12, ఆగస్టు 2010, గురువారం

ధరల పెరుగుదల ఎందుకు ఎన్నికల నినాదం కావడం లేదు?

ఒకప్పుడు ఉల్లిగడ్డల ధరలు పెరిగితే ప్రజలు ప్రభుత్వాలను కూల్హారు.కానీ నేడు ప్రతి నిత్యావసర వస్తువుల ధరలు మరియు కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి.అయినా కూడా అది ఎన్నికల నినాదం కావడం లేదు ,ఎందుకని?రెండురూపాయలకు కిలో బియ్యం ప్రభావమా?ఉపాధి హామీ పథకం ప్రభావమా?లేక ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందా?లేక పాలకులు ఎవరు వచ్చినా వాళ్ళ బ్రతుకులు ఏమీ మారవని నిర్వేదమా?

రైతులను ఆదుకోక పొతే ఆహార భద్రత ఎండమావే?

ఉపాధి హామీ పథకం ద్వారా రైతు లకు కూలీలు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు.ఉండే కొద్ది మంది కూలీలకు వారు చెప్పినంత కూలీ ఇవ్వవలసిన పరిస్థితి రైతు లకు దాపురించింది.నకిలీ విత్తనాలు,పురుగు మందులు ,ప్రక్రుతివైపరీత్యాలకు తోడు ఈ కూలీ ల ధరలు కూడా పెరిగి రైతుల పరిస్థితి మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా తయారైంది.ఇన్ని కష్టాలు పడి రైతులు పండించిన పంటకు మద్దత్తు ధర లేక రైతులు అప్పుల పాలవుతున్నారు.పాలకులు రైతులకు వ్యవసాయం లాభదాయకం చేయక పొతే ప్రభుత్వాలు కలలు కంటున్న ఆహార భద్రత ఎండమావే అవుతుంది.