4, సెప్టెంబర్ 2010, శనివారం

తెలంగాణా ప్రజలు తిరిగి కే.సి.ఆర్ ఉచ్చులో పడ్డారు.

సెప్టెంబర్ 17 తేదిని తెలంగాణా విమోచన దినం జరపాలని అన్ని పార్టీ నుండి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో ,టి.ఆర్.ఎస్ పార్టీ కూడా చిన్నగా డిమాండ్ చేసింది.కానీ టి.ఆర్.ఎస్ పార్టీ వాళ్లకు ముఖ్యంగా కే.సి.ఆర్ కు విమోచన దినం డిమాండ్ చేసి ముస్లిం ను దూరం చేసుకోవడం ఇష్టం లేదు ,అలాగని తెలంగాణా పరుగులో వెనక పడ్డం ఇష్టం లేదు .అందుకే వ్యూహాత్మకంగా .పి.పి.ఎస్.సి నిర్వహించే గ్రూప్ -1 పరీక్షలను ముందుకు తెచ్చి తెలంగాణా వాళ్ళను ముఖ్యంగా విద్యార్థులను రెచ్చగొట్టి తను అనుకున్నది సాధించారు.ఇప్పుడు అందరూ .పి.పి.ఎస్.సి నిర్వహించే పరీక్షల వెంట పడ్డారు.విమోచన దినం గురించి అందరూ మర్చి పోయారు.రాజకీయ నాయకుల స్వార్థ వ్యూహాలు వాళ్లకు ఉంటాయి.విద్యార్థులు స్వార్థ రాజకీయనాయకుల ఉచ్చులో పడి వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు.

7 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

It is just a plan to revive the violent agitation. It's now pretty clear that Srikrishna comity is not going to recommend for the seperate telangana state. They are getting ready with their plans.

Sravya V చెప్పారు...

సరిగ్గా చెప్పారు . కెసిఆర్ ఉచ్చులో పడి ఎంతమంది బతుకులు నాశనం చేస్తారో . నిజం గా కస్టపడి ఈ పరీక్షలకి తయారైనవారి పరిస్తితి ఏమిటో పాపం .

అజ్ఞాత చెప్పారు...

what a catch. you are so intelligent.

అజ్ఞాత చెప్పారు...

Interesting point.
A flock of sheep, they'll never realize the full colours oh KCR.

అజ్ఞాత చెప్పారు...

వాళ్ళ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు......
>>>>
ఎంత రామ సక్కని సూచన.
తెలంగాణా విద్యార్ధులు బుద్ధిగా చదువుకుని ... బుద్ధిగా పరీక్షలు రాసి ... అందరికంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుని... ఇంటర్వ్యూల్లో ఆంద్ర తోడేళ్ళ అడ్డమైన ప్రశ్నలకు ఖిన్నులై ఫెయిలై తలవంచుకుని ఇళ్ళకు చేరుకోవడం లోనే వారి బంగారు భవిష్యత్తు వుంది కదా.
తెలంగాణా ప్రాంతంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంతమంది ఆంద్ర ఉద్యోగులు, అధికార్లు తిష్ట వేసి వున్నారో,
ఆంద్ర ప్రాంతం లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎంతమంది తెలంగాణా ఉద్యోగులున్నారో
ఈ అరవై సంవత్సరాల దుర్మార్గమైన సమైక్య రాష్ట్రం లో తెలంగాణాకు ఉపాధి రంగంలో సాగునీటి పంపకంలో ఎంత అన్యాయం జరిగిందో ఆలోచించడం
తెలంగాణా విద్యార్ధుల భవిష్యత్తును నాశనం చేస్తుందా వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తుందా?
ఇవాళ తెలంగాణా వారికి సమైక్యతా అంటేనే బూతు మాట. దయ్యాలు వల్లించే ఊత పదం గా ఆనిపిస్తోంది.
ఇంకా ఎందుకీ కల్లబొల్లి కబురులు. ఎంతకాలం ఈ నయ వంచన
- I. Yadagiri

అజ్ఞాత చెప్పారు...

మీరేంత అరచి గీ పెట్టినా మా యాద్గిరన్న శానా తెలివేనోడు

అజ్ఞాత చెప్పారు...

మీరేంత అరచి గీ పెట్టినా మా యాద్గిరన్న శానా తెలివేనోడు