11, మార్చి 2009, బుధవారం

వీళ్ళా మన పాలకులు

ఎల'క్షణాలు ' తిరిగి మొదలయ్యాయి.ఊరు వాడా అంతా హోరెత్తిస్తున్నారు.ప్రజాసేవ చేయడానికి పరుగులు పెడుతున్నారు.

కాని ఏ అభ్యర్థి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం,పాత రౌడినో లేక ఖూనికోరో లేక అక్రమ వ్యాపారాలవలన కోట్లు సంపాదించినవాడో కనిపిస్తున్నాడు.వీళ్ళకు వోట్లు వేయాలంటే వెగటు పుడుతుంది. కాబట్టి వోటింగ్ యంత్రం లో ఇంకొక బటన్ పెడితే బాగుంటుంది.నిల్చిన అభ్యర్థులెవరూ ఇష్ఠంలేని వాళ్లు ఆ బటన్ నొక్కుతారు. మొత్తం వోట్లు లెక్కించిన తర్వాత కొంత శాతం వోట్లు ఇష్ఠం లేని బటనుకు వస్తే ఆ ఎన్నికను రద్దు చేసి తిరిగి నిర్వహించాలి.ఆ ఇష్ఠం లేని అభ్యర్థులను కొన్ని సంవత్సరాలు ఎన్నికలలో పాల్గొనకుండా డిబార్ చేసి,ఆ ఎన్నికల ఖర్చును ఆ గుర్తింపు పొందిన పార్టీలనుండి వసూలు చేయాలి.

ఇలా చేస్తే పార్టీలు కొంచమైనా మంచివాల్లను తమ అభ్యర్థులుగా నిలబెడతాయి.ఇలాగైనా ప్రజాస్వామ్యం కొంతైనా మెరుగు పడవచ్చు.దీనిమీద ఎలెక్షన్ కమిషన్ దృష్టి పెడితే బాగుంటుంది.

8, మార్చి 2009, ఆదివారం

తల్లులార వందనాలు

అందరికి వందనాలు.
  • ఆడో ,మగో నిర్ణయించు కున్నాక పిల్లలను కనే పద్దతి మాను కుందాం.
  • భ్రూణ హత్యలను ఆపేద్దాం.
  • ప్రకృతి ప్రతిరూపమైన స్త్రీలను గౌరవిద్దాం.
  • ఆసిడ్ దాడులను ఆపేద్దాం,మరియు తీవ్రంగా ఖండిద్దాం.

మహిళా దినోత్సవం సందర్భంగా అందరికి శుభాకాంక్షలు.

6, మార్చి 2009, శుక్రవారం

చంద్రబాబు గారి ఉత్తుత్తి హామీలు

తినడానికి చేపలు ఇవ్వకుండా చేపలు పట్టే విధానం నేర్పించాలని ఒక నానుడి ఉంది.తెలుగుదేశం పార్టి వాళ్ళు ప్రజలను సోమరిపోతులలాగా మార్చాలని చూస్తున్నట్టున్నారు.ఐనా కానీ చంద్రబాబు గారి మాటలు ప్రజలు ఎవరూ నమ్మే స్థితిలో లేరు.ఆయన పరిపాలించినపుడు ఏం చేసారో ప్రజల మనో ఫలకం నుండి ఇంకా తొలగిపోలేదు.
ఇటువంటి సాధ్యం కాని హామీలను ఇచ్హి ఎలాగోలా అధికారానికి రావాలని ఆయన కలలు కంటున్నారు.
ప్రజలు చాలా తెలివైనవాళ్ళు.ప్రజలు మీరు ఇస్తే తీసుకునే భిక్షగాళ్ళు కారు.వాళ్ళు మీకు అధికారం ఇచ్హేది శాశ్వతమైన పథకాలు ఉదా:- విద్య,వైద్యం,స్థిరమైన ఆర్థిక పరిస్థితి కోరుకుంటారు.
కాబట్టి ప్రజలు నవ్విపోకుండా పద్దతి గల హామీలు ఇస్తే బావుంటుంది.