11, నవంబర్ 2012, ఆదివారం

మన ఆహారం గురించి చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము!

చాలా మంది సినిమా వాళ్ళను మీడియా వాళ్ళు ఇంటర్వ్యూ  చేసేటప్పుడు  ఖచ్చితంగా అడిగే ప్రశ్న ఒకటి ఉంటుంది.అదేమంటే మీకు ఏ ఆహారం  అంటే ఇష్టం అని ,అప్పుడు చాలా మంది చెప్పే జవాబు వాళ్లకు ఇటాలియన్ ,మెక్సికన్ ,కాంటినెంటల్  ఆహారం అంటే ఇష్టం అని చెబుతారు.అదేంటో నాకర్థం కాని విషయం ,వాళ్ళు చిన్నప్పటి నుండి అదే తిని బ్రతుకు తున్నట్లు చెబుతారు.తాము చిన్నప్పటి నుండి తిన్న రోటీ ,కూరలు ,అన్నం గురించి చెప్పనే చెప్పరు .సాధారణంగా మనం చిన్నప్పటి  నుండి   తినే ఆహారానికే మన నాలుక మీద ఉండే రుచి మొగ్గలు అలవాటు పడి ఉంటాయి.వేరే ఆహారం ఏది తిన్నా అది మనం ప్రతి రోజూ తినలేము,అది మనకు ఇష్టం కాదు.వీళ్ళందరినీ చూసి ప్రతి అడ్డమైన వాళ్ళు కొంచం ఇంగ్లీషు మాట్లాడడం వస్తే చాలు వాళ్ళు కూడా పిజ్జా లు ,బర్గర్లను గురించి మనది కాని ఆహారం గురించి వావ్ అంటూ గొప్పగా చెబుతూ ఉంటారు.ఎంతో ఆరోగ్య కరమైన మన ఆహారం గురించి చెప్పాలంటే వీళ్ళకు నామోషి.వాళ్లకు కూడా తెలుసు తాము తమ ఆత్మ ద్రోహం చేసుకొని చెబుతున్నామని,కానీ ఫాల్స్ ప్రిస్టేజి కి పోతున్నారు. మనం తినే ,మనకు ఇష్టమైన ఆహారం గురించి చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాము. ఈ మధ్యన నడమంత్రపు సిరి వచ్చిన వాళ్లకు ఇది మరీ ఎక్కువైంది.


8, నవంబర్ 2012, గురువారం

భారతదేశం నడిచే వాళ్లకి స్థానం లేనంతగా అభివృద్ధి చెందింది!

ఈ మధ్యన పెద్ద పెద్ద పట్టణాలలో నడిచే వారికి దారి ఉండడం లేదు.రోడ్లు కార్లు మరియు బైకులతో కిక్కిరిసి ఉంటున్నాయి.నడవడానికి కొంచం కూడా జాగా ఉండడం లేదు.పాదచారులు నడవడానికి ఉద్దేశించిన ఫుట్ పాత్  లు చాలా చోట్ల ఉండడం లేదు,ఒక వేల ఉంటే వాటిని అక్కడ ఉన్న దుఖానాల వారు తమ వస్తువులను ఉంచుకోవడానికి ,పార్కింగ్ కోసం ఉపయోగించు కుంటున్నారు.భారతదేశం  నడిచే వాళ్లకి స్థానం లేనంతగా అభివృద్ధి చెందింది.

8, అక్టోబర్ 2012, సోమవారం

ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందింది

రెండు దెబ్బల సమ్మెట పోట్లకే ప్రజలు 1000 రూపాయలు ఇస్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్ చాలా అభివృద్ధి చెందింది.ఇంకా పాద యాత్రలు ఎందుకు పరామర్శించడం  ఎందుకు?ప్రజల దగ్గర డబ్బులు గల గల లాడు తుంటే ?

23, ఆగస్టు 2012, గురువారం

మంత్రుల మీద వెచ్చించిన ప్రజల సొమ్మును రికవరీ చేయాలి

అన్నీ ముఖ్యమంత్రిగా వై.ఎస్. ఉన్నప్పుడు ఆయన చెప్పినట్లే సంతకాలు చేసామని ,తమ కేమీ తెలియదని తాము అమాయకులమని ఇప్పుడు మంత్రులు చెబుతున్నారు.అటువంటప్పుడు మంత్రివర్గం ఎందుకు? మంత్రులకు అధికార బంగళాలు ,ఎర్ర బల్బు కార్లు,పి . లు,పి.ఎస్ లు ఇతర సిబ్బంది ని ప్రజా ధనాన్ని ఉపయోగించి ఇవ్వడం ఎందుకు?ప్రజాధనాన్ని వృధా చేయడం ఎందుకు ? ముఖ్యమంత్రి పదవి ఒకటి ఉంటే సరిపోతుంది కదా!! వాల అలా అంటున్న మంత్రుల మీద సమయంలో ఖర్చు పెట్టిన ప్రజా ధనాన్ని రికవరీ చేస్తే తప్పవుతుందా?