11, నవంబర్ 2009, బుధవారం

2012 లో యుగాంతం -మార్కెట్ వర్గాల కుట్ర

2012 లో యుగాంతం గురించి మధ్యన మీడియా లో చాలా హడావిడి కనిపిస్తుంది.ప్రతిదినమూ విషయాన్ని ప్రసారంచేస్తూ ,ప్రజలను చాలా భయానికి గురి చేస్తున్నారు.దీన్ని నిశితంగా పరిశీలిస్తే దీని వెనుక మార్కెట్ వర్గాల కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆర్ధిక మాంద్యం పరిస్థితులలో మార్కెట్లో డబ్బులు లేవు కాబట్టి ,ప్రజలను ఎలాగోలా భయపెట్టి వాళ్ల దగ్గరఉన్నడబ్బు బయటికి తీయించి ఖర్చు పెట్టించాలనే యోచన కనిపిస్తున్నది. విధంగా ఆర్ధిక మాంద్యం నుండి బయటపడాలనే వ్యూహం ఉన్నట్లు కనిపిస్తున్నది.

27, సెప్టెంబర్ 2009, ఆదివారం

కాంగ్రెస్స్ పార్టీ "సో కాల్డ్ "సీనియర్ల రాజ్యాంగ ద్రోహం

కాంగ్రెస్స్ పార్టీకి సంభందించి నాయకులకు ప్రజలలో ఎవరికి ఎంత పలుకు బడి ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలాబాగా తెలుసు. రోజు రాజశేఖర రెడ్డి గారి దుర్మరణం తర్వాత సో కాల్డ్ సీనియర్ లనే ప్రజా బలం లేని వృద్ద నాయకులఅర్థం లేని ప్రకటనలు చూస్తుంటే చాలా విచిత్రం అనిపిస్తుంది.ముఖ్యమంత్రి ఎంపికలో ముఖ్య పాత్ర వహించాలిసిందిఎం.ఎల్. లు మాత్రమే అనే ప్రాథమిక రాజ్యాంగ సంప్రదాయాన్ని పక్కన పెట్టి అధిష్టానం ,లేక సీనియర్లు అనే వితండవాదాన్ని తెర పైకి తెచ్చి రాజ్యాంగ ద్రోహానికి పాల్పడుతున్నారు .ప్రజలు ఓట్లు వేసి గెలిపించుకున్న ఎం.ఎల్. లుమాత్రమే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాలి.అప్పుడు మాత్రమే ప్రజాభిప్రాయం ప్రతిఫలిస్తుంది,లేకపొతే తెలుగు వాడిఆత్మగౌరవ నినాదం తిరిగి తెరపైకి వచ్చి కాంగ్రెస్స్ పార్టీ తిరిగి రాష్ట్రంలో భ్రష్టు పట్టి పోతుంది. రాష్ట్రం లో రాజశేఖర రెడ్డిగారి విశ్వసనీయత ను చూసి ప్రజలు కాంగ్రెస్స్ పార్టీకి ఓట్లు వేసినారు గాని సోనియా గాంధిని,సోకాల్డ్ సీనియర్లను చూసికాదు. విషయాన్ని కాంగ్రెస్స్ పార్టీ అధిష్టానం గుర్తించి ,ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తే పార్టీ రాష్ట్రంలోబట్టకడుతుంది,లేకపొతే అధికారాన్ని బంగారుపల్లెంలో పెట్టి వేరే పార్టీ కి ఇచ్చిన వాళ్ళవుతారు.

అదే బ్లాగు పేరు ఇతరులు పెట్టుకోవచ్చా..

బ్లాగు కు మనం పెట్టిన పేరు ఇతరులు పెడితే అది మార్చడానికి ఏమి చేయాలి.అదే పేరు ఇతరులు కూడా పెట్టుకోవచ్చా. వాళ్ళకు ఈ విషయాన్ని తెలియ చెప్పినా మార్చాక పొతే ఏమి చేయాలి.ప్రొఫైల్ లో ఎవరు ముందు బ్లాగు మొదలు పెట్టినారు అని క్లియర్ గా ఉన్నా మార్చక పొతే ఎవరికీ కంప్లైంట్ చేయాలి దయ చేసి తెలపగలరు.

4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

వై.ఎస్.జగన్ నే సి.యం. చేయాలి.

వై .ఎస్. జగన్ నే సి.యం.చేయాలి.ఈ వాళ ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రజాకర్షణ ఉన్నది జగన్ కే .రాష్ట్రం అంతా అనుచర గణం జగన్ కు ఉంది.రాష్ట్ర కాంగ్రెస్స్ లో ఎవరికీ అంతటి ప్రజాకర్షణ ,అనుచర గణం లేదు.జూనియర్ అని జగన్ ను పక్కన పెట్టకూడదు.జూనియర్ అని రాజశేఖర రెడ్డిని పక్కన పెట్టి , చాలా రోజులు ప్రజలలో అభిమానం లేని ముసలి నాయకులు అదికారాన్ని అనుభవించారు.చివరికి రాష్ట్రంలో కాంగ్రెస్స్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అదే జూనియర్ పార్టీ ని అధికారంలోకి తీసుకు వచ్చి ప్రజా రంజకంగా పరిపాలించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయినాడు.పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సీనియర్లంతా ఏం చేసారు.వారసత్వం అనే దాన్ని అనర్హతగా చూడకూడదు.కాబట్టి జగనే సి.యం .పోస్టు కు సరి అయిన వ్యక్తి .