14, మే 2009, గురువారం

ఆర్దిక మాంద్యంలో ఆంధ్రలో బాబు గారి పాలన ఉండింటే?


బాబు గారు తిరిగి అధికారం లోకి వస్తే అంతే.ఈ రోజు ఆర్థిక మాంద్యంలో కూడా ప్రజలు అంతో ఇంతో బాగున్నారంటే అది కాంగ్రెస్స్ ప్రభుత్వం అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలవలనే.ఒక వేళ బాబు గారు ఈ అర్థిక మాంద్యం ఉన్న రోజుల్లో అధికారంలో ఉండింటే ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొనేవారో.ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఒక శాతం ప్రజలకు ఉపయోగపడే ఐ .టి గురించి మాత్రమే మాట్లాడే వాడు.ఆయన హై క్లాసు వాళ్ళ గురించి మాత్రమే ఆలోచించే వాడు.ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో ప్రజలు పాల పరిశ్రమ ,వ్యవసాయం పెట్టు కొని స్వయం సమ్రుద్ది సాధించి సంతోషంగా ఉన్నారు. ఆయన ఈ రోజు కూడా మారలేదు.అన్నీ ఫ్రీ గా ఇస్తానని అంటున్నాడు.ఎంతసేపు ప్రజలను భిక్షగాల్లను చేసి ఆయన పబ్బం గడుపు కోవాలని చూస్తున్నాడు.
ఈ ఆర్థికమాంద్యం రోజుల్లో బాబు గారు అధికారం లో ఉండింటే అని ఆలోచన వస్తేనే ఒళ్ళు జలదరిస్తుంది.

9, మే 2009, శనివారం

నడమంత్రపుసిరి

తమ దాకా వచ్చేదాకా తెలియదన్నట్లు ,ఈవాళ స్కూలు ఫీజులు పెంచినారని ధర్నాలు చేస్తూ గగ్గోలు పెడుతున్నారు .విద్య,వైద్యం,గృహవసతి మధ్య తరగతి వారికి అందుబాటులో లేకుండా చేసింది నడమంత్రపు సిరి వచ్చిన వాళ్ళే .ఉదాహరణకు :-సాఫ్టువేరు ఉద్యోగస్తులు,మిగతా వైట్ కాలర్ ఉద్యోగస్తులు (క్షమించాలి ).వీళ్ళకు ఏదయినా ఒక వస్తువు ధర కానీ,ఒక సేవ ధర కానీ తక్కువ ఉంటే ఆ వస్తువు కు నాణ్యత లేనట్లే .పది రూపాయల వస్తువు విలువ వంద రూపాయలు చెబితే అది చాలా నాణ్యమైనదని కొనుక్కుంటారు.అసలు విలువ చెబితే వీళ్ళు కొనరు.అందుకే మార్కెట్టులో వస్తువు,సేవల విలువలు అంతగా పెరిగి సామాన్యుని కి అందుబాటులో లేకుండా పోయినాయి.

నేను ఒక సారి ఒక స్కూలుకు అడ్మిషన్ కోసం గురించి వెళ్తే ఫీజు చాలా చెప్పారు.ఎంత ఎక్కువ అంటే ఇంజనీరింగు ఫీజు కంటే ఎక్కువ చెప్పారు. ఎందుకు అంత ఎక్కువ ఫీజు అడుగుతున్నారంటే "ప్రజలు ఇస్తున్నారు మేము తీసుకుంటున్నాము "ఇది స్కూలు వాళ్ల సమాధానం .అంటే విలువ పెంచింది ఈ నడమంత్రపు సిరి వాళ్ళే.

రోజున్న ఆర్ధిక మాంద్యానికి కూడా కారణం వీళ్ళే.వీళ్ళు ఆర్ధిక క్రమశిక్షణ పాటిమ్చకపోవడమే.





8, మే 2009, శుక్రవారం

దారి తప్పిన పెద్దపులి

ఒక పోరాటంలో ప్రజాస్వామ్య పంథా లేకుండా నిరంకుశంగా ఉంటే ఫలితం ,ఇవాళ శ్రీలంక లో తమిళుల పరిస్థితి ని చూసి తెలుసుకోవచ్చు.మితవాద తమిళ పార్టీ ల నాయకులను ,తనకు అడ్డం వచ్చిన ప్రతి నాయకుని చంపుకుంటూ పోయి ఇవాళ తమిళ టైగర్లు అతర్జాతీయ మద్దత్తును కోల్పోయారు.తమిళ ఉద్యమానికి వేల మంది తమిళ సోదరుల ప్రాణత్యాగం చేసిన తర్వాత కూడా శ్రీలంక లో తమిళుల న్యాయ సమ్మతమైన కోర్కె లను తీర్చుకోలేని పరిస్థితి వచ్చింది.ఒక వేల ఎల్టి టి ఈ నేతృత్వంలో తమిళ దేశం వచ్చినా అది నియంతృత్వం లోకి జారు కొని ,అక్కడి తమిళ ప్రజల పరిస్థితి పెనం మీద నుండి పొయ్యి లోకి పడినట్లవుతుమ్ది.

కావున ఒక సమస్యను పరిష్కారం చేసుకోవడానికి ప్రజాస్వామ్యయుతంగా చర్చలు తప్ప ఆయుధం కాదని చరిత్రలో మరో సారి ఋజువు అయ్యింది.

5, మే 2009, మంగళవారం

నిజమైన నాగరికత

ఈ మధ్యన మేము మా కుటుంబం తో కలిసి వారణాసి ,అలహాబాద్,అయోధ్య వెళ్లి వచ్చాము .మన దక్షిణ భారత దేశం ,ఉత్తర భారత దేశం తో పోల్చుకుంటే చాలా అభివృద్ధి చెందింది అని మనం అనుకుంటూ ఉంటాము.కాని మనం నేర్చు కోవలసినవి చాలా ఉన్నవి.ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ గురించి.అక్కడ ప్లాస్టిక్ వాడకం చాలా తక్కువ.ముఖ్యంగా టీ,కాఫీ,లస్సి లు వాళ్లు మట్టి పాత్రలలో ఇస్తున్నారు .ప్లాస్టిక్ కప్పు లు అస్సలు కనబడలేదు.దీని వలన గ్లోబలైసేషన్ వలన కుంటుపడిన మన చేతి వృత్తులను కా పా డిన వాళ్లము అవుతాము.దీని వలన మట్టి పాత్రలు తయారి మీద ఆధారపడిన కుమ్మరులను ఆదుకున్నట్లవుతుది.
అభివ్రిద్ది అంటే సాఫ్టు వేరు ఉద్యోగాలు,కార్లు మాత్రమే కాదు.భవిష్యత్తు తరాలకు వీలైనంత స్వచ్చమైన ప్రక్రుతి ని మిగల్చడం కూడా .అప్పుడే మనకు నిజమైన నాగరికత ఉన్నట్లు.