28, మే 2012, సోమవారం

అప్పుడు ఎందుకు సినిమాలు తీసినారు ?ఇప్పుడు ఎందుకు తీయడం లేదు?

రాజశేఖరరెడ్డి గారు అధికారం లో ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా లబ్ది పొంది కుమారుని కంపెనీలలో పెట్టుబడి పెట్టినారని జగన్ మీద ఆరోపణ.అప్పుడు పెట్టుబడి పెట్టినారు ఇప్పుడెందుకు పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు.తెలుగుదేశం పార్టీ అధికారం లో ఉన్నప్పుడు హరికృష్ణ ను హీరో గా పెట్టి సినిమాలు తీసినారు,ఇప్పుడెందుకు తీయడం లేదు అంటే ఏమి చెప్పాలి. అలా లాజిక్ లు తీసు కుంటూ పొతే అంతం ఉండదు.

12, మే 2012, శనివారం

పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలందరూ నైతికంగా వ్యాపారాలు చేసి పైకి వచ్చారా?

ఇప్పుడు మన దేశం లో పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్త లని మనం ఘనంగా ,గర్వంగా చెప్పుకుంటున్న వాళ్ళు అందరూ చాలా చిన్న స్థాయి నుండి వచ్చినవారే. ప్రపంచంలోని ధనవంతులలో మన వాళ్ళు ఇన్నో స్థానంలో ఉన్నారు,అన్నో స్థానంలో ఉన్నారు,అని మన దేశం లోని వాళ్ళు ఉప్పొంగి పోతుంటారు.మనదేశం లోని వాళ్లైనా ,ఇతర దేశం లోని వాళ్లైనా పారిశ్రామిక వేత్తలు రాజకీయ నాయకుల లేక బ్యూరోక్రసీ యొక్క అండదండలు లేకుండా ఇంత స్థాయి కి వచ్చేవారా? బడా పారిశ్రామిక వేత్తల కోసం ప్రభుత్వాలు చట్టాలు మార్చిన సందర్భాలు ఉన్నాయి.అవన్నీ రాజకీయ నాయకులు ,బ్యూరోక్రాట్లు తమ స్వలాభం మానుకొని చేసి ఉంటారా? పారిశ్రామిక వేత్తలు రాజకీయాలలోకి రాలేదు.అందువలన వాళ్ళు పొందేది వాళ్ళు పొందుతూ వీళ్ళకు ఇచ్చేది వీళ్ళకు ఇచ్చి ఆనందంగా ఉన్నారు.అంత నైతికంగా వ్యాపారాలు చేస్తే పారిశ్రామిక వేత్త ఎవరూ అంత పెద్ద స్థాయి కి పోలేరు. చివరికి సామాన్య ప్రజలు కూడా దేవస్థానం లో దేవుని దర్శనానికి ,వసతికి కూడా రాజకీయ నాయకులనో ,అధికారులనో ఆశ్రయించ వలసి వస్తున్నది.మనకు రావలసిన కనీస అవసరాలు కూడా రెకమెండేషన్ లేకుండా రావడం లేదు.వ్యవస్థ విధంగా అయినది.కొంత మంది ప్రజలు ,కొంత మంది రాజకీయ నాయకులు కడుపు మంట తో ఆత్మ ద్రోహం చేసికొని మాట్లాడుతున్నారు.