3, డిసెంబర్ 2009, గురువారం

కే.సి.ఆర్ కంటే బాలాథాక్రే చాలా నయం

తెలంగాణా అనే భావోద్వేగ సమస్యని తెలంగాణా లోని రాజకీయ నాయకులు చాలా బాగా క్యాష్ చేసుకుంటున్నారు.మొదట చెన్నారెడ్డి ఆ సమస్యను ఉపయోగించుకొని అనేక పదవులు పొందినారు.ఇప్పుడు కె.సి.ఆర్. అదే పనిలో ఉన్నారు.ఒక వైపు ఏమో చచ్హేంత వరకు నిరాహారదీక్ష అంటున్నాడు, మరోవైపు ఏమో ఖమ్మంలో సౌకర్యాలు లేవంటున్నాడు.చచ్హేవానికి సౌకర్యాలతో ఏం పని.దీన్ని తెలంగాణా ప్రజలు అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.అందరికన్నా ఎక్కువ నష్టపోయింది రాయలసీమ ప్రజలు.ఎందుకంటే తెలంగాణా వాళ్ళు కలుస్తామంటే కర్నూలు రాజధానిని పోగొట్టు కొని హైదరాబాదు రాజధానిని ఒప్పుకున్నారు.హైదరాబాదు బాగా అభివ్రుద్ది చేసు కున్న తర్వాత తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు.నాకు తెలిసినంత వరకు రాజధాని వాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరూ రాష్ట్ర విభజన కోరలేదు,తెలంగాణా వాళ్ళు తప్ప.తెలంగాణా వాళ్ళ కంటే బాలాథాక్రే చాలా నయమని పిస్తుంది.ఎందుకంటే ఆయన ముంబాయి మరాఠీ లది మాత్రమే అంటున్నాడు.కానీ ఇక్కడ ఆంధ్రావాలే భాగో అంటున్నారు.తెలుగువాళ్ళం అయి ఉండి తెలంగాణా ప్రాంతంలో ద్వితీయ శ్రేణి పౌరులులాగా భయపడుతూ ఎందుకు బ్రతకాలో అర్థం కావడం లేదు.తెలంగాణా ఉద్యమానికి నిధులు పంపిస్తూ ప్రోత్సహిస్తున్న ప్రవాస తెలంగాణా ప్రజలూ మీరు ఒక సారి ఆలోచన చేయాలి.ఎందుకంటే అక్కడి ప్రజలు మిమ్ములను కూడా భాగో అనే పరిస్థితి వస్తుంది.

1, డిసెంబర్ 2009, మంగళవారం

మళ్ళీ విజయవంతంగా దీక్ష ను ముగించిన కే.సి.ఆర్

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాకముందే బి.జే.పి తో పొత్తుకు సై చెప్పిన కే.సి.ఆర్. ఆ పార్టీ అధికారం లోకి రాక పోయేసరికి ,కాంగ్రెస్స్ తో దగ్గర కావడానికి నిరాహార దీక్ష అనే కొత్త పథకం రచించాడు.ఇలాంటి పథకాలు వేస్తే కాంగ్రెస్స్ పార్టీ దగ్గరకు తీసుకొని కేంద్రం లో ఏదో ఒక పదవి ఇస్తుందని ఆయన ఆశ పడి దీక్ష డ్రామా మొదలు పెట్టినాడు.మునుపటి లాగే దీక్ష డ్రామా లానే ముగిసింది.మళ్ళీ కే.సి.ఆర్. విజయవంతంగా దీక్షను ముగించాడు.

13, నవంబర్ 2009, శుక్రవారం

చంద్రబాబు మరియు ఆయన మిత్రబృందం రెండు నాల్కల ధోరణి

మార్గదర్శి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ,ప్రభుత్వం ప్రజల రక్షణకు తనకున్న పరిధిలో చర్యలు తీసుకుంటే చంద్రబాబు గారు మరియు ఆయన మిత్రబృందం కలిసి ఈనాడు పత్రిక మీద మరియు మీడియా మీద దాడి అని ఎంతో హడావిడి చేసారు.అదే ఈ రోజున జగన్ మీద ఎన్నో ఆరోపణలు అదే చంద్రబాబు మరియు ఆయన మిత్ర బృందం సంధిస్తున్నారు.వాళ్లకు ఇప్పుడు మీడియా మీద దాడి గా కనిపించడం లేదా?ఎందుకంటే జగన్ కు కూడా మీడియా ఉంది. కాంగ్రెస్స్ పార్టీ వాళ్లకు చంద్రబాబు గారి లాగా గోబెల్స్ ప్రచారం చేయడం చేతకాదేమో.చంద్రబాబు గారి రెండు నాల్కల ధోరణి ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నది.చంద్రబాబు గారు ఇటువంటి పనులు చేయడం వలన విశ్వసనీయత ఎప్పుడో పోగొట్టుకున్నారు. మిగతా ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన వెంట నడిస్తే, వీళ్ళు కూడా ప్రజలలో విశ్వసనీయత పోగొట్టుకొని ప్రజలలో చెల్లకుండా పోతారు.

11, నవంబర్ 2009, బుధవారం

2012 లో యుగాంతం -మార్కెట్ వర్గాల కుట్ర

2012 లో యుగాంతం గురించి మధ్యన మీడియా లో చాలా హడావిడి కనిపిస్తుంది.ప్రతిదినమూ విషయాన్ని ప్రసారంచేస్తూ ,ప్రజలను చాలా భయానికి గురి చేస్తున్నారు.దీన్ని నిశితంగా పరిశీలిస్తే దీని వెనుక మార్కెట్ వర్గాల కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆర్ధిక మాంద్యం పరిస్థితులలో మార్కెట్లో డబ్బులు లేవు కాబట్టి ,ప్రజలను ఎలాగోలా భయపెట్టి వాళ్ల దగ్గరఉన్నడబ్బు బయటికి తీయించి ఖర్చు పెట్టించాలనే యోచన కనిపిస్తున్నది. విధంగా ఆర్ధిక మాంద్యం నుండి బయటపడాలనే వ్యూహం ఉన్నట్లు కనిపిస్తున్నది.