22, సెప్టెంబర్ 2011, గురువారం

ఎవరికోసం రూపాయికి కిలో బియ్యం ?

ఒక రూపాయకే కిలో బియ్యం అని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది.కానీ క్షేత్ర స్థాయిలో బియ్యం మెజారిటీ లబ్దిదారులు రేషన్ బియ్యం మేము తినడం లేదు ,మేము సన్న బియ్యం కొనుక్కుంటున్నాం అని గర్వంగా చెప్పుకుంటున్నారు.రేషన్ బియ్యాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు. బియ్యం రీసైకిల్ అయ్యి వాటిని సిటీ లోపట్టణాలలో ఉండే ప్రజలు కిలో ముప్పై రూపాయలు పెట్టి కొనుక్కొని తింటున్నారు ,.కావున పథకం చాలా దుర్వినియోగం అవుతున్నది.నిజమైన అవసరమైన లబ్దిదారులకు మాత్రమే అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసు కోవాలి.

16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

మీడియా అత్యుత్సాహం !

రోజు ఉదయం నుండి ఒక చానల్ అంబటి గురించి అదే పనిగా ప్రసారం చేస్తుంది.దేశం లో ఎన్నో సమస్యలు ఉండగా అంబటి విషయమే దేశాన్ని పట్టి పీడిస్తున్న అతి ముఖ్యమైన విషయం అన్నట్లు అతి విలువైన మీడియా కాలాన్ని వృధా చేస్తున్నారు.అంబటి అనే మనిషి ఒక వ్యక్తి మాత్రమే,అతను విధమైన రాజ్యాంగ పదవులలో లేడు.అతను ఒక వేళ తప్పు చేసి ఉన్నట్లయితే ఇబ్బందులకు గురైన వ్యక్తులు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేస్తే చట్టం తన పని తాను చేస్తుంది.అలా కాకుండా చానల్ అదే పనిగా విషయాన్నే ఉదయం నుండి చర్చను కొనసాగిస్తా ఉంటే భాధితులకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యం కాకుండా ఇంకేదో ఉద్దేశ్యం ఉన్నట్లు చూసే వాళ్లకు అనిపిస్తుంది.ఇప్పటికే మీడియా వాళ్లకు రకరకాల రాజకీయాలు అంటకట్టబడిఉన్నాయి.వాటిని నిజం చేయాలని చూడకూడదు.

రాజరిక పాలనే నయమా!

పూర్వం రాజుల పాలనలో రాజులు తమ రాజ్యం లోని ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి మారు వేషాలలో తిరిగి వారి కష్ట సుఖాలను తెలుసుకొని ప్రజల మనసెరిగి పరిపాలన సాగించారని విన్నాం.కాని ప్రజల కోసం ,ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రజాస్వామ్య ప్రభుత్వాలు అని చెప్పబడుతున్న ప్రస్తుత ప్రభుత్వాలు ,పాలకులు ప్రజల కోసం ఏమి చేస్తున్నారో గమనించాలి.ప్రజలు కట్టగలిగే పరిస్థితిలో ఉన్నారా లేదా అని చూడకుండా నిత్యం ఏదో ఒక రూపానా పన్నులు పెంచేస్తున్నారు.మొన్న వ్యాట్ ,తరచుగా పెట్రోల్ ,గ్యాస్ ధరలు,నిత్యావసరాల ధరలు పెరుగుతూ ఉన్నాయి.మెజారిటీ ప్రజలు విధంగా బ్రతుకుతున్నారో పాలకులకు పట్టడం లేదు.ప్రజలను ప్రభుత్వాలు ఏమీ పోషించడం లేదు.వాళ్ళ కష్టం వాళ్ళు పడి తమ బ్రతుకులు బ్రతుకుతూ ప్రభుత్వాలను,పాలకులను "వివిధ రకాల పన్నులు "కట్టి ప్రజలు పోషిస్తున్నారు.ఇప్పటికైనా పాలకులు ప్రజల మనసెరిగి పరిపాలన సాగించాలి లేదంటే తమ మనస్సులలోన ఉండే ఆవేదన ,ఆక్రోశం బ్రద్దలై పాలకులకు బుద్దిచెప్పే రోజు వస్తుంది.

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అశ్రునివాళి.

భౌతికంగా మా మధ్యన నీవు లేకున్నా ,మా మనసంతా నీవే ...రాజశేఖరా ,నీ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఇవే మా అశ్రునివాలులు .