ఒక చిన్న స్టీలు స్కేలు ,ఉలి ,బొగ్గు ,చిన్న సుత్తె తో బేతంచర్ల పని వారు అక్కడి నాప రాళ్ళతో రకరకాల లతలు,పుష్పాలు ,ఫ్లోరింగ్ డిజైన్లను చాలా అద్బుతంగా చేస్తారు.అందులో చాలా జామెట్రీ దాగి ఉంది.ఏ పరికరమూ ,యంత్ర సహాయం లేకుండా చాలా ఖచ్హితంగా చేస్తారు.కానీ ఈ మధ్యన ఈ ఆర్టిఫిసీల్ టైల్స్ వచ్హిన తర్వాత వారికి పని తగ్గి పోయింది.ఈ పని లో చాలా మటుకు ముస్లిం మైనారిటీ కి చెందిన వారు ,వెనుక బడిన కులాలకు చెందిన వారు ఉపాధి పొందుతూ ఉండేవారు.ఉపాధి తగ్గినందువలన కొత్త తరం ఈ పనిలోకి రావడానికి జంకుతున్నారు.ఇప్పటికే ఎన్నో కళల ను మనం కోల్పోయాము.కావున ప్రభుత్వం,పెద్దలు స్పందించి ఇటువంటి కళను ,కళాకారులను దూరం కాకుండా చేసు కోవలసిన అవసరం ఉంది.
5, డిసెంబర్ 2014, శుక్రవారం
3, డిసెంబర్ 2014, బుధవారం
క్రెడిట్ అంతా ప్రతిపక్షాలకే పోతుంది .
మొదటి సంతకం రైతు రుణమాఫీ పై పెడతామని అధికారం లోకి వచ్చి 6 నెలలు అయినా కూడా ఒక్క రైతు ఖాతా లోకి ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. కొత్త అప్పులు పుట్ట లేదు . దీనిపై ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి పెంచుతున్నాయి .
ఒక వేల అధికార పక్షం ఈ రుణమాఫీ ని తాము ఎన్నికల ముందు చెప్పినట్లుగా కాకుండా ,అరకొరగా చేసినామంటే చేసినామని అనిపిస్తే వారు రైతుల విశ్వాసాన్ని పొందలేరు .
ఈ మటుకు చేసింది కూడా ప్రతిపక్షాల వత్తిడికి తలఒగ్గి మాత్రమే చేసారని రైతులు అనుకొంటారు . అధికారపక్షానికి నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే ఇన్ని రోజులు మొదటి సంతకానికి సమయం పట్టదని అనుకుంటున్నారు. చివరికి ఈ క్రెడిట్ అంతా ప్రతిపక్షాలకే పోతుంది .
17, నవంబర్ 2014, సోమవారం
రాజధాని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మన పెరట్లో నే ఉండాలి..
ఒక వైపు రాజధాని తుళ్లూరు ప్రాంతం వైపు అని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అక్కడ రైతుల భూముల ధరలు విపరీతంగా పెరిగాయని వార్తలు వస్తున్నాయి. మరో వైపు అక్కడ కొంత మంది రైతులు మూడు నాలుగు పంటలు పండే పచ్హని తమ భూములు ఇవ్వమని చెబుతూనే ,రాజధాని అమరావతి,తాడికొండ మండలాల్లో పెట్ట వచ్హుకదా అని చెబుతున్నారు. కానీ రాజధానిని తీసుకొని పోయి ప్రభుత్వ బీడు భూములు ఉన్న చోట పెట్టమని చెప్పడం లేదు.అంటే రాజధాని మాత్రం తమ పెరట్లోనే ఉండాలి కానీ తమ భూముల్లో ఉండకూడదు.
ఒకప్పుడు వేరుశనగ పంట విపరీతంగా పండే అనంతపురం జిల్లా లోని కదిరి ప్రాంతం లో ,ఇప్పుడు వర్షాలు లేక వేల ఎకరాలు భూముులు బీడు పడి ఉన్నాయి.ఇప్పటికీ అక్కడ ఎకరా భూమి 30000 రూపాయలు ధర కూడా పలకని ప్రాంతాలు ఉన్నాయి.
ఇటువంటి ప్రాంతం లో రాజధాని పెడితే అక్కడ భూములకు కొంచ మైనా గిరాకీ వచ్హి రైతులు బాగు పడతారు. ఇన్ని రోజులూ ఆంధ్ర ప్రాంతం వాల్లకు నీరు ఇచ్హి రెండు మూడు పంటలు పండే లా చేసి వాల్లను ఆర్థికంగా బలపడేటట్లుగా చేసారు.ఇప్పుడు మల్లీ రాజధానిని తీసుకు వెళ్ళి అక్కడే పెట్టి తిరిగి వాల్లనే బలవంతులను చేస్తున్నారు.
ఆర్థికాభివృద్దిని ఒకే వైపు కేంద్రీకరిస్తున్నారు.రాయలసీమ వాల్లు కూడా ఈ రాష్ట్రం లోని ప్రజలే అని ప్రభుత్వాలు ,అక్కడి ప్రజలు గుర్తిస్తే బాగుంటుంది.
11, నవంబర్ 2014, మంగళవారం
స్వచ్చ భారత్ ...
ఈ స్వచ్హ భారత్ లో పాల్గొంటున్న వారు వేసుకున్న హ్యాండ్ గ్లౌసులు ,మూతికి కట్టుకునే గుడ్డలు ,మంచి చీపుర్లు మరియు ఈ ప్రొగ్రాం లో పాల్గొనడానికి వచ్హే ముందు వేయొంచు కున్న ఇంజెక్షన్లు ,తీసుకున్న జాగ్రత్తలలో కొంత శాతమైనా ప్రతి రోజూ ఈ స్వచ్హ భారత్ లో ఫోటో లు లేకుండా ,శ్రమించే పారిశుద్ద కార్మికుల కోసం కేటాయిస్తే చాలాసంతోషం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)