5, ఏప్రిల్ 2011, మంగళవారం

ఇదేమి నైతికత ?

నిన్న మొన్నటి వరకు వై.ఎస్. ఫోటో వలన తాము గెలవలేదని కేవలం సోనియా గాంధి ఫోటో వలన మాత్రమే గెలిచామని ప్రగల్బాలు పలికి ,అధికార మరియు పార్టీ కార్యక్రమాల్లో కూడా వై.ఎస్ . ఫోటో పెట్టకుండా చేసి ప్రజల మనస్సుల్లో నుండి ఆయనను తీసి వేయాలని విశ్వ ప్రయత్నాలు చేసిన కాంగ్రెస్స్ పార్టీ నాయకులు రోజు కడప ,పులివెందుల ఉప ఎన్నికల కోసం వై.ఎస్. తమ వాడే అంటున్నారు.వై.ఎస్. ను కాంగ్రెస్స్ వాళ్ళే తిట్టినప్పుడు కూడా పార్టీ వాళ్ళు ఏమీ అన లేదు.అటువంటి వాళ్ళు జగన్ పార్టీ జెండా లో వై.ఎస్. ఫోటో పెట్టకూడదు అని అంటున్నారు.ఇది ఏమి నైతికత .ప్రజలు అసహ్యించుకుంటారని కూడా లేకుండా మొన్న ఎం.ఎల్.సి.ఎన్నికలలో జగన్ ను ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలతో పొత్తు పెట్టుకొని ,అధికార దుర్వినియోగం చేసినారు .అయినా కూడా జగన్ వర్గం మూడు స్థానాలు గెలుచుకుంది.వీళ్ళు ఎన్ని కుయుక్తులు పన్నినా కడప,పులివెందుల స్థానాలలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్స్ పార్టీ ని భారీ మెజారిటీ తో గెలిపించడానికి ప్రజలు సిద్దపడి ఉన్నారు.

కామెంట్‌లు లేవు: