13, నవంబర్ 2009, శుక్రవారం

చంద్రబాబు మరియు ఆయన మిత్రబృందం రెండు నాల్కల ధోరణి

మార్గదర్శి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ,ప్రభుత్వం ప్రజల రక్షణకు తనకున్న పరిధిలో చర్యలు తీసుకుంటే చంద్రబాబు గారు మరియు ఆయన మిత్రబృందం కలిసి ఈనాడు పత్రిక మీద మరియు మీడియా మీద దాడి అని ఎంతో హడావిడి చేసారు.అదే ఈ రోజున జగన్ మీద ఎన్నో ఆరోపణలు అదే చంద్రబాబు మరియు ఆయన మిత్ర బృందం సంధిస్తున్నారు.వాళ్లకు ఇప్పుడు మీడియా మీద దాడి గా కనిపించడం లేదా?ఎందుకంటే జగన్ కు కూడా మీడియా ఉంది. కాంగ్రెస్స్ పార్టీ వాళ్లకు చంద్రబాబు గారి లాగా గోబెల్స్ ప్రచారం చేయడం చేతకాదేమో.చంద్రబాబు గారి రెండు నాల్కల ధోరణి ఇప్పుడు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తున్నది.చంద్రబాబు గారు ఇటువంటి పనులు చేయడం వలన విశ్వసనీయత ఎప్పుడో పోగొట్టుకున్నారు. మిగతా ప్రతిపక్ష నాయకులు కూడా ఆయన వెంట నడిస్తే, వీళ్ళు కూడా ప్రజలలో విశ్వసనీయత పోగొట్టుకొని ప్రజలలో చెల్లకుండా పోతారు.

11, నవంబర్ 2009, బుధవారం

2012 లో యుగాంతం -మార్కెట్ వర్గాల కుట్ర

2012 లో యుగాంతం గురించి మధ్యన మీడియా లో చాలా హడావిడి కనిపిస్తుంది.ప్రతిదినమూ విషయాన్ని ప్రసారంచేస్తూ ,ప్రజలను చాలా భయానికి గురి చేస్తున్నారు.దీన్ని నిశితంగా పరిశీలిస్తే దీని వెనుక మార్కెట్ వర్గాల కుట్ర ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆర్ధిక మాంద్యం పరిస్థితులలో మార్కెట్లో డబ్బులు లేవు కాబట్టి ,ప్రజలను ఎలాగోలా భయపెట్టి వాళ్ల దగ్గరఉన్నడబ్బు బయటికి తీయించి ఖర్చు పెట్టించాలనే యోచన కనిపిస్తున్నది. విధంగా ఆర్ధిక మాంద్యం నుండి బయటపడాలనే వ్యూహం ఉన్నట్లు కనిపిస్తున్నది.