3, డిసెంబర్ 2009, గురువారం
కే.సి.ఆర్ కంటే బాలాథాక్రే చాలా నయం
1, డిసెంబర్ 2009, మంగళవారం
మళ్ళీ విజయవంతంగా దీక్ష ను ముగించిన కే.సి.ఆర్
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాకముందే బి.జే.పి తో పొత్తుకు సై చెప్పిన కే.సి.ఆర్. ఆ పార్టీ అధికారం లోకి రాక పోయేసరికి ,కాంగ్రెస్స్ తో దగ్గర కావడానికి నిరాహార దీక్ష అనే కొత్త పథకం రచించాడు.ఇలాంటి పథకాలు వేస్తే కాంగ్రెస్స్ పార్టీ దగ్గరకు తీసుకొని కేంద్రం లో ఏదో ఒక పదవి ఇస్తుందని ఆయన ఆశ పడి దీక్ష డ్రామా మొదలు పెట్టినాడు.మునుపటి లాగే దీక్ష డ్రామా లానే ముగిసింది.మళ్ళీ కే.సి.ఆర్. విజయవంతంగా దీక్షను ముగించాడు.
13, నవంబర్ 2009, శుక్రవారం
చంద్రబాబు మరియు ఆయన మిత్రబృందం రెండు నాల్కల ధోరణి
మార్గదర్శి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ,ప్రభుత్వం ప్రజల రక్షణకు తనకున్న పరిధిలో చర్యలు తీసుకుంటే చంద్రబాబు గారు మరియు ఆయన మిత్రబృందం కలిసి ఈనాడు పత్రిక మీద మరియు మీడియా మీద దాడి అని ఎంతో హడావిడి చేసారు.అదే ఈ రోజున జగన్ మీద ఎన్నో ఆరోపణలు అదే చంద్రబాబు మరియు ఆయన మిత్ర బృందం సంధిస్తున్నారు.వాళ్లకు ఇప్పుడు మీడియా మీద దాడి గా కనిపించడం లేదా?ఎందుకంటే జగన్ కు కూడా మీడియా ఉంది. కాంగ్రెస్స్ పార్టీ వాళ్లకు చంద్రబాబు గారి లాగా గోబెల్స్ ప్రచారం చేయడం చేతకాదేమో.చంద్రబాబు గారి రెండు నాల్కల ధోరణి ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నది.చంద్రబాబు గారు ఇటువంటి పనులు చేయడం వలన విశ్వసనీయత ఎప్పుడో పోగొట్టుకున్నారు. మిగతా ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన వెంట నడిస్తే, వీళ్ళు కూడా ప్రజలలో విశ్వసనీయత పోగొట్టుకొని ప్రజలలో చెల్లకుండా పోతారు.