5, మార్చి 2008, బుధవారం

నయా కుబేరులు

నేను ఈ మధ్య షాపింగ్ చేసి అక్కడే ఉన్నచెరుకు రసం షాప్ కు వెళ్ళాను.చెరుకు రసం తాగుదామని టోకెన్ తీసుకొన్నాను.రకరకాల రుచులలో అక్కడ చెరుకు రసం దొరుకుతుంది.దాని విలువ పది రూపాయలు . షాప్ ఒక్క ఈగ కూడా లేకుండా చాలా శుబ్రంగా ఉంది.రసం త్రాగుతూ అక్కడే నిల్చున్నాను.అంతలో ఒక నవ నాగరిక యువతి (?) అక్కడికి వచ్చి ఎంత అని ఇంగ్లిషు లో అడిగింది.షాపతను పది రూపాయలు అని చెప్పాడు.అప్పుడు ఆ యువతి దట్సాల్ అని ఆశ్చర్యంగా అంది .

ఇటువంటి వాళ్లు ఈమధ్య ఎక్కువయ్యారు.ఒక వైపు ద్రవ్యోల్బణం ఎక్కువవుతుందని ప్రభుత్వం గోల పెడుతుంటే ,వీళ్ళు వస్తువు ధరను అమాంతం పెంచేస్తున్నారు .ఆ అమ్మాయి అదే రసం వంద రూపాయలు అంటే చాలా ఆనందంగా త్రాగుతుంది.తిరిగీ ఆ అమ్మాయి ఆ రసం షాపు వైపు రాకపోవచ్చు .ఎందుకంటే వస్తువు విలువ ఎంత ఎక్కువ వుంటే అంత మంచిదనే అభిప్రాయం తో వున్నారు.

ఇటువంటి వాళ్ల వల్లనే స్కూలు ఫీజులు ,వైద్యం ,ఇంటి స్థలాల విలువలు అమాంతం పెరిగినాయి.ఇటువంటి నయా కుబేరులు కళ్లు భూమి మీద పెట్టుకొని నడిస్తే అందరికి మంచిది.

పేద,మధ్యతరగతి వాళ్ళను కూడా భూమ్మీద కొన్నాళ్ళు బ్రతికేందుకు అవకాశం ఇద్దాం..