిధ్యం ఉండేది . కొర్ర,ఆరిక ,జొన్నఅప్పుడప్పుడు వరి  అన్నం తినే వాల్లం . అప్పుడు చాలా బాగుండేది . కానీ నేడు అవన్నీ మాయమైనాయి. ఒక్క వరి అన్నమే ఉంది .మనుషులకే కాదు చివరికి పశువులకు కూడా అప్పటికీ ఇప్పటికీ ఆహారం లో వైవిధ్యం లేకుండా పోయింది . పూర్వం గడ్డివామిలో ఒక వరుస  వేరుశనగ కట్టె ,ఒక వరస ఆరిక గడ్డి,ఒక వరస కొర్ర గడ్డి ,ఒక వరస జొన్న చొప్ప,ఒక వరస వరి గడ్డి ,ఒక వరస జొన్న కంకుల గగ్గులు ఉండేవి . ఇవన్నీ  కూడా క్రిమి సంహారక  మందులు ,రసాయనిక ఎరువులు వాడకుండా పండించేవారు . ఇవన్నీ  వేసి ఒక సంవత్సరానికి సరిపడే  గడ్డి వామి వేసే వారు. ఈ గడ్డి ని తీసుకొని వచ్చి  పశువులకు వేస్తే  వాటికి పంచభక్ష్య పరమాన్నం తిన్నట్లు ఉండేది ,అవి ఆవురావురు మని తినేవి. పుష్టిగా ఉండేవి . కానీ నేడు  రైతులు గిట్టుబాటు కాక నో ,లేక మరొక కారణం చేతనో ఆ  పంటలన్నీ మానుకొని  రసాయనిక ఎరువులు ,క్రిమిసంహారక మందులు వాడి  శనగ పంట మాత్రమే పండిస్తున్నారు. మిషన్లతో కొట్టించిన తర్వాత వచ్చిన ఆ శనగ పొట్టును  మాత్రమే ఈ వాళ పశువులకు పెడుతున్నారు.అవి ఆకలికి తాళలేక ఆ పొట్టునే తింటున్నాయి . ఆ నోరు లేని జీవులను చూస్తే  బాధ వేస్తుంది .

కామెంట్‌లు లేవు: