ప్రజలలో నుండి వచ్చిన బలమైన నాయకుడు లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే తెలుస్తుంది.రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రాంతీయ వాదాల్ని ఒంటిచేత్తో ఆపగలిగాడు. తెలంగాణాకు రాజశేఖర రెడ్డి మాత్రమే అడ్డం అని ప్రచారం తో ఊదరగొట్టినా ,టి.ఆర్.ఎస్.,మిగతా పార్టీలన్నీ ఒక వైపు ఉండి ఎలెక్షన్లలో పాల్గొన్నా,అభివృద్ధి అనే నినాదంతో ఒంటి చేత్తో కాంగ్రెస్స్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చి ,టి.ఆర్.ఎస్. ను పది సీట్లకు మాత్రమే పరిమితం చేసి తెలంగాణావాదం ఏమీ లేదని తేల్చేశాడు.టి.ఆర్.ఎస్. పార్టీ కూడా అధినేత మీద విశ్వాసం లేక చిన్నాభిన్నమైనది.కానీ రాజశేఖర రెడ్డి గారు చని పోయిన తర్వాత చచ్చిపోయిన తెలంగాణా వాదాన్ని సెలైన్ ను పెట్టి తిరిగి బతికించి ఈ రోజు కేంద్రం తో తెలంగాణాకు సై అనిపించారు. ఈ పరిణామాల్ని చూస్తున్న రాజశేఖర రెడ్డి గారి ఆత్మ తీవ్రంగా క్షోభిస్తూ ఉంటుంది.
10, డిసెంబర్ 2009, గురువారం
4, డిసెంబర్ 2009, శుక్రవారం
అభివృద్ధి అంటే ఒక చార్మీనార్ ,ఒక సాలార్జంగ్ మ్యూజియం కట్టడం కాదు
బ్రిటిష్ వాళ్లు మనలను పాలించేటప్పుడు వాళ్ళను తరిమి వేస్తే ప్రజలంతా స్వేచ్చా స్వాతంత్ర్యాలతో ,సుఖ సంతోషాలతో తులతూగుతారని ప్రజలంతా భ్రమ పడ్డారు.కానీ ఈ వాళ ఏమైంది.స్వాతంత్ర్యం వచ్చి అరవై సంవత్సరాలు పైబడింది.కానీ ఇప్పటికి కూడా కోట్ల మంది ప్రజలు ఒక్క పూట తిండికి కూడా నోచుకోకుండా ఉన్నారు.కనీసం రాజ్యాంగం కల్పించిన కనీస మౌలిక హక్కులు కూడా పొంద లేని పరిస్థితిలో ఉన్నారు.ఆ నాడు స్వాతంత్ర్యం కోసం పోరాడిన వాళ్ళలో గాంధీజీ,భగత్సింగ్,సుభాష్ లాంటి నిస్వార్థ పరులు ఉండే వారు. కానీ ఈ వాళ తెలంగాణా విముక్తి కోసం పోరాటం చేస్తున్నానని చెబుతున్న కే.సి.ఆర్. లాంటి వ్యక్తుల విశ్వసనీయత ఎలాంటిదో ప్రజలకు తెలుసు.తెలంగాణా ఉద్యమం చేపట్టక ముందు కే.సి.ఆర్. ఆస్తి ఎంత ,ఇప్పుడు ఉన్న ఆస్తి ఎంత.ఈ వాళ తెలంగాణా రాష్ట్రం విడిపోయినా కూడా ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు.అక్కడ దోపిడీ ఉండదని ప్రజలకు హామీ ఇస్తారా? ఈ వాళ ఆంధ్ర ప్రజలను బూచిగా చూపించి తెలంగాణా రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్న వారు ,తెలంగాణా వచ్చిన తర్వాత అమాయక తెలంగాణా బిడ్డలను దోచుకోరని గ్యారెంటీ ఉందా.ప్రతి సమాజంలో పీడించే వాళ్లు ,పీడితులు ఉంటారు.ప్రజలు మోసపోకుండా హుషారుగా ఉండాలి,అంతేగాని తెలంగాణా వచ్చినంత మాత్రాన ఆ రాష్ట్రంలో అందరూ ఉత్తములు ఉండరు.హైదరాబాదు ముందే ఎంతో అభివృద్ధి చెందిందని చెబుతున్నారు.ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాతనే వెనక పడినామని చెబుతున్నారు.అభివృద్ధి అంటే ఒక చార్మినార్,ఒక సాలార్జంగ్ మ్యూజియం కట్టడం కాదు.ప్రజలకు తగిన విద్యాబుద్దులు ఉండి వాళ్ల బతుకులు వాళ్లు బతికే విధంగా చేయడం.కానీ ఈ రోజుకు కూడా తెలంగాణా లోని ప్రజలు ఎంతో అమాయకంగా ,రకరకాల మూఢ నమ్మకాలలో బతుకుతున్నారు.ఎవరో వచ్చి వాళ్ళను మోసం చేస్తారని భ్రమల్లో ఉన్నారు.వాళ్ల మీద వాళ్లకు నమ్మకం లేదు.కావున ఎంత అభివృద్ధి చెందిందో ,మేము ముందే అభివృద్ధి చెంది ఉన్నామని చెప్పే తెలంగాణా మేధావులు జవాబు చెబితే బాగుంటుంది.తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే ప్రజలకు ఏదో ఒరిగి పోతుందని చెప్పి తెలంగాణా ప్రజలను ఎండమావుల వెంట పరిగెత్తించేది మానుకుంటే బాగుంటుంది.
3, డిసెంబర్ 2009, గురువారం
కే.సి.ఆర్ కంటే బాలాథాక్రే చాలా నయం
1, డిసెంబర్ 2009, మంగళవారం
మళ్ళీ విజయవంతంగా దీక్ష ను ముగించిన కే.సి.ఆర్
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాకముందే బి.జే.పి తో పొత్తుకు సై చెప్పిన కే.సి.ఆర్. ఆ పార్టీ అధికారం లోకి రాక పోయేసరికి ,కాంగ్రెస్స్ తో దగ్గర కావడానికి నిరాహార దీక్ష అనే కొత్త పథకం రచించాడు.ఇలాంటి పథకాలు వేస్తే కాంగ్రెస్స్ పార్టీ దగ్గరకు తీసుకొని కేంద్రం లో ఏదో ఒక పదవి ఇస్తుందని ఆయన ఆశ పడి దీక్ష డ్రామా మొదలు పెట్టినాడు.మునుపటి లాగే దీక్ష డ్రామా లానే ముగిసింది.మళ్ళీ కే.సి.ఆర్. విజయవంతంగా దీక్షను ముగించాడు.